-
కొనసాగుతున్న ‘గసగసాల’ నిందితుల అరెస్టులు
మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): మాదక ద్రవ్యాల తయారీకి ఉపయోగించే నిషేధిత గసగసాలు (ఓపీఎం పాపీ సీడ్స్) కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతున్నది. మాదకద్రవ్యాల మాఫియా ముఠాలో మరో ఇద్దరిని మంగళవారం రాత్రి సెబ్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మదనపల్లె సెబ్ సీఐ కేవీఎస్ ఫణీంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె మండలం మాలేపాడు గ్రామం, కత్తివారిపల్లెకు చెందిన బొమ్మిరాసి నాగరాజ(45), పెద్దూరు దళితవాడలో ఉండే అతని మామ అల్లాకుల లక్ష్మన్న (60), బావమరిది అల్లాకుల సోమశేఖర్ (26)ను ఆదివారం సెబ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే. నాగరాజ పోలీసుల విచారణలో నోరు విప్పడంతో తీగలాగితే డొంక కదిలినట్లయింది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, చౌడేపల్లె తదితర ప్రాంతాల నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై మహానగరాల్లో డ్రగ్ మాఫియా నిందితులున్నట్లు తేలడంతో.. చౌడేపల్లె మండలం, కాగితి పంచాయతీ, గుట్టకిందపల్లెకు చెందిన దిమ్మెరి వెంకటరెడ్డి కుమారుడు దిమ్మెరి వెంకటరమణ అలియాస్ గుట్టకిందపల్లె నాగరాజ (53)తో పాటు అదే మండలం, దిగువపల్లె పంచాయతీ, కాయలపల్లెకు చెందిన నాగరాజ కుమారుడు రేవణ్కుమార్ (31)ను బోయకొండ గంగమ్మగుడి మార్గంలోని ఆర్చి వద్ద మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ కేసులో తెరవెనుక సూత్రధారులుగా ఉన్న బెంగళూరు, చెన్నై, ముంబయిలో ఉండే మాఫియా డాన్లను పట్టుకోవడానికి పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ కేసులో ఐవోగా మదనపల్లె సెబ్ సీఐ కేవీఎస్ ఫణీంద్ర వ్యవహరిస్తున్నారు. ముంబైలో ఉంటున్న బొంబాయి క్రిష్ణమ్మ అలియాస్ భూమ్మను పట్టుకోవడానికి పోలీసులు పావులు కదుపుతున్నారు. గుట్టకిందపల్లె నాగరాజ, బొంబాయి క్రిష్ణమ్మపై మాదక ద్రవ్యాల వ్యాపారం చేసిన కేసులు ఇదివరలోనే చౌడేపల్లె, అనంతపురం, నల్లచెరువు పోలీస్ స్టేషన్లలో ఉన్నాయి. వీరిద్దరిని కూడా త్వరలోనే సెబ్ అధికారులు అరెస్టు చేయనున్నట్లు తెలిసింది. -
వెరీ గూడ్
సంస్కృతంలో బెల్లాన్ని ‘గుడము’ అంటారు.హిందీలో ‘గూడ్’ అంటారు.ఆరోగ్యకరమైన తీపి అంటే బెల్లమే...ఆయుర్వేద గుణాలు ఉన్నది బెల్లానికే...దీపావళి పండుగను స్వచ్ఛమైన బెల్లంతో జరుపుకోండి... ముఖంలో కాంతులు నింపుకోండి... తియ్యటి వేడుకలతో వెలిగిపొండి... అనరస కావలసినవి: బెల్లం పొడి – ఒక కప్పు – (100 గ్రా.); బియ్యప్పిండి – 150 గ్రా.; గసగసాలు – ఒక టీ స్పూను; నువ్వులు – ఒక టీ స్పూను; నెయ్యి లేదా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి మూడు రోజుల పాటు నానబెట్టాలి (ప్రతిరోజూ రెండు సార్లు నీళ్లు మార్చాలి) ∙నాలుగో రోజు నీళ్లన్నీ శుభ్రంగా ఒంపేసి, ఒక పొడి వస్త్రం మీద బియ్యాన్ని నాలుగు గంటలసేపు ఆరబోయాలి ∙ఆరబోసిన బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి ∙మిక్సీ పట్టిన పిండిని ఒక పాత్రలోకి తీసుకుని, బెల్లం పొడి జత చేసి చలిమిడిలా అయ్యేలా బాగా కలిపి, మూత పెట్టి 12 గంటల పాటు పక్కన ఉంచాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో అరిసె మాదిరిగా ఒత్తాలి ∙పైన గసగసాలు కాని నువ్వులు కాని ఒత్తాలి ∙ఇలా అన్నిటినీ ఒత్తుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగిన తరవాత ఒత్తి ఉంచుకున్న అనరసలను వేసి వేయించి తీసేయాలి ∙వేడివేడిగా కాని, చల్లగా కాని తినొచ్చు. కంచ గోలా కావలసినవి: పనీర్ – ఒక కప్పు; బెల్లం పొడి – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; రోజ్ వాటర్ – ఒక టీస్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా; పిస్తా తరుగు – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ముందుగా పాలను విరగ్గొట్టి, గట్టి పనీర్ తయారుచేసుకోవాలి (ఒక్క చుక్క నీరు కూడా లేకుండా గట్టిగా పిండి తీసేయాలి) ∙పనీర్ను ఒక పాత్రలోకి తీసుకుని చేతితో సుమారు పావు గంట సేపు బాగా కలపాలి ∙(కొద్దిగా తడి ఉందనిపిస్తే, స్టౌ మీద బాణలిలో వేసి కొద్దిసేపు ఉంచితే తడి పోతుంది) ∙పనీర్ బాగా చల్లారాక రోజ్ వాటర్, ఏలకుల పొడి, కుంకుమపువ్వు, బెల్లం పొడి వేసి సుమారు ఐదు నిమిషాల పాటు కలుపుతుండాలి ∙ఈ మిశ్రమాన్ని సుమారు పన్నెండు సమాన భాగాలుగా చేసి, చేతితో ఒత్తాలి ∙పగుళ్లు లేకుండా చూసుకోవాలి ∙ప్రతి గోలాను పిస్తా తరుగుతో అలంకరించి, ఫ్రిజ్లో సుమారు నాలుగు గంటలపాటు ఉంచి బయటకు తీసి చల్లగా అందించాలి. పటిషప్త కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; బొంబాయి రవ్వ – అర కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; పాలు – 2 కప్పులు ఫిల్లింగ్ కోసం: పచ్చి కోవా తురుము / కొబ్బరి తురుము – 3 కప్పులు; బెల్లం పొడి – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను ఫిల్లింగ్ తయారీ: ∙ఒక పాత్రలో కొబ్బరి తురుము/పచ్చి కోవా తురుము, బెల్లం పొడి వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉంచాలి ∙(పచ్చి కోవాతో చేస్తుంటే కొద్దిగా పాలు జత చేయాలి) ∙కొద్దిగా ఉడికిన తరవాత ఏలకుల పొడి జత చేయాలి ∙ తీగలా సాగే వరకు సుమారు 20 నిమిషాల పాటు బాగా కలిపి దింపి, చల్లారనివ్వాలి. పటిషప్త తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బొంబాయి రవ్వ, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి ∙పాలు జత చేసి ఉండలు లేకుండా కలిపి, ఈ మిశ్రమాన్ని సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి ∙స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ ఉంచి, వేడయ్యాక కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని ఒక స్పూనుడు వేసి పల్చగా పరవాలి ∙వెంటనే దాని మీద ఫిల్లింగ్ మిశ్రమాన్ని ఒక స్పూనుడు వేసి, రోల్ చేయాలి ∙లేత గోధుమరంగులోకి వచ్చేవరకు ఉంచి, ప్లేట్లోకి తీసుకోవాలి ∙వీటిని వేడిగా కాని, చల్లగా కాని అందించవచ్చు ∙కండెన్స్డ్ మిల్క్ పోసి అందిస్తే, అందంగాను, రుచిగాను ఉంటుంది. స్వీట్ సమోసా కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు (పావు కేజీ); పచ్చి సెనగ పప్పు – అర కప్పు (నానబెట్టాలి); బెల్లం పొడి – అర కప్పు; జీడిపప్పులు – 2 టేబుల్ స్పూన్లు; కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పులు – 10; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – వేయించడానికి తగినంత తయారీ: ∙సెనగ పప్పును శుభ్రంగా కడిగి, అర కప్పు నీళ్లు జత చేసి కుకర్లో ఉంచి స్టౌ మీద ఉంచాలి ∙ఒక విజిల్ రాగానే మంట తగ్గించి మరో రెండు విజిల్స్ వచ్చాక స్టౌ మీద నుంచి దింపేయాలి ∙బాదం పప్పులు, జీడి పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ∙ఒక పాత్రలో మైదా పిండి, నెయ్యి వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి పూరీల పిండి మాదిరిగా కలిపి, పైన వస్త్రంతో కప్పి, సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి ∙ఈలోగా స్టఫింగ్ తయారుచేసుకోవాలి ∙ఉడికించిన సెనగ పప్పులో నీళ్లు ఉంటే వాటిని వడకట్టి తీసేయాలి ∙సెనగ పప్పును మిక్సీలో వేసి కొంచెం పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టి బయటకు తీసేయాలి ∙చిన్న బాణలి స్టౌ మీద పెట్టి వేడయ్యాక ఒక టీ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙సెనగ పప్పు పొడి వేసి దోరగా వేయించాక, ఒక పాత్రలోకి తీసుకుని, బాగా చల్లారాక, బెల్లం జత చేసి కలియబెట్టాలి ∙ఆ తరవాత జీడిపప్పు పలుకులు, కిస్మిస్, ఏలకుల పొడి జత చేసి బాగా కలపాలి ∙మైదా పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని పూరీలా ఒత్తి, మధ్యలోకి కట్చేయాలి ∙ఒక్కో భాగాన్ని తీసుకుని కోన్ ఆకారంలో చేతితో చేసి, అందులో పచ్చి సెనగ పప్పు మిశ్రమం ఉంచి, సమోసాలాగ మూసేసి పక్కన ఉంచుకోవాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, తయారుచేసి ఉంచుకున్న స్వీట్ సమోసాలను వేసి వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. ఉన్ని యాప్పమ్ కావలసినవి: బియ్యం – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని; కొబ్బరి వేయించడానికి; నూనె – అర టేబుల్ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు ఉన్నియాçప్పమ్ కోసం: అరటి పండ్లు – 2 ; నల్ల నువ్వులు – ఒక టీ స్పూను; బెల్లం పొడి – అర కప్పు; నీళ్లు – పావు కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; సోంపు పొడి – అర టీ స్పూను; బేకింగ్ సోడా – పావు టీ స్పూను; కొబ్బరి నూనె లేదా నెయ్యి – ఒక టీ స్పూను (ఒక్కో గుంటలో) తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు నాలుగు గంటలపాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి, గ్రైండర్లో వేసి మెత్తగా చేయాలి ∙ముప్పావు కప్పు అరటి పండు గుజ్జు, అర కప్పు బెల్లం పొడి, ఏలకుల పొడి జత చేసి మరోమారు తిప్పాలి. (అవసరమనుకుంటే ముప్పావు కప్పు నీళ్లు జత చేయాలి) ∙రవ్వలా వచ్చేవరకు గ్రైండ్ చేయాలి (మరీ మెత్తటి పిండిలా రాకూడదు) ∙పిండిని మరో పాత్రలోకి తీసుకోవాలి. కొబ్బరి వేయించడానికి: బాణలిని స్టౌ మీద ఉంచి, కొబ్బరి నూనె లేదా నెయ్యి వేసి కరిగాక, పచ్చి కొబ్బరి ముక్కలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి.ఉన్నియాప్పమ్ పిండి తయారీపిండిలో మిగిలిన నూనె, వేయించిన కొబ్బరి ముక్కలు జత చేసి కలపాలి. నల్ల నువ్వులు, జీలకర్ర పొడి, శొంఠి పొడి, బేకింగ్ సోడా జత చేసి మరోమారు బాగా కలపాలి.ఉన్నియాప్పమ్ తయారీఅప్పమ్ వేసే చట్టీ పాన్ (పొంగడం మౌల్డ్లా ఉంటుంది) స్టౌ మీద ఉంచి వేడి చేయాలి. ఒక్కో గుంటలోను ఒక టీ స్పూను కొబ్బరి నూనె వేసి, మంట బాగా తగ్గించాలి. నూనె వేడయ్యాక ఒక స్పూన్తో పిండి మిశ్రమం ఒక్కో గుంటలో మూడు వంతుల వరకు వేసి, సన్నటి మంట మీద ఉన్నియప్పమ్ బంగారు రంగులోకి వచ్చేవరకు ఉడికించాలి. రెండో వైపు తిప్పి మరి కాస్త నెయ్యి వేసి ఉడికించి దింపేయాలి. వీటిని వేడివేడిగా కాని, చల్లగా కాని తినొచ్చు. ఇవి రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్లో ఉంచితే వారం రోజుల దాకా ఉంటాయి. గూడ్ కీ రోటీ కావలసినవి: గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు; నెయ్యి – అర కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; పాలు – అర కప్పు; బేకింగ్ సోడా – చిటికెడు; ఉప్పు – చిటికెడు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; దాల్చిన చెక్క పొడి – చిటికెడు తయారీ: ∙ఒకపాత్రలో అర కప్పు పాలు, బెల్లం పొడి వేసి స్టౌ మీద ఉంచి బెల్లం కరిగించి దింపి చల్లారనివ్వాలి ∙ఒక పాత్రలో గోధుమ పిండి, బేకింగ్ సోడా, ఉప్పు, ఏలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి ∙పాలు + బెల్లం మిశ్రమం జత చేస్తూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి (అవసరమనుకుంటే మరి కొన్ని పాలు జత చేయాలి) ∙కొద్దిగా నెయ్యి జత చేసి మరో మారు కలపాలి ∙చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి ∙ఒక్కో ఉండను పావు అంగుళం మందంగా చపాతీలా ఒత్తుకుని పక్కన ఉంచుకోవాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి, తయారుచేసి ఉంచుకున్న గుర్ కీ రోటీ వేసి, సన్నని మంట మీద బాగా కాల్చాలి ∙ రోటీ చుట్టూ నెయ్యి వేయాలి ∙రోటీ మీద కొద్దిగా నెయ్యి పూసి, రోటీని తిరగేసి మళ్లీ నెయ్యి వేసి బాగా కాలాక తీసేయాలి ∙ఈ రోటీలను వేడివేడిగా కాని చల్లగా కాని అందించాలి. గూడ్ కీ కుల్ఫీ కావలసినవి: జీడి పప్పులు – 50 గ్రా. (చిన్న చిన్న ముక్కలు చేయాలి); చిక్కటి పాలు – ఒక లీటరు; మిల్క్ మెయిడ్ – ఒక క్యాన్ (410 గ్రా.); ఏలకుల పొడి – అర టీ స్పూను; బెల్లం పొడి – 100 గ్రా.; పంచదార పొడి – 50 గ్రా; ఉప్పు – చిటికెడు తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, జీడిపప్పులు వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించి, తీసి చల్లారనివ్వాలి ∙ఒక పెద్ద పాత్రలో పాలు, కండెన్స్డ్ మిల్క్, ఏలకుల పొడి వేసి, మీడియం మంట మీద ఉంచి మరిగించాలి ∙కొద్దిపేయ్యాక మంట సిమ్ చేసి, సుమారు గంటన్నర సేపు అలానే ఉంచాలి ∙మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙బెల్లం పొడి వేసి కరిగేవరకు కలుపుతుండాలి ∙పంచదార పొడి, ఉప్పు వేసి మరోమారు కలిపి, సుమారు పది నిమిషాలు ఉంచాలి ∙అడుగు అంటకుండా జాగ్రత్తపడాలి ∙జీడిపప్పు పలుకులు వేసి మరోమారు కలిపి దింపేయాలి ∙బాగా చల్లారాక కుల్ఫీ మౌల్డ్స్లో మూడు వంతుల వరకు పోసి, ఫ్రిజ్లో ఒక రోజు రాత్రంతా ఉంచాలి ∙ సర్వ్ చేయడానికి ఐదు నిమిషాల ముందర ఫ్రిజ్లో నుంచి బయటకు తీసి పైన మరికొన్ని జీడిపప్పు పలుకులు వేసి అందించాలి. -
గసగసాల సాగు వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా!
బెంగళూరుకు చెందిన ముఠానే కీలకం కోలారు, చిత్తూరు జిల్లాల్లో ఏజెంట్లు ఆరేళ్లుగా సాగవుతున్న వైనం పలమనేరు: ఓపీఎం పోపీ (గసగసాలు) పంట సాగు వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా హస్తమున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా మరో ముఠా అంతర్జాతీయ మాఫియాకు సహకారమందిస్తూ వీటిని స్థానికంగా పండించేలా పథకం ప్రకారం ముందుకెళుతున్నట్లు సమాచారం. జిల్లాలోని పుంగనూరు ప్రాంతంలో రెండ్రోజుల క్రితం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ పంట సాగును కనుగొన్న విషయం తెలిసిందే. పొరుగునే ఉన్న కోలారు జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో బెంగళూరు ముఠా ఏజెంట్లు వందలాదిమంది ఉన్నట్లు తెలుస్తోంది. ఆరేళ్లుగా ఈ ప్రాంతంలో గసగసాల సాగు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. పలు దేశాల్లో అక్రమంగా సాగు ప్రపంచంలోని పలు దేశాల్లో ఓపీఎం పోపీ సాగు అక్రమంగా సాగుతూనే ఉంది. ఆస్ట్రేలియాలోని టాస్మానియా, అమెరి కా, యూఏఈలో మాత్రం దీని సాగుకు ఆ ప్రభుత్వాల నుం చి అనుమతులున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, పాకిస్తాన్ తదితర దేశాల్లో టైస్ట్లు ఈ సాగును భారీగా చేపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. మొక్క నుంచి అంతా లాభమే గసగసాల మొక్క నుంచి గసగసాలతో పాటు కాయ నుంచి జిగురు, బెరడులను కూడా సేకరిస్తున్నారు. కాయ ఏపుగా పెరిగినపుడు దానిపై బ్లేడ్లతో గాట్లు పెట్టి అందులో నుంచి వెలువడే జిగురును సేకరిస్తారు. దీన్ని కొకైన్, హెరాయిన్ తదితరాల తయారీకి ఉపయోగిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఔషధ తయారీ సంస్థ అనుమతులున్న రాష్ట్రాల్లో మాత్రం వీటిని సేకరించి వైద్యపరమైన మత్తు మందులకు వినియోగిస్తారు. సంబంధిత రాష్ట్రాలు ఈ పంట సాగుకు అనుమతి ఇచ్చినట్లయితే స్థానికంగా ఉండే సెంట్రల్ డ్రగ్ అధికారులు, ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణలోనే సాగు చేపట్టాలి. కోలారు, పుంగనూరు ప్రాంతాల్లో ఏజెంట్లు కర్ణాటకలోని కోలారు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు ప్రాంతాల్లో బెంగళూరు ముఠాకు చెందిన ఏజెంట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరు కేవలం నాలుగైదేళ్లలో లక్షాధికారులుగా మారారు. బెంగళూరు నుంచి విత్తనాలను స్థానిక రైతులకు అంది స్తున్నారు. ఒబ్బిళ్లయ్యాక సరుకును బెంగళూరుకు చేరవేస్తున్నారు. బెరడు నుంచి పౌడర్ను స్థానికంగానే తయా రు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారు లు గుర్తించారు. ఇళ్లలోని పెద్ద గ్రైండర్లతో పౌడర్ను తయారు చేసి ప్యాకెట్లుగా చేసి బస్సుల్లోనే బెంగళూరుకు పంపుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ముఠాను పట్టుకునే పనిలో అధికారులు స్థానిక ఏజెంట్ల ద్వారా బెంగళూరులోని ప్రధాన ముఠాను పట్టుకునే పనిలో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిమగ్నమైనట్లు తెలిసింది. బెంగళూరులోని ముఠాను పట్టుకుంటే అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా లింకులు బయటపడే అవకాశాలున్నాయి. -
గసాల సాగుపై ఎక్సైజ్ దాడులు
పుంగునూరు: చిత్తూరు జిల్లాలో అక్రమంగా సాగు చేస్తున్న గసగసాల పంటలపై మంగళ వారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. చౌడేపల్లి మండలం బోయకుండ గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో దాడులు చేసి ఆగుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో రైతులు, వ్యాపారులు కూడా ఉన్నారు. జిల్లాలోని సోమల, చౌడేపల్లి, పుంగనూరు మండలాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో పంట సాగవుతోందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఈ పంట సాగుకు అనుమతి లేదని వారు తెలిపారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది సిబ్బంది మంగళవారం ఉదయం దాడులు చేశారు. కాగా గసాల సాగుకు పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రమే అనుమతి ఉన్నట్టు తెలుస్తోంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ఎవరూ ఊహించని విధంగా..టెస్లా కొనుగోలు దారులకు మస్క్ బంపరాఫర్..
బలపడుతున్న రెమాల్ తుఫాను.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
National Brother's Day 2024 : బంధానికే అందం అపూర్వ సహోదరులు
ఎన్నికల సంఘానికి ఊరట.. అలా ఆదేశించలేమన్న సుప్రీం
డాక్టర్ కృష్ణ ఎల్లాకు ప్రతిష్టాత్మక అవార్డు
చరణ్-తారక్పై మనసు పారేసుకున్న హాలీవుడ్ భామ.. ఏం చెప్పిందంటే?
‘కవిత అరెస్ట్లో చట్టపరమైన ఉల్లంఘనలు’.. ఢిల్లీ హైకోర్టులో వాదనలు
‘మనెవ్వరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు’.. AI ముప్పుపై మస్క్
సుమిత్కు క్లిష్టమైన ‘డ్రా’..!
ప్రీతిస్మిత ప్రపంచ రికార్డు..!
తప్పక చదవండి
- 'బిగ్బాస్' పునర్నవి ప్రేమలో పడిందా? మరి ఆ కుర్రాడెవరు?
- కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్లపై పరువు నష్టం దావా: మంత్రి జూపల్లి
- మిర్యాలగూడ: కునుకు తీస్తూ కమిషనర్ ఇలా..
- 'విశ్వంభర'లో మరో టాలెంటెడ్ బ్యూటీ.. అఫీషయల్ ప్రకటన
- SRH vs RR: అతడి మీదే భారం.. సన్రైజర్స్ గెలవాలంటే..
- వీడియో: కేదార్నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన ప్రమాదం
- T20: బంగ్లాదేశ్కు ఊహించని షాకిచ్చిన పసికూన.. సిరీస్ సొంతం
- ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి
- రైసీ హెలికాఫ్టర్ క్రాష్: ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఏముందంటే..
- అప్పు తీసుకుంటున్నారా..? ఒక్కక్షణం ఆలోచించండి
Advertisement