-
Lok Sabha Election 2024: ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
రాయ్బరేలీ: కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న అబద్ధాలు, మోసపూరిత విధానాలతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని, వారంతా మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల సమస్యలు, రైతన్నలు వెతలు, నిరుద్యోగుల దుర్భర బతుకుల గురించి మాట్లాడకుండా, కేవలం అనవసర విషయాలు మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో జరిగిన పరిణామాలపై వాస్తవాల ఆధారంగా కాకుండా కేవలం సొంత ఊహాలపై ఆధారపడి ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, ప్రజలంటే ఆయనకు గౌరవం లేదని తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గంలో తన సోదరుడు రాహుల్ గాంధీ విజయం కోసం శ్రమిస్తూ ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా ఉన్న ప్రియాంక గాంధీ బుధవారం పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రధాని మోదీకి నిజంగా ధైర్యం ఉంటే దేశంలో తాండవిస్తున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతాంగం కష్టాలపై మాట్లాడాలని సవాలు విసిరారు. ప్రియాంక ఇంకా ఏం చెప్పారంటే.. బీజేపీ అంచనాలు తల్లకిందులే.. మీడియాలో గానీ, రాజకీయ ప్రచార వేదికలపై గానీ ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదు. తమ కష్టనష్టాలపై చర్చ జరగాలని, పరిష్కార మార్గాలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపడానికి, ధరలు తగ్గించడానికి, రైతులు, కారి్మకుల సంక్షేమానికి, తమ కష్టాలు కడతేర్చడానికి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకోవాలని వారు ఆశిస్తున్నారు. దేశంలో ‘మార్పు’ గాలులు బలంగా వీస్తున్నాయి. ఎన్డీయేకు 400 సీట్లు, బీజేపీకి సొంతంగా 370 వస్తాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చివరకు వారి అంచనాలన్నీ తల్లకిందులవుతాయి. మోదీ సమాధానం చెప్పగలరా? దేశంలో నిరుద్యోగం గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ప్రధాని మోదీ ఈ సమస్యను పట్టించుకోకుండా, కాంగ్రెస్ వస్తే ప్రజల ఆస్తులు లాక్కుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ఏయే సంస్థలను నిర్మించిందో, ఏయే పథకాలను సొంతంగా ప్రారంభించిందో నరేంద్ర మోదీ చెప్పగలరా? కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచి్చన పథకాల పేర్లు మార్చడం తప్ప ఆయన చేసిందేముంది? రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం.. ఈ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలే ప్రకటిస్తున్నారు. వారి ఆటలు సాగనివ్వం. రాజ్యాంగాన్ని కచి్చతంగా కాపాడుకుంటాం. మనకు ఓటు హక్కు రాజ్యాంగమే ఇచి్చంది. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు రాజ్యాంగమే ఇచి్చంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగమే బలోపేతం చేసింది. రాజ్యాంగాన్ని మార్చేసి, ప్రజల హక్కులు కాలరాస్తామంటే మేము సహించబోము. ప్రధానమంత్రి కాబట్టి నవ్వలేకపోతున్నాంకాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల ఇళ్లు, బంగారం, భూములు, గేదెలు దోచుకుంటారని ప్రధానమంత్రి అంటున్నారు. నిజంగా ప్రధానమంత్రి కాకుండా ఇంకెవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే బిగ్గరగా నవ్వుకునేవాళ్లం. ప్రధానమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలి కాబట్టి దురదృష్టవశాత్తూ నవ్వుకోలేకపోతున్నాం. అబద్ధాలను కూడా నిజాలుగా ప్రజలను నమ్మించడంలో నరేంద్ర మోదీ ఆరితేరిపోయారు. -
Lok sabha elections 2024: కాంగ్రెస్లో ప్రియాంకం
ప్రియాంకా గాంధీ వాద్రా. తండ్రి రాజీవ్ హత్యకు గురైనప్పుడు సమాజంతో పాటు మొత్తం ప్రపంచంపైనే కోపం పెంచుకున్న అమ్మాయి. ఎదిగే కొద్దీ క్షమాగుణం విలువను తెలుసుకున్నారు. ప్రధాని పదవి స్వీకరించాలని తల్లి సోనియాను కాంగ్రెస్ నేతలంతా కోరితే తననూ హత్య చేస్తారని భయపడి ఏడ్చిన సగటు యువతి. ఇప్పుడదే కాంగ్రెస్కు ట్రబుల్ షూటర్గా మారారు. అచ్చం నానమ్మ ఇందిర పోలికలను పుణికిపుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తారా, రారా అన్న చర్చ ఆమె పద్నాలుగో ఏట నుంచే మొదలైంది! తనకు రాజకీయాలు సరిపడవని మొదట్లో గట్టిగా నమ్మారామె. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లో పూర్తిగా తలమునకలయ్యారు. గాంధీల కంచుకోటైన యూపీలోని రాయ్బరేలీలో తల్లికి బదులుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారంటూ ప్రచారమూ జరుగుతోంది. రాజకీయ జీవితం ప్రియాంక తొలుత క్రియాశీల రాజకీయాల్లో అంతగా పాల్గొనలేదు. తల్లి, సోదరుల లోక్సభ నియోజకవర్గాలైన రాయ్బరేలీ, అమేథీలకు వెళ్లేవారు. 2004 లోక్సభ ఎన్నికలలో సోనియాకు ప్రచార నిర్వాహకురాలిగా వ్యవహరించారు. రాహుల్ ప్రచారాన్ని కూడా పర్యవేక్షించారు. 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు లోక్సభ స్థానాల పరిధిలోని పది అసెంబ్లీ సీట్లలో ప్రచారం మొదలుకుని సీట్ల కేటాయింపులు, అంతర్గత పోరును పరిష్కరించడం దాకా అన్నీ తానై వ్యవహరించారు. 2019లో యూఈ తూర్పు భాగానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత యూపీ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు. మహిళలకు 40 శాతం టికెట్ల డిమాండ్తో ‘లడ్కీ హూ, లడ్ సక్తీ హూ’ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే చవిచూసింది. ఆ అనుభవం తన జీవితంలో స్థితప్రజ్ఞత తీసుకొచి్చందంటారు ప్రియాంక. అయితే 2022 హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారానికి సారథ్యం వహించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లోనూ క్రియాశీల పాత్ర పోషించారు. హిందీ సాహిత్యం.. బౌద్ధం... ప్రియాంక 1972 జనవరి 12న జని్మంచారు. డెహ్రాడూన్ వెల్హామ్ బాలికల పాఠశాలలో చదివారు. తర్వాత భద్రతా కారణాలతో రాహుల్తో పాటు ఢిల్లీలోని డే స్కూల్కు మారారు. ఇందిర హత్యానంతరం ఇద్దరూ ఇంట్లోనే చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీ జీసస్ అండ్ మేరీ నుంచి ప్రియాంక సైకాలజీలో డిగ్రీ చేశారు. బౌద్ధ అధ్యయనంలో మాస్టర్స్ చేశారు. నానమ్మను అత్యంత శక్తివంతమైన మహిళగా చెబుతారు. బాల్యంలో నానమ్మతో రాహులే ఎక్కువగా గడపడం చూసి ఈర‡్ష్య పడేదాన్నంటూ నవ్వేస్తారు. ప్రియాంక బాల్యం ఎక్కువగా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తల్లి తేజీ బచ్చన్తో గడిచింది. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ కవిత్వం చదివి హిందీ సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ప్రేమ్చంద్ సాహిత్యాన్ని ఇష్టపడతారు. ఖాళీ దొరికితే పుస్తకాలు పట్టుకుంటారు. బౌద్ధ తత్వశా్రస్తాన్ని ఆచరిస్తారు. 1999లో రాజకీయాల్లోకి రావాల్సి వచి్చనప్పుడు పది రోజులపాటు మెడిటేషన్ చేసి నిర్ణయం తీసుకున్నారు. 1997లో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను పెళ్లాడారు. వారికిద్దరు పిల్లలు. ప్రియాంక రేడియో ఆపరేటర్ కూడా! -
అమాయకుల ఇళ్లపైకే బుల్డోజర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా నిప్పులు చెరిగారు. బుల్డోజర్లతో అమాయక ప్రజల ఇళ్లను కూలి్చవేస్తున్నారని, ప్రభుత్వ నిర్వాకం వల్ల నేరగాళ్లు మాత్రం నిక్షేపంగా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఆమె శనివారం ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో తన సోదరుడు రాహుల్ గాంధీతోపాటు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రైతుల మొర ఆలకించే తీరిక పాలకులకు లేదా? అని నిలదీశారు. ఉత్తరప్రదేశ్లో రైతులపైకి జీపులు నడిపించి చంపిన నాయకుల ఇళ్లపైకి, మహిళలను వేధించిన దుర్మార్గుల ఇళ్లపైకి, ప్రశ్నాపత్రాలను లీక్ చేసినవారి ఇళ్లపైకి బుల్డోజర్లు వెళ్లడం లేదని ధ్వజత్తారు. అమాయకుల ఇళ్లు మాత్రమే బల్డోజర్ల కింద నలిగిపోతున్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులు, రైతులకు అన్యాయం జరుగుతుండడం వల్లే యాత్రలో ‘న్యాయ్’ పదాన్ని చేర్చామన్నారు. ఆదివారం ఆగ్రాలో యాత్రలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఆ పిల్లలు రీల్స్ చూడరు: రాహుల్ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఇక యువత రోజుకు 12 గంటలు మొబైల్ ఫోన్లు చూడక ఏం చేస్తారని రాహుల్ ప్రశ్నించారు. ఆయన శనివారం యూపీలోని సంభాల్లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో మాట్లాడారు. రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారని యువతను ప్రశ్నించగా 12 గంటలని బదులిచ్చారు. దాంతో రాహుల్ ఈ మేరకు స్పందించారు. సంపన్నులు, బడా వ్యాపారవేత్తల పిల్లలు ఫోన్లలో రీల్స్ చూడరని, రోజంతా డబ్బులు లెక్కపెట్టుకొనే పనిలోనే ఉంటారని అన్నారు. శనివారం యూపీలోని మొరాదాబాద్లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్, ప్రియాంక -
వినోదం కోసమే ఆమె మధ్యప్రదేశ్కు వస్తారు
భోపాల్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో సినిమాల గురించి మాట్లాడటంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకా గాంధీకి ప్రజాస్వామ్యం అన్నా ప్రజలన్నా గౌరవం లేదన్నారు. మధ్యప్రదేశ్కు ఆమె వినోదం కోసమే వస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికలను ముఖ్యమైన విషయంగా కాంగ్రెస్ భావించడం లేదు. నటన, జై– వీరూ లేదా ప్రధాని మోదీపై సినిమా తీయడమే ఎన్నికల అంశమని అనుకుంటున్నారా అని ప్రియాంకా గాంధీని అడగాలనుకుంటున్నా. ఎన్నికలను ఆమె తమాషా అనుకుంటున్నారు. ఇది ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే’అని పేర్కొన్నారు. ఓటమిని ఊహించిన కాంగ్రెస్ నేతలు ఇటువంటి వ్యాఖ్యలకు దిగుతున్నారన్నారు. గురువారం దటియా నియోజకవర్గంలోని జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక.. సీఎం చౌహాన్ను ప్రపంచ ప్రఖ్యాత నటుడిగా అభివర్ణించారు. ఆయన అమితాబ్ను సైతం మించిపోయేవారన్నారు. అభివృద్ధిని గురించి ప్రస్తావించినప్పుడల్లా కమెడియన్లా ప్రవర్తిస్తారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని సైతం ఆమె వదల్లేదు. ప్రతిపక్షంలో ఉండగా తనను వేధించారని చెప్పుకుని మోదీ ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయనపై మేరే నామ్ పేరుతో సినిమా కూడా తీయొచ్చని ప్రియాంక అన్నారు. -
బీజేపీకి సీఎం అభ్యర్థే లేరు
జైపూర్: రాజస్తాన్లో బీజేపీ చెల్లాచెదురయిందని, అందుకే ఆ పార్టీకి సీఎం అభ్యర్థే లేకుండాపోయారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఎద్దేవా చేశారు. దుంగార్పూర్ జిల్లా సగ్వారాలో శుక్రవారం ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. బీజేపీకి సీఎం అభ్యర్థి దొరక్క ప్రధాని మోదీ చేసేది లేక తన పేరుతోనే ఓట్లభ్యర్థిస్తున్నారన్నారు. మతం, మనోభావాలను వాడుకుంటూ ఓట్లడిగే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ పాలనలో ద్రవ్యోల్బణం కారణంగా రైతులతోపాటు ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు. ‘దేశంలో రైతుల సరాసరి ఆదాయం రోజుకు కేవలం రూ.27 మాత్రమే కాగా, ప్రధాని మోదీ ప్రత్యేక మిత్రుడు అదానీ మాత్రం రోజుకు రూ.16 వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం వద్ద రైతు రుణాలు రద్దు చేసేందుకు మాత్రం డబ్బుల్లేవు’అని ధ్వజమెత్తారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం వెన్నుచూపుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల కోసం ద్రవ్యోల్బణ సహాయక శిబిరాలను నిర్వహిస్తుందని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ నిలిపివేస్తుందని ప్రియాంకా గాంధీ ప్రజలను హెచ్చరించారు. -
భారత జాతీయతకే తీరని అవమానం..సిగ్గుగా ఉంది: ప్రియాంక గాంధీ ధ్వజం
ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటింగ్కు భారత్ గైర్హాజరు కావడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్యం, అహింస అనే ధర్మాలకు ప్రతీక అయిన భారత దేశం దీనికి దూరంగా ఉండటం సిగ్గు చేటు అంటూ మోదీ సర్కార్పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె శనివారం ట్విటర్ ద్వారా ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. అహింస, సత్యం అనే సిద్దాంతాల పునాదుల మీదే మన దేశం ఆవిష్కృతమైంది. ఈ సిద్ధాంతాల కోసమే స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. దేశానికి స్వేచ్ఛని ప్రసాదించారు. మన జాతీయతకు నిదర్శనమైన ఈ సూత్రాలకోసం జీవితమంతా నిలబడిన దేశానికి భిన్నంగా మోదీ సర్కార్ వ్యవహరించిందంటూ ట్వీట్ చేశారు. పాలస్తీనాలో వేలాది మంది పురుషులు మహిళలు, పిల్లలను హత మార్చడాన్ని మౌనంగా చూస్తూ ఉండటం భారత దేశ మూల సూత్రాలకే విరుద్ధమని మండిపడ్డారు. కంటికి కన్ను అనే విధానం మొత్తం ప్రపంచాన్ని అంధత్వంలోని నెట్టేస్తుందన్న గాంధీజీ కోట్ను తన ప్రకటనకు ప్రియాంక జోడించారు. కాగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజా స్ట్రిప్లో బాధితులకు ఎలాంటి అవరోధం లేకుండా సహాయ కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన ‘మానవతావాద సంధి’ తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడి చేసిన ఉగ్రవాద సంస్థ హమాస్ పేరును ఈ తీర్మానంలో ప్రస్తావించకపోవడమే ఇందుకు కారణమని భారత్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్-హమాస్ నేపథ్యంలో గాజా స్ట్రిప్లో ఎలాంటి అవరోధాలు లేకుండా సహాయ కార్యక్రమాలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ జోర్డాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. గాజా స్ట్రిప్కు సహాయం అందించాలని ,పౌరులకు రక్షణ కల్పించాలని కూడా తీర్మానం డిమాండ్ చేసింది. పౌరుల రక్షణ. చట్టపరమైన, మానవతా బాధ్యతలకు సమర్థన’ అనే పేరిట ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్, రష్యా, దక్షిణాఫ్రికాతో సహా 40కిపైగా దేశాలు మద్ధతుగా నిలిచాయి. అనుకూలంగా 120 దేశాలు, వ్యతిరేకంగా 14 దేశాలు ఓటువేశాయి. 45 దేశాలు ఓటింగ్లో పాల్గొనలేదు. భారత్తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకేతోపాటు పలు దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. “An eye for an eye makes the whole world blind” ~ Mahatma Gandhi I am shocked and ashamed that our country has abstained from voting for a ceasefire in Gaza. Our country was founded on the principles of non-violence and truth, principles for which our freedom fighters laid down… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 28, 2023 -
మానవత్వం మేల్కొనేదెప్పుడు?
న్యూఢిల్లీ: పాలస్తీనాలోని గాజాలో కొనసాగుతున్న రక్తపాతం, తీవ్ర హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లంఘనకు గురికాని అంతర్జాతీయ చట్టం కానీ, నిబంధన కానీ ఒక్కటీ లేదన్న విషయం ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి తేటతెల్లమవుతోందన్నారు. ‘ఎందరు చిన్నారులు ప్రాణత్యాగం చేయాలి? ఇంకెందరు మరణించాలి? మానవత్వం అనేది ఉందా? మానవత్వం మేల్కొనేది ఇంకెప్పుడు?అని ఆమె శుక్రవారం ‘ఎక్స్’లో ప్రశ్నించారు. గాజాలో మూడు వేల మంది అమాయక చిన్నారులు సహా మొత్తం ఏడు వేల మందికిపై ప్రాణాలు కోల్పోయినప్పటికీ రక్తపాతం, హింసకు పుల్స్టాప్ పడకపోవడంపై ప్రియాంకా గాంధీ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. -
ప్రియాంక గాంధీకి ఈసీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాకు గురువారం కేంద్రం ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకుగానూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి.. ప్రియాంక గాంధీ తప్పుడు ప్రకటనలు చేశారని అక్టోబర్ 21వ తేదీన ఈసీఐకి ఫిర్యాదు వెళ్లింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. తన ప్రసంగం ద్వారా రెచ్చగొట్టేలా ఆమె మాట్లాడరని ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. ఈ నేపథ్యంలో షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఈసీ.. అక్టోబర్ 30 సాయంత్రలోపు నోటీసులకు స్పందించాలని ఆమెను కోరింది. నవంబర్ 25వ తేదీన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అక్టోబర్ 20వ తేదీన దౌసా బహిరంగ సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగించారు. ‘‘మోదీ ఓ ఆలయానికి ఇచ్చిన విరాళం కవర్ను తెరిస్తే.. అందులో కేవలం 21రూ. మాత్రమే ఉన్నాయి. టీవీలో ఆ వార్త చూశా. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ, బీజేపీ ప్రజలకు ఇచ్చే హామీలు కూడా ఆ ఎన్వెలప్ లాంటివే. అందులో ఏమీ ఉండవు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రియాంక ప్రసంగానికి సంబంధించిన వీడియోను సైతం ఫిర్యాదుకు జత పరిచింది బీజేపీ. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆమెకు ఈసీ నోటీసులు జారీ చేసింది. వైరల్గా వీడియో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది ప్రారంభంలో రాజస్థాన్ భిల్వారా దేవ్ నారాయణ ఆలయాన్ని సందర్శించారు. దేవ్ నారాయణ జయంతి సందర్భంగా జనవరి 28న ఆలయాన్ని సందర్శించిన మోదీ అక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అలాగే హుండీలో విరాళాలు కూడా సమర్పించారు. అయితే ఈ ఆలయం హుండీ ప్రత్యేక సందర్భాల్లోనే తెరుస్తారు. భాద్రపద మాసం (హిందూ క్యాలెండర్ ప్రకారం) ఛత్ తిథి కావడంతో సెప్టెంబర్ 25వ తేదీన హుండీ తెరిచి.. విరాళాలు లెక్కించారు. అయితే అందులో ప్రధాని మోదీ పేరుతో ఉన్న కవరు కనిపించింది. ఆలయ పూజారి హేమ్రాజ్ పోస్వాల్ స్వయంగా కవర్ను తెరచి చూడగా ఇందులో కేవలం రూ. 21 రూపాయలు మాత్రమే కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
స్పష్టమైన విజన్ లేదు.. మోదీ సంక్షేమ పథకాలన్నీ ఉత్త డొల్ల: ప్రియాంక గాంధీ
జైపూర్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఉత్త డొల్ల అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. మోదీ పాలనలో సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించే నాథుడే లేకుండాపోయాడని అన్నారు. కేవలం కొద్దిమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ లేదని, ఉపాధి అవకాశాలను కల్పించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఆమె బుధవారం రాజస్తాన్లోని ఝన్ఝున్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కుల గణనపై బీజేపీ నాయకులు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ‘ఖాళీ లిఫాఫా' మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా మోదీ ఖాళీ లిఫాఫా (కవరు) అంటూ మోదీని ఎద్దేశా చేశారు. 10 ఏళ్ల తరువాత మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందంటూ మండిపడ్డారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. . ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడానికి బీజేపీ మతాలు, కులాల గురించి మాట్లాడుతోందని ఆక్షేపించారు. అధికారం కాపాడుకోవడానికి ప్రజలను అణచివేసే చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి సొంత లాభం కోసం పాకులాడే నాయకులను ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లకు ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార సభలో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మాట్లాడారు. రాష్ట్రంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రెండు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500కు వంట గ్యాస్ సిలిండర్ అంద జేస్తామని చెప్పారు. అలాగే అర్హులైన మహిళలకు సంవత్సరానికి రూ.10,000 చొప్పున గౌరవ భృతి ఇస్తామని వెల్లడించారు. ఇంటి పెద్ద అయిన మహిళలకు ఈ గౌరవ భృతి అందుతుందని పేర్కొన్నారు. -
దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలివి: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ బస్సు యాత్ర.. ములుగు బహిరంగ సభ లైవ్ అప్డేట్స్ 06:55PM ములుగు సభలో రాహుల్ గాంధీ ప్రసంగం ►రామప్ప ఆలయం అద్భుతంగా ఉంది ►ఇంత అందమైన ఆలయాన్ని ఎప్పుడు చూడలేదు ►దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి ►కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ ఇచ్చింది ►రాజకీయ పార్టీలు తమకు నష్టం జరిగే నిర్ణయం తీసుకోవు ►కానీ, కాంగ్రెస్ ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంది ►తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ గౌరవించింది ►కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి మోసం చేశారు ►అందరికీ ఉద్యోగాలిస్తామని కేసీఆర్ మోసం చేశారు ►ధరణి పోర్టల్లో అవినీతి జరిగింది ►రూ.లక్ష రుణమాపీ అన్నారు.. గుర్తుందా? చేశారా? ►కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు తన జేబులో వేసుకున్నారు ►దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారు ►బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే ►తెలంగాణ కోసం మరికొన్ని గ్యారెంటీలను ప్రకటిస్తున్నాం ►మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల మహిళలకు రూ.2,500 ►రూ.500కే గ్యాస్ సిలిండర్ ►ఇళ్లకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ఉచితం ►తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములకు 250 గజాల జాగా ►నిరుద్యోగ యువతను కేసీఆర్ మోసం చేశారు ►సీఎం ఇస్తామన్న మూడెకరాల భూమి వచ్చిందా? ►కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం చెప్పామో.. అదే చేశాం ►రాజస్థాన్లో ఉచిత వైద్యం అన్నాం .. ఇస్తున్నాం, అదీ దేశంలోనే అత్యుత్తమ సేవలతో! ►ఛత్తీస్గడ్లో రైతులకు రుణమాఫీ చేశాం ►రూ.2,500 మద్దతు ధరతో వరి కొనుగోలు చేస్తున్నాం ►కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నాం ►ప్రతీనెలా మహిళలు, రైతుల ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తున్నాం ►జల్, జమీన్, జంగల్ హామీలను కాంగ్రెస్ నెరవేర్చింది ►బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు చెల్లాయి ►పోడు భూములు, అసైన్డ్ భూముల విషయంలో న్యాయం చేస్తాం ►అభివృద్ధి అనే గ్యారెంటీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది ►తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే 06:26PM ములుగు సభలో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగం ►రామప్ప లాంటి అందమైన గుడిని ఎప్పుడూ చూడలేదు ►ఉద్యోగాలు, నిధుల కోసం మీరు కలలు కన్నారు ►మీ కలలు సాకారం అవుతాయని నమ్మి బీఆర్ఎస్కి ఓటేశారు ►పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని.. భవిష్యత్తు మారుతాయని అనుకున్నారు ►బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది ►తెలంగాణ కలను బీఆర్ఎస్ నాశనం చేసింది ►తెలంగాణ ఏర్పడినా సామాజిక న్యాయం జరగలేదు ►మీ కలను కాంగ్రెస్ అర్థం చేసుకుంది ►సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ సిద్ధాంతం ►కాంగ్రెస్ హయాంలోనే ఐఐటీ, ఐఐఎంలు వచ్చాయి ►తెలంగాణ కోసం కాంగ్రెస్ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది ►తెలంగాణ ఇస్తే రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సోనియాగాంధీకి తెలుసు ►అయినా సోనియా గాంధీ మీ కోసం నిర్ణయం తీసుకున్నారు ►దూరదృష్టితో తెలంగాణ ఏర్పాటునకు కృషి చేశారు ►రాజకీయ లబ్ధి కోసం కాకుండా.. ప్రజల కోసం నిర్ణయం తీసుకున్నారు ►మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చేందుకే నిర్ణయం తీసుకున్నారు ►తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ► లక్ష ఉద్యోగాల్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది ►నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే.. వారి వ్యక్తిత్వాన్ని అగౌరవ పరుస్తున్నారు ►కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ►తెలంగాణలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది ►వరి రూ. 2,500, మొక్కజొన్నకు రూ.2,200 మద్దతు ధర ఇస్తాం ►రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం ► ఇందిరమ్మ రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తాం ►బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారి కుటుంబానికే ప్రాధాన్యత దక్కింది ►అమరులను కాంగ్రెస్ గౌరవిస్తుంది.. శ్రీకాంత్ చారికి నా నివాళి ►బీఆర్ఎస్ కేబినెట్లో ముగ్గురే బీసీ మంత్రులు ఉన్నారు ►గల్ఫ్ బాధితుల్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడతాం ►ఆదివాసీల హక్కుల్ని బీఆర్ఎస్ పెద్దలు లాక్కుంటున్నారు ►మీ భూముల నుంచి మిమ్మల్ని వెళ్లగొడుతున్నారు ►మీకు రావాల్సిన డెవలప్మెంట్ ఫండ్ను మళ్లిస్తున్నారు ►ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గిరిజనులకు ఇళ్లు ►గత కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పోడు భూముల పట్టాలు ఇచ్చింది ►18 ఏళ్లు దాటిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాం ►ఈ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల భర్తీపై దృష్టి పెట్టలేదు ►రకరకాల మాఫియాలను ప్రొత్సహించింది ►మీ కోసం ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ తెచ్చింది ►గ్యారెంటీలు ఇస్తామన్న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పనులు మొదలుపెట్టాం 06:10PM ములుగు సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్ ►తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు ►అందుకే సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు ►ఆడబిడ్డల కోసం మహాలక్ష్మి పథకం తెస్తాం ►ప్రతీ నెల 1వ తేదీన రూ. 2,500 ఆడబిడ్డల ఖాతాలో జమ చేస్తాం ►అధికారంలోకి వస్తే రూ.500 కే సిలిండర్ఇస్తాం ►రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు రూ.15వేలు జమ చేస్తాం ►ప్రతీ ఇంటికి ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపు ఫ్రీ ►మన బతుకులు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి ►కళ్యాణ లక్ష్మి పేరుతో ఆడబిడ్డలకు తులం బంగారం ►ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని కరీంనగర్ గడ్డ నుంచి సోనియా గాంధీ ప్రకటించారు ►ఇచ్చిన మాటకు సోనియా తెలంగాణ ప్రకటించారు ►తెలంగాణలో ఎక్కడ చూసిన అరాచకం, అవినీతి అధిపత్యం రాజ్యమేలుతోంది ►అవినీతి పాలనను పాతాలంలోకి తొక్కాలి ►తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని గాంధీ కుటుంబం వచ్చింది ►ఆరు గ్యారంటీ స్కీమ్ లతో ప్రజల ముందుకు వచ్చారు ►మహాలక్ష్మి గ్యారంటీ స్కీమ్ మహిళల కోసం సోనియా గాంధీ తెచ్చారు ►ప్రతినెల మహిళలకు 2500 ఇచ్చేందుకు సోనియా ముందుకు వచ్చారు ►500 రూ.లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే భాద్యత సోనియా గాంధీ తీసుకున్నారు ►రైతులకు మద్దతు ధర తో పాటు క్వింటాల్ కు 500 బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది ►నిరుద్యోగ యువతకు యువ వికాస్ పథకం క్రింద 5 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది ►షాదీముబారక్ కళ్యాణ లక్ష్మీ సహాయంతో పాటు తులం బంగారం ఇవ్వాలని నిర్ణయించాం 06:05PM ►రాష్ట్ర సంపదను ప్రజలకు పంచాలనే ఆరు గ్యారెంటీలను ప్రకటించాం: భట్టి ►ప్రతీ గ్యారెంటీని ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలి: భట్టి ►గిరిజనులకు పోడు భూములు పంచాలన్న చట్టాన్ని నిర్వీర్యం చేశారు.. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి: భట్టి ►ఆరు గ్యారంటీ స్కీమ్ లను తప్పకుండా అమలు చేస్తాం: భట్టి 06:00PM ►ములుగు బహిరంగ సభలో రాహుల్, ప్రియాంక ►మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్న రాహుల్, ప్రియాంక ►తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమే అంటూ రాహుల్ ఫేస్బుక్ రీల్ ►బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు చెల్లాయి ►ఈ విజయయాత్ర రాబోయే మార్పుకి సంకేతమంటూ పోస్ట్ ►రాహుల్ మాటిస్తే కట్టుబడి ఉంటారు: ఎమ్మెల్యే సీతక్క ►కాంగ్రెస్ వస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తాం ►అధికారంలోకి వచ్చాక ఆరుగ్యారంటీలు అమలు చేస్తాం 05:20PM ►రామప్ప ఆలయం వద్ద కాంగ్రెస్ విజయభేరి తొలి విడత బస్సు యాత్రను ప్రారంభించిన రాహుల్, ప్రియాంక ►ములుగు రామానుజాపురం బహిరంగ సభా స్థలికి ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్ నేతలు ►కాసేపట్లో బహిరంగ సభ ►బహిరంగ సభ నుంచే మహిళా డిక్లరేషన్ ప్రకటన 05:10PM ►ప్రత్యేక పూజల అనంతరం.. రామప్ప ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంకలు ►ఆలయ చరిత్రను వివరిస్తున్న అధికారులు 04:52PM ►రామప్ప ఆలయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ కీలక నేతల ప్రత్యేక పూజలు ►కాసేపట్లో కాంగ్రెస్ తొలి విడత బస్సు యాత్ర ప్రారంభం 04:42PM ►ములుగు జిల్లా రామప్ప కు చేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ►స్వాగతం పలికిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు. 04:30PM ►మరి కాసేపట్లో రామప్పకు చేరుకోనున్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ. ►రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ►అనంతరం విజయభేరి బస్సు యాత్ర ప్రారంభం ►ఆదివాసీ గిరిజన సంప్రదాయ పద్ధతిలో రాహుల్, ప్రియాంక గాంధీ లకు స్వాగతం ►కోయ కళాకారులు లంబాడీలు డప్పు నృత్యాలతో స్వాగతం 04:15PM ►రామప్ప ఆలయం వద్దకు చేరుకున్న టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ►రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే సీతక్క ►కాసేపట్లో రామప్ప ఆలయానికి రాహుల్, ప్రియాంకలు ► రామప్ప ఆలయం నుంచి ప్రారంభం కానున్న కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర ► బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రామప్పకు బయల్దేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ►బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ► ములుగు జిల్లా నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్ పర్యటన కోసం భారీ బందోబస్తు ఏర్పాటు నేటి నుంచి కాంగ్రెస్ విజయభేరి తొలి విడత బస్సు యాత్ర. ములుగు జిల్లా రామప్పలో ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించనున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. అనంతరం సాయంత్రం జరిగే రామానుజాపురంలో బహిరంగ సభలో ప్రసంగించడంతో పాటు మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్న రాహుల్, ప్రియాంకలు. మూడు రోజులపాటు బస్సు యాత్రలో పాల్గొనున్న రాహుల్ గాంధీ. బస్సు యాత్రతో పాటు పాదయాత్రలో కూడా పాల్గొనున్న రాహుల్. -
తెలంగాణకు రాహుల్ గాంధీ.. బస్సు యాత్ర సాగేది ఇలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి దిగబోతోంది. ఇందుకోసం బస్సు యాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. బస్సు యాత్రని ఆరంభించేందుకు జాతీయ స్థాయి నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు బుధవారం రాష్ట్రానికి రానున్నారు. మూడు రోజులపాటు.. 8 నియోజకవర్గాల్లో సాగే బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పర్యటిస్తారు. ఈ యాత్రలో నిరుద్యోగులు , సింగరేణి కార్మికులు, పసుపు.. చెరుకు రైతుల, మహిళలతో భేటీ ఆయన అవుతారు. పూర్తి షెడ్యూల్.. ►బుధవారం మధ్యాహ్నాంకల్లా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న రాహుల్, ప్రియాంక ►బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో రామప్ప టెంపుల్కు ఇద్దరు కాంగ్రెస్ నేతలు ►రామప్ప టెంపుల్లో అన్నాచెల్లెళ్ల ప్రత్యేక పూజలు ►సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించనున్న రాహుల్, ప్రియాంక ►రామప్ప గుడి నుంచి ములుగు చేరుకోనున్న కాంగ్రెస్ బస్సు యాత్ర ►ములుగులో బహిరంగ సభలో మహిళలతో రాహుల్ ,ప్రియాంకా ప్రత్యేక సమావేశం ►ములుగు సభ తరువాత తిరిగి ఢిల్లీ వెళ్లనున్న ప్రియాంకా గాంధీ ►ములుగు బహిరంగ సభ తర్వాత.. భూపాలపల్లి చేరుకొనున్న బస్సు యాత్ర ►భూపాలపల్లి లో నిరుద్యోగ యువతతో కలిసి రాహుల్ ర్యాలీ ►రాత్రికి.. భూపాలపల్లి లోనే బస చేయనున్న రాహుల్ గాంధీ 19వ తేదీన భూపాలపల్లి నుంచి మంథనికి చేరుకోనున్న బస్సు యాత్ర ►మంథని లో పాదయాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ. వెంట పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతరులు ►మంథని నుంచి పెద్దపల్లి వెళ్లనున్న బస్సు యాత్ర ►పెద్దపల్లి నుంచి కరీంనగర్కు బస్సు యాత్ర ►కరీంనగర్లో రాహుల్ గాంధీ రాత్రి బస 20వ తేదీన కరీంనగర్ నుంచి బోధన్ ఆర్మూరు మీదుగా నిజామాబాద్కు కాంగ్రెస్ బస్సు యాత్ర ►బోధన్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్న రాహుల్ గాంధీ ►ఆర్మూరులో కాంగ్రెస్ బహిరంగ సభ ►పసుపు.. చెరుకు రైతులతో రాహుల్ ప్రత్యేక సమావేశం ►నిజామాబాద్ లో పాదయాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ ►20వ తేదీ సాయంత్రం తో ముగియనున్న టీ కాంగ్రెస్ మొదటి విడత బస్సుయాత్ర -
ఎన్నికల హామీలపై... మధ్యప్రదేశ్లో నేతల మాటల యుద్ధం
భోపాల్: మధ్యప్రదేశ్లో ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా, పీసీసీ చీఫ్ కమల్నాథ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల హామీలపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఉచిత విద్య, విద్యార్థులకు నగదు పురస్కారాలు వంటి కాంగ్రెస్, ప్రియాంకా గాంధీ ఇచి్చన ఎన్నికల హామీలపై సీఎం చౌహాన్ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గతంలో గాంధీ కుటుంబం ప్రతి ఒక్కరినీ మోసం చేసింది. తాజాగా గాంధీ కుటుంబాన్ని సైతం పీసీసీ చీఫ్ కమల్నాథ్ మోసం చేస్తున్నారు. తప్పుడు హామీలిచ్చేలా వారిపై ఒత్తిడి తెస్తున్నారు’అని ఆరోపణలు చేశారు. మాండ్లాలో ఈ నెల 12న జరిగిన ర్యాలీలో ప్రియాంకా గాంధీ ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందజేస్తామని ప్రకటించడం ఆ తర్వాత దానిని పలు మార్లు మార్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సీఎం విమర్శలపై కమల్నాథ్ తీవ్రంగా స్పందించారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై సీఎం చౌహాన్ అనుచిత భాషను వాడారని ఆరోపించారు. తమ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేయదని స్పష్టం చేశారు. సీఎం చౌహాన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రియాంకా గాంధీ సైతం విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీలో మాదిరిగా తమ పారీ్టలో నియంతృత్వానికి చోటులేదన్నారు. కమల్నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ఎందుకు నిలిపివేశారని సీఎం చౌహాన్ను ఆమె ప్రశ్నించారు. తమ పార్టీ విద్య, చిన్నారులు, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతుంటే ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం చౌహాన్ ఇటువంటి విషయాలను ప్రస్తావిస్తున్నారంటూ ఆమె ‘ఎక్స్’లో పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి విద్యారి్థకి ఉపకారవేతనం అందజేస్తుందని హామీ ఇచ్చారు.నవంబర్ 17వ తేదీన రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. -
ప్రజల్ని ప్రశ్నించకుండా చేసేందుకు.. విభేదాలు సృష్టిస్తున్నారు
దుర్గ్: ప్రజల మనోభావాలను రెచ్చగొడుతూ వారిని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వాడుకుంటోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. కులం, మతం ఆధారంగా ప్రజల్లో విభేదాలు కల్పించి, వారిని ప్రశ్నించకుండా చేయడమే ఆ పార్టీ ఉద్దేశమని విమర్శించారు. గురువారం ఆమె చత్తీస్గఢ్లోని దుర్గ్లో కాంగ్రెస్ నిర్వహించిన ‘మహిళా సమృద్ధి సమ్మేళన్’లో ప్రసంగించారు. ఒకవైపు ప్రధాని మోదీ సన్నిహితులైన పారిశ్రామిక వేత్తలు రోజుకు రూ.1,600 కోట్లు పోగేసుకుంటుండగా మరోవైపు నిరుద్యోగం, అధిక ధరలతో జనం పడుతున్న ఇబ్బందులపై కేంద్రం మాట్లాడటం లేదన్నారు. ఈ సందర్భంగా చిన్నతనంలో తన తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ తన సొంత నియోజకవర్గంలో పర్యటనలో ఉండగా జరిగిన ఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు. ‘నాన్న వైపు చూస్తూ ఓ మహిళ కేకలు వేస్తోంది. అక్కడ రోడ్లు బాగోలేవని ఆమె ఆరోపిస్తోంది. నాన్న వాహనం దిగి ఆమె వద్దకు వెళ్లి సమాధానం చెప్పారు. వాహనంలోకి వచ్చాక ఆ మహిళ తీరు చూసి మీరేమైనా బాధపడ్డారా?అని అడిగా. ‘లేదు, ప్రశ్నించడం వాళ్ల పని. సమాధానం ఇవ్వడం నా కర్తవ్యం అని ఆయన అన్నారు’అని ప్రియాంక చెప్పారు. ప్రజలకు నేరుగా జవాబుదారీగా ఉండాలని అప్పట్లో ప్రధానమంత్రి సైతం భావించేవారని ఆమె వ్యాఖ్యానించారు. -
హుషారుగా.. సోనియా గాంధీ చిందులు
ఢిల్లీ: యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ(76) చాలా కాలం తర్వాత హుషారుగా కనిపించారు. హర్యానాకు చెందిన మహిళా రైతులతో కలిసి భోజనం చేసిన ఆమె.. ఆపై సరదాగా గడిపి చిందులేశారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. తాజాగా రాహుల్ గాంధీ హర్యానా సోనిపాట్లో పర్యటించి.. అక్కడి రైతులతో కలిసి జన్కీ బాత్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన ట్రాక్టర్ నడిపి.. నాట్లు సైతం వేశారు. ఈ క్రమంలో అక్కడి కొందరు మహిళా రైతులు.. ఢిల్లీలోని రాహుల్ ఇంటిని చూడాలని ఉందని కోరారట. దీంతో.. వాళ్లను ఆదివారం ఇంటికి భోజనానికి ఆహ్వానించింది సోనియా కుటుంబం. కాంగ్రెస్ నేత రుచిరా చతుర్వేది తన ట్విటర్ హ్యాండిల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘ఎలా ఉన్నారంటూ?..’ వాళ్లను రాహుల్ పలకరించడం.. సోనియా, రాహుల్, ప్రియాంక.. ముగ్గురూ వాళ్లతో భోజనం చేయడం, ప్రియాంకను వాళ్లు హత్తుకోవడం, ఇద్దరు మహిళా రైతులు ఆమె చేతుల్ని పట్టుకుని నృత్యం చేయాలని ముందుకు తేవడం, ఆమె సంతోషంగా చిందులేయడం అందులో చూడొచ్చు. స్వచ్ఛమైన ఆనందం అంటూ ఆ వీడియోను రుచిర పోస్ట్ చేశారు. Women farmers from Haryana had expressed their desire to @RahulGandhi to see Delhi and his house. He told them that the Govt has taken away his house. But just see what happened next. This video is pure joy! ❤️ pic.twitter.com/1cqAeSW5xg — Ruchira Chaturvedi (@RuchiraC) July 16, 2023 Women farmers who met Raga a few days ago in sonepat Haryana were welcomed at 10 Janpath Delhi They had lunch with Sonia Gandhi ji, @priyankagandhi & @RahulGandhiiFan No one sat down all sat on the chairs & had food on the dining table and everyone had the same food pic.twitter.com/P8UHsA2LxP — Shamila Siddiqui (@rebelioushamila) July 16, 2023 धान की रोपाई, मंजी पर रोटी - किसान हैं भारत की ताकत 🇮🇳🚜 सोनीपत, हरियाणा में मेरी मुलाकात दो किसान भाइयों, संजय मलिक और तसबीर कुमार से हुई। वो बचपन के जिगरी दोस्त हैं, जो कई सालों से एक साथ किसानी कर रहे हैं। उनके साथ मिल कर खेतों में हाथ बटाया, धान बोया, ट्रैक्टर चलाया, और… pic.twitter.com/tUP6TARrJm — Rahul Gandhi (@RahulGandhi) July 16, 2023 ఇదిలా ఉంటే.. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువు నష్టం దావాతో జైలుశిక్ష.. ఆపై లోక్సభ ఎంపీ సభ్యత్వం కోల్పోయారు రాహుల్ గాంధీ. దీంతో తన అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే తాజాగా ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్ నేత షీలా దీక్షిత్ పాత ఇంటికి రాహుల్ గాంధీ తన మకాం మార్చారు. తన శిక్షను రద్దు లేదా స్టే విధించాలని అభ్యర్థిస్తూ తాజాగా సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్ కూడా వేశారు. మరోవైపు.. కేంద్రంలోని బీజేపీపై వ్యతిరేకతను ప్రదర్శించే క్రమంలో.. బెంగళూరులో జరగబోయే విపక్షాల ఐక్యతా సమావేశానికి సోనియా గాంధీ సైతం హాజరు కానున్నారు. ఇదీ చదవండి: కేజ్రీవాల్ను ఖుష్ చేసిన కాంగ్రెస్ -
కర్ణాటకలో కాంగ్రెస్ చారిత్రక విజయంపై ప్రియాంక గాంధీ రియాక్షన్..
కాంగ్రెస్కు చారిత్రక విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. గెలుపు కోసం శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలను అభినందించారు. వారి కష్టానికి తగిన ఫలితం దక్కిందని కొనియాడారు. కర్ణాటక ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చారని చెప్పేందుకు ఈ తీర్పు నిదర్శమన్నారు. ఈ ఫలితం దేశాన్ని ఏకం చేసే రాజకీయాలకు దక్కిన విజయమని పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు. అలాగే కాంగ్రెస్పై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజలకు తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రియాంక స్పష్టం చేశారు. జై కర్ణాటక.. జై కాంగ్రెస్ అంటూ రాసుకొచ్చారు. कांग्रेस पार्टी को ऐतिहासिक जनादेश देने के लिए कर्नाटका की जनता को तहे दिल से धन्यवाद। ये आपके मुद्दों की जीत है। ये कर्नाटका की प्रगति के विचार को प्राथमिकता देने की जीत है। ये देश को जोड़ने वाली राजनीति की जीत है। कर्नाटका कांग्रेस के तमाम मेहनती कार्यकर्ताओं व नेताओं को मेरी… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 13, 2023 కాంగ్రెస్ విజయంపై రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే స్పందించారు. కర్ణాటకలో విద్వేషానికి తెరపడిందని, ప్రేమకు తెరలేచిందని వ్యాఖ్యానించారు. బలవంతులకు, పేదలకు మధ్య జరిగిన యుద్ధంలో పేదలే గెలిచారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. చదవండి: కాంగ్రెస్ను గెలిపించిన ఆరు మంత్రాలివే.. -
Karnataka assembly elections 2023: మోదీ, రాహుల్ను చూసి నేర్చుకోండి!
జంఖాండి: కాంగ్రెస్ నేతలు తనను 91 సార్లు దూషించారన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పందించారు. ‘‘వాటన్నింటినీ కలిపినా ఒక పేజీ అవుతాయేమో. కానీ మీరూ, బీజేపీ నేతలూ మా కుటుంబాన్ని తిట్టిన తిట్లన్నీ రాస్తే పుస్తకాలే కూడా చాలవు! ఆమె ఆదివారం కర్ణాటకలోని బాగల్కోటె జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడారు. దేశం కోసం తూటాలకు ఎదురొడ్డటానికి సిద్ధంగా ఉన్న తన సోదరుడు రాహుల్ గాంధీని చూసి నేర్చుకోవాలని మోదీకి సలహా ఇచ్చారు. ‘‘ప్రజాజీవితంలో ఉన్నవారు విమర్శలకు సిద్ధపడాలి. కాంగ్రెస్ తరఫున ప్రధానులుగా ఉన్న ఇందిరా గాంధీ, రాజీవ్గాంధీ దేశం కోసం తూటాలు తిన్నారు. కానీ ప్రజల కష్టాలను వినడానికి బదులు వారికి సొంత బాధలు చెప్పుకుంటూ సానుభూతి కోసం పాకులాడుతున్న మొట్టమొదటి ప్రధాని మోదీయే’’ అంటూ ఎద్దేవా చేశారు. -
Rahul Gandhi: సోదరితో పాటు సూరత్ కోర్టుకు..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు(సోమవారం) సూరత్(గుజరాత్) కోర్టును ఆశ్రయించనున్నారు. 2019 నాటి పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను సవాల్ చేస్తూ అప్పీల్కు వెళ్లేందుకు ఆయనకు కోర్టు నెల వ్యవధి ఇవ్వగా.. ఇవాళ ఆయన అప్పీల్కు వెళ్లనున్నారు. సూరత్ సెషన్స్ కోర్టులో ఇవాళ రాహుల్ అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయనున్నారు. పరువునష్టం కేసులో మెజిస్ట్రేట్ విధించిన శిక్షను పక్కనపెట్టాలంటూ ఆయన అప్పీల్ చేయనున్నారు. అంతేకాదు.. తన శిక్షపై తాత్కాలిక స్టే ఇవ్వాలని, తద్వారా లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించుకోగలిగే అవకాశం తనకు దొరుకుతుందని ఆయన పిటిషన్లో కోరే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, పలువురు కాంగ్రెస్ నేలతో కలిసి ఆయన సూరత్ కోర్టుకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఆదివారం తన తల్లి సోనియా గాంధీని కలిసి కాసేపు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు కూడా. -
అందుకు కేవలం ఒక్క ఏడాదే ఉంది!..: ప్రియాంక గాంధీ
లోక్ సభ ఎన్నికలకు ఒక్క ఏడాది మాత్రమే మిగిలి ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయని ఆయా పార్టీలోని నేతల్లో భారీగా అంచనాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఎక్కువ అంచనాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ చత్తీస్గఢ్లో జరుగుతున్న కాంగ్రెస్ 85 ప్లీనరీ సెషన్లో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు ప్రతిపక్షాలు, ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మన పార్టీ సందేశాన్ని ప్రభుత్వా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా పార్టీ కోసం పోరాడుతున్న పార్టీ కార్యకర్తలను ప్రియాంక ప్రశంసించారు. ఈమేరకు ఆమె కాంగ్రెస్ నాయకులను ఉద్దేశిస్తూ..మీకు బీజేపీతో పోరాడే ధైర్యం ఉందని తెలుసు. దేశం కోసం ఆ ధైర్యాన్ని ప్రదర్శించే సమయం వచ్చేసింది. మండల స్ఘాయి నుంచే కాంగ్రెస్ను బలోపేతం చేయాలని చెప్పారు. కాగా, లోక్సభ ఎన్నికలకు ఆ పార్టీ తమ నేతలకు దిశా నిర్దేశం చేసి కార్యాచరణ రూపొందించనట్లు తెలుస్తోంది. (చదవండి: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు.. ‘ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం) -
అమ్మ వాటిని నేర్చుకోవడానికి చాలా కష్టపడింది! :ప్రియాంక
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ గురించి ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన మహిళా కేంద్రీకృత సదరస్సులో మాట్లాడుతూ..తన తల్లి భారతీయ సంప్రదాయాలను నేర్చుకోవడానికి చాలా కష్టపడిందని అన్నారు. ఆమెకు రాజకీయాలంటే ఇష్టం ఉండవంటూ చెప్పుకొచ్చారు. తాను ఇద్దరు ధైర్యవంతులైన, బలమైన మహిళల వద్ద పెరిగానని చెప్పారు. తన నానమ్మ ఇందిరా గాంధీ 33 ఏళ్ల కొడుకుని పోగొట్టుకున్నప్పుడూ తన వయసు ఎనిమిదేళ్లని ఆమె గుర్తు చేసుకున్నారు. సంజయ్ గాంధీ పోయిన మరుసటి రోజే తన విధులను నిర్వర్తించేందుకు వెళ్లిపోయారని చెప్పారు. ఆమె చనిపోయే వరకు కూడా తన కర్తవ్యం పట్ల ఆమె అంతర్గత శక్తి అలానే ఉందని, చనిపోయేంత వరకు దేశ సేవ చేస్తూనే ఉన్నారని చెప్పారు. అంతేగాదు తన తల్లి సోనియా 21 ఏళ్ల వయసులో రాజీవ్గాంధీతో ప్రేమలో పడ్డారని, ఆ తర్వాత ఆయనను పెళ్లి చేసుకుని ఇటలీ నుంచి భారత్కు వచ్చారని అన్నారు. ఇక్కడకు వచ్చాక భారతీయ సంప్రదాయాలను నేర్చుకునేందుకు చాలా ఇబ్బంది పడిందని, ఆ తర్వాత తన నానమ్మమ ఇందిరా గాంధీ నుంచి ప్రతీది నేర్చుకున్నారని చెప్పారు. ఆమె సరిగ్గా 44 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయిందని, రాజకీయాలంటే ఇష్టం లేకున్నప్పటకీ వచ్చి దేశ సేవ చేసేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుని జీవితమంతా సేవ చేసిందని అన్నారు. అంతేగాదు తన తల్లి తన నానమ్మ నుంచి నేర్చుకున్న ముఖ్య విషయం గురించి చెబుతూ.."మీరు ఎలాంటి కష్టంలో ఉన్నా లేదా ఎంత పెద్ద విషాదం లేదా సమస్యలో ఉన్నా అది ఇంట్లో లేదా పనిలోనైనా సరే నిలబడి సమర్ధవంతంగా ఎదుర్కొని మీ కోసం మీరు పోరాడగలగలిగే సామర్థ్యం కలిగి ఉండటం" అని చెప్పారు. (చదవండి: మహిళలపై కాంగ్రెస్ వరాల జల్లు..సెపరేట్గా మేనిఫెస్టో!) -
Karnataka: మహిళలపై కాంగ్రెస్ వరాల జల్లు..సెపరేట్గా మేనిఫెస్టో!
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మహిళలపై వరాలజల్లు కురిపించింది. ఏకంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో పెడతానంటూ పలు హామీలు ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వాద్రా ఒక కార్యక్రమంలో తాము గనుక అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల రూ. 2000 ఇస్తామని ప్రకటించారు. గృహలక్ష్మీ యోజన కింద ఎలాంటి షరతులు లేకుండా అందరికీ ఉపకరించే బేసిక్ ఆదాయం కింద ఏడాదికి రూ. 24,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందిస్తామని హామి ఇచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అంతేగాదు ఈ గృహలక్ష్మీ యోజన అనేది కాంగ్రెస్ పార్టీ అధికమైన ఎల్పీజీ గ్యాస్ ధరల తోపాటు తమ రోజు వారీ ఖర్చుల నిమిత్తం మహిళలకు ఉపకరించేలా చేసిన ప్రయత్నమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ప్రతి మహిళ సాధికారిత తోపాటు తన కాళ్లపై తాను నిలబడి తన పిల్లలను చూసుకునే సామర్థ్యాంతో ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. అందుకనే ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందివ్వాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఈ పథకం ద్వారా 1.5 కోట్ల మందికి పైగా మహిళలు లబ్ధి పొందుతారని పార్టీ తెలిపింది. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోని కూడా విడుదల చేస్తామని చెప్పింది. ఈ మేరకు ప్రియాంక గాంధీ " నేను నాయకురాలిని(నా నాయకి) " అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ... కర్ణాటకలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందంటూ విమర్శించారు. పైగా మంత్రులు ఉద్యోగాల్లో సుమారు 40% కమిషన్ తీసుకుంటున్నారని అన్నారు. అంతేగాదు కర్ణాటకలో సుమారు రూ. 1.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారంటూ పెద్ద ఎత్తున్న ఆరోపణలు చేశారు. అలాగే పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ స్కామ్ గురించి మాట్లాడుతూ..కర్ణాటకలో లంచాలు ఇవ్వకుండా ఏది జరగదన్నారు. పోలీసుల పోస్టులనే అమ్ముకునే సిగ్గుమాలిన మోసాలు జరుగుతున్నాయంటూ విరుచుకుపడ్డారు. అయినా మీరు అధికారుల నుంచి ఆశించేది ఇదేనా? అని ప్రజలను ప్రశ్నించారు. ముందుగా పిల్లలను, బాలికలను ఉద్యోగాలు వచ్చేలా చదివించండి అని చెప్పారు. అలాగే బెంగుళూరులో జరగాల్సిన సుమారు 8వేల కోట్ల అభివృద్ధి పనులు గురించి ఆలోచించండి అని ప్రియాంక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. 9 రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్!) -
అన్నా చెల్లెలి అనురాగం.. చెల్లిపై ఉప్పోంగిన ఆప్యాయతతో..
-
Rahul Gandhi: అన్నాచెల్లెలి అనురాగం
సృష్టిలో బంధాలు వేటికవే ప్రత్యేకం. అందునా అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇంకా ప్రత్యేకం. ఒకవైపు అన్న రాజకీయాల్లో భాగంగా విరామం లేకుండా భారత్ జోడో పాదయాత్ర చేపట్టి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. మరోవైపు ఆ సోదరి పార్టీలో క్రియాశీలక వ్యవహారాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక ఈ ఇద్దరూ ఒకచోట చేరారు. అలిసి పోయిన అన్న రాహుల్ గాంధీతో సరదాగా సంభాషించింది సోదరి ప్రియాంక గాంధీ వాద్రా. ఉప్పోంగిన ఆప్యాయతతో సోదరి మెడ చుట్టూ చేతులేసి.. ప్రేమతో ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టారాయన. తన జీవితంలో తన అన్న రాహుల్ బెస్ట్ ఫ్రెండ్ అని ఆమె గతంలోనే ప్రకటించుకున్నారు. ఇక రాహుల్ సైతం సోదరి విషయంలో అన్నగా ఏనాడూ తన బాధ్యతలను విస్మరించబోనని ప్రకటించుకున్నారు. ఈ అన్నాచెల్లెల అనుబంధం చిన్నప్పటి నుంచి ధృడంగా ఉంటోంది. యూపీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా.. ఒకే వేదికపై వీళ్లిద్దరూ కూర్చని సరదాగా ముచ్చటించుకున్నారు. అన్న ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడంతో ప్రియాంక నవ్వు ఆపుకోలేకపోయింది. ఆ ప్రత్యేక క్షణాలు కెమెరా కంటికి చిక్కాయి. ❤️❤️ pic.twitter.com/9MIQKMIdAQ — Congress (@INCIndia) January 3, 2023 వారిద్దరి ఆప్యాయత, అనురాగాన్ని తెలిపే ఈ సన్నివేశానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల నాటికి పార్టీని మళ్లీ ఉత్సాహ పరిచే లక్ష్యంతో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర చేపట్టింది. ప్రస్తుతం యూపీలో కొనసాగుతున్న ఈ యాత్ర.. నెలాఖరులో జమ్మూ కశ్మీర్లో చివరి దశకు చేరుకోనుంది. -
కలిసి నడిస్తే అడుగులు మరింత బలపడతాయి.. రాహుల్ ఆసక్తికర ట్వీట్
భోపాల్: భారత్ జోడో యాత్రలో భాగంగా సోదరుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కలిసి నడిశారు. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రోహిన్తో కలిసి గురువారం రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. చెల్లెలితో కలిసి నడుస్తున్న ఫోటోను ట్విటర్లో షేర్ చేసిన రాహుల్.. ''మనం కలిసి నడిస్తే అడుగులు మరింత బలపడతాయంటూ'' పేర్కొన్నారు. ప్రియాంక వాద్రా భారత్ జోడోలో పాల్గొనడం ఇదే తొలిసారి. సోనియాగాంధీ కర్ణాటకలో రాహుల్తో కలిసి నడిశారు. रास्तों से लड़कर हमने कई मुक़ाम बनाए हैं। साथ हैं तो यकीन है, मंज़िल ज़रूर पाएंगे। pic.twitter.com/hDuIdsVoNr — Rahul Gandhi (@RahulGandhi) November 24, 2022 సెప్టెంబర్ 7న మొదలైన భారత్ జోడో యాత్ర.. నవంబర్ 23న మధ్యప్రదేశ్లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో ఐదు లోక్సభ, 26 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పదకొండు రోజులపాటు భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. చదవండి: (కల్లలైన కలలు.. భర్త వివాహేతరసంబంధం.. మహిళా టెక్కీ ఆత్మహత్య) -
‘పాత పింఛను’ హామీ ఎన్నికల స్టంట్ కాదు
సిర్మౌర్: పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ హామీ ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాదంటూ బీజేపీ చేస్తున్న విమర్శలపై ప్రియాంకా గాంధీ వాద్రా స్పందించారు. తమ హామీ ఎన్నికల స్టంట్ కాదన్నారు. బడా పారిశ్రామిక వేత్తలు తీసుకున్న వేల కోట్ల రుణాలను రద్దు చేయడంపై ముందుగా సమాధానం చెప్పాలని కాషాయ పార్టీని ఆమె ప్రశ్నించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో చివరిరోజైన గురువారం ప్రియాంక హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వలేదంటూ ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రియాంక కొట్టిపారేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సుస్థిర ప్రభుత్వాన్ని అందించిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాలను అస్థిర పరుస్తున్నదెవరు?అని ఆమె బీజేపీని నిలదీశారు. రాష్ట్రంలో 15 లక్షల మంది నిరుగ్యోగ యువత ఉండగా ఖాళీగా ఉన్న 63 వేల ప్రభుత్వ ఉద్యోగాలను బీజేపీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు లక్ష ఉద్యోగాలను కల్పించడంతోపాటు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తుందని ప్రియాంకా గాంధీ ప్రకటించారు. బీజేపీ హామీలను నమ్మవద్దని చెప్పారు. ధరల తగ్గింపు గురించి, ఉద్యోగ ఖాళీల గురించి ఆ పార్టీ నేతలు మాట్లాడటం లేదని వివరించారు. ఇదీ చదవండి: నిర్మలా సీతారామన్తో కాంగ్రెస్ కార్యకర్తల సెల్ఫీలు -
ప్రియాంక గాంధీల కుటుంబానికి చెందినది కాదు! కాంగ్రెస్ ఎంపీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షురాలిగా ప్రియాంక వాద్ర ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న లేవనెత్తారు కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలేఖ్. హిందు సంప్రదాయం ప్రకారం ప్రస్తుతం ఆమె వాద్రా కుంటుంబానికి చెందిన ఇంటి కోడలే గానీ గాంధీ కుటుంబ సభ్యురాలు కాదు కదా అని ఖలేఖ్ అన్నారు. అలాగే ఆమె కాంగ్రెస్ చీఫ్గా ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కూడా అని చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేయమని కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. అదీగాక అశోక్ గెహ్లాట్ కూడా రాహుల్గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండమని పలుమార్లు కోరారు. ఐతే రాహుల్ గాంధీ కొన్ని వ్యక్తి గత కారణాల వల్ల గాంధీ కుటుంబంలోని వారెవ్వరూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండకూడదని నిర్ణయించకున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం శశిథరూర్ పోటీ చేస్తున్నట్లు తేలింది గానీ ఇంకా రాజస్తాన్ సంక్షోభం విషయమై అశోక్ గెహ్లాట్ పోటీ చేస్తారా? లేదా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. నామినేషన్ వేసేందుకు అక్టోబర్ 1 చివరి తేది కాగా, నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి చివరి తేది అక్టోబర్ 8 . అంతేగాక అదే రోజు(అక్టోబర్ 8న) సాయంత్రం 5 గంటల ఫైనల్ లిస్ట్ అభ్యర్థులను కూడా ప్రకటిస్తుంది పార్టీ. అక్టోబర్ 19న ఫలితాలను వెల్లడిస్తారు. (చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్ సింగ్?)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
నాణ్యమైన విత్తనాలతో ఆశించిన దిగుబడులు
గతానికంటే మెరుగైన సీట్లతో మళ్లీ జగనన్న పాలన
ఇరువర్గాలపై కేసులు నమోదు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఇంటర్ సప్లిమెంటరీకి సర్వం సిద్ధం
భద్రత వెరీ స్ట్రాంగ్
24న ఎంఎస్ఎంఈ వర్క్షాప్
అంగన్వాడీ కేంద్రాలుతనిఖీ చేసిన ఆర్జేడీ
నేడు మోదకొండమ్మ కొలువు సంబరం
సింహగిరి.. ఆధ్యాత్మిక ఝరి
తప్పక చదవండి
- కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement