-
కోలుకుంటున్న ‘ఉజ్జయిని’ బాలిక
ఉజ్జయిని: మధ్యప్రదేశ్లో అత్యాచారానికి గురై అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరుగాడిన బాలిక కోలుకుంటోంది. ఇండోర్లోని మహారాజా టుకోజీరావ్ హోల్కార్ మహిళా ఆస్పత్రిలో వైద్య నిపుణుల బృందం ఆమెకు వైద్య చికిత్సలు అందిస్తోంది. పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాలను చెప్పలేకపోతోందని, అయితే ఆమెది సత్నా జిల్లా అని తెలుస్తోందని కౌన్సిలింగ్ నిపుణులు గురువారం తెలిపారు. బాధిత బాలిక పరిస్థితి కొద్దికొద్దిగా మెరుగవుతోందని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ సభ్యురాలు డాక్టర్ దివ్యా గుప్తా తెలిపారు. ఈ అంశంపై రాజకీయ పార్టీల నేతలు సున్నితత్వం ప్రదర్శించాలని, బాధిత బాలిక చికిత్స పొందే ఆస్పత్రి వద్ద గుమికూడడం వంటివి చేయరాదని బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్పర్సన్ ప్రియాంక్ కనూంగో కోరారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి భరత్ సోని అనే రిక్షావాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ రిక్రియేషన్ కోసం జీవన్ ఖేది ప్రాంతానికి గురువారం పోలీసులు తీసుకెళ్లగా పారిపోయే ప్రయత్నంలో గాయపడ్డాడు. పన్నెండేళ్ల బాలిక అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో రెండున్నర గంటలపాటు సాయం కోరుతూ ఇల్లిల్లూ తిరిగినా పట్టించుకోకపోవడం అమానవీయమని ఎస్పీ సచిన్ శర్మ అన్నారు. ‘నా వెనుక ఎవరో వస్తున్నారు. నేను ప్రమాదంలో ఉన్నాను’అని ప్రాధేయపడిందే తప్ప ఆమె డబ్బులు అడగలేదన్నారు. ‘కొందరు ఛీత్కరించినా, కొందరు రూ.50, రూ.100 వరకు ఇచ్చారు. అదేదారిలో ఉన్న టోల్ప్లాజా సిబ్బంది కొంత డబ్బు, బట్టలు ఇచ్చారు. చివరికి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. వారామెను దగ్గరకు తీసి, మాకు సమాచారం అందించారు’అని ఎస్పీ వివరించారు.. -
అర్ధనగ్నంగా రక్తమోడుతూ
ఉజ్జయిని: మానవత్వానికే మాయని మచ్చగా నిలిచిన ఘటన ఇది. ఒక చిన్నతల్లికి పెద్ద కష్టం వచ్చి వీధుల్లో తిరుగుతూ సాయం కోరినా ఎవరూ ముందుకు రాని దారుణమైన పరిస్థితి ఇది. మధ్యప్రదేశ్లో అత్యాచారానికి గురైన పన్నెండేళ్ల బాలిక అర్ధనగ్నంగా, రక్తమోడుతూ ఉజ్జయిని వీధుల్లో సాయం కోరుతూ తిరిగిన వీడియో అందరినీ కంట తడి పెట్టిస్తోంది. చిన్నారికి వచి్చన ఆ కష్టాన్ని చూసిన వారు దిగ్భ్రాంతికి లోనయ్యారే తప్ప సాయం చెయ్యడానికి ముందుకు రాలేదు. కొందరు పొమ్మంటూ సంజ్ఞలు కూడా చేయడం కూడా కనిపించింది. చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుట స్పృహ తప్పి పడిపోగా ఆశ్రమవాసులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అందరికీ ఈ దారుణం గురించి తెలిసింది. ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలడంతో వెంటనే ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ప్రస్తుతం ఆ బాలికకు ఇండోర్ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నామని, ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా చెప్పారు. ఆ బాలిక ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అత్యాచారానికి గురి కావడంతో తీవ్రమైన షాక్లో ఉన్న ఆ బాలిక తను ఎక్కడ నుంచి వచి్చందో, తల్లిదండ్రులు ఎవరో ఇంకా చెప్పలేకపోతోందని సూపరిండెంట్ ఆఫ్ పోలీసు సచిన్ శర్మ చెప్పారు. ఆ బాలికను నిరంతరం వైద్యులు, మానసిక నిపుణులు పరీక్షిస్తున్నారని కౌన్సెలింగ్ ఇస్తున్నారని చెప్పారు. మరోవైపు ఈ ఘటన మానవత్వానికే మచ్చగా మిగిలిందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ అన్నారు. ఆ బాలిక అలా ఉజ్జయిని రోడ్లపై సాయం కోసం తిరిగిన వీడియో చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఆమె భవిష్యత్ కోసం కోటి రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, రేపిస్టుకి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
కేరళలో దారుణం.. ఐదేళ్ల బాలిక రేప్, హత్య..
తిరువనంతపురం: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఓ వలస కార్మికుడు ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపి గోనుసంచిలో కుక్కిన ఘటన సంచలనం రేపింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదేరోజు అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎర్నాకుళం ఎస్పీ వివేక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్ నుండి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్న ఓ జంట తమ కూతురు కనిపించడంలేదని శనివారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే రెండు బృందాలుగా విడిపోయి ఒక బృందం పాప కోసం గాలించగా మరో బృందం స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించే పనిలో పడ్డారు. కొద్దిసేపు పరిశీలించిన తరవాత సీసీటీవీ ఫుటేజిలో కీలక ఆధారాలు బయటపడ్డాయి. అందులో అదే ఇంటికి పై పోర్షన్లో ఉండే బీహార్ కు చెందిన అస్ఫాక్ అస్లామ్ పాపను శనివారం సాయంత్రం 6.30 ప్రాంతంలో ఎత్తుకెళ్ళడం గమనించడం జరిగింది. వెంటనే అదేరోజు రాత్రి 9.30 గంటలకు అతడిని అదుపులోకి తీసుకున్నాం. కానీ అతడు మద్యం మత్తులో పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నందున రాత్రంతా విచారించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆదివారం ఉదయాన్న అతడు నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. అస్ఫాక్ అస్లామ్ చిన్నారిని తీసుకుని వెళ్తుండడం స్థానికంగా ఉన్న మరొక వ్యాపారి కూడా చూశానని చెప్పడంతో తమ అనుమానం నిజమైందని.. మా శైలిలో విచారణ జరిపించగా మద్యం మత్తులో బాలికపై అమానుషంగా బలాత్కారం చేసి, చంపి పక్కనే ఉన్న బురదలో పడేసి పైకి కనిపించకుండా గోనె సంచులను కప్పినట్లు అతడు నేరాన్ని అంగీకరించాడన్నారు. బాలికను సజీవంగా ఇవ్వలేకపోతున్నందుకు ఆ కుటుంబానికి ఎస్పీ క్షమాపణ చెప్పారు. ఇది కూడా చదవండి: కాశ్మీర్లో సెలవుపై వచ్చిన భారత జవాను అదృశ్యం -
ఆరేళ్ళ బాలికపై తండ్రి వరసైన వ్యక్తి అత్యాచారం
-
కూతురిపైనే పలు మార్లు అత్యాచారం.. మాట వినలేదని ఆమె శరీరాన్ని..
భోపాల్: ఎన్ని చట్టలు తెచ్చినా దేశంలో యువతులు, మహిళలపై దాడులు మాత్రం ఆగడం లేదు. కొన్ని కుటుంబ సభ్యులే మృగాలుగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా వావి వరసలు మరచిన ఓ తండ్రి క్రూర మృగంలా ప్రవర్తించాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపైనే అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఖండ్వా జిల్లాలోని సాక్తాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి(14) తన తండ్రి త్రిలోక్చంద్(55)తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో తన కూతురిపైనే కన్నేసిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కన్న కూతురునే బెదిరింపులకు గురిచేసి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె ఇటీవల ప్రతిఘటించడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన త్రిలోక్చంద్ ఆమెపై దాడి చేశాడు. ఆమెను కత్తితో నరికి.. శరీరాన్ని రెండు ముక్కలుగా చేశాడు. ఆ శరీర భాగాలను గోనె సంచుల్లో కట్టేశాడు. అనంతరం తన బంధువు సాయంతో గోనె సంచిని తీసుకెళ్లి స్థానికంగా ఉన్న అజ్మన్ నదిలో పారేశాడు. ఈ క్రమంలో అది గమనించిన కొందరు వ్యక్తలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేశ్ పెండ్రో తెలిపారు. -
బాలికపై కామాంధుడి పైశాచికం!
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): బాలికపై కామాంధుడి పైశాచిక చర్య ఆలస్యంగా వెలుగుచూసింది. గోపాలపట్నంలో సంచలనం రేపిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గోపాలపట్నం రైల్వే స్టేషన్ ప్రాంతం నేతాజీనగర్కు చెందిన బాలికపై స్థానికంగా నివాసముంటున్న కామాంధుడి కళ్లు పడ్డాయి. బాలికను లొంగదీసుకుని అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. అనంతరం విషయం తెలుసుకున్న కామాంధుడు గర్భస్రావం కోసం మాత్రలు వాడినా ప్రయోజనం లేకపోగా అధికంగా రక్తస్రావం జరిగింది. దీంతో గోపాలపట్నంలోని 30 పడకల ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు కేజీహెచ్కు తరలించాలని రిఫర్ చేశారు. అక్కడి నుంచి 108 వాహనంలో బాలికను కేజీహెచ్కు తరలించారు. అక్కడ తన పలుకుబడితో బాలికకు అబార్షన్ చేయించేశాడని, అనంతరం బాలికనూ, ఆమె తల్లినీ దాచేశాడని నేతాజీనగర్ వాసులు ఆరోపిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి ఫిర్యాదు చేయకుండా చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కామాంధుడికి కొందరు రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలిక అప్పటికే 4 నెలల గర్భిణి అని, ఆమెను తీసుకొచ్చిన వ్యక్తి తమతో గొడవ పడ్డాడని గోపాలపట్నం వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా 108 వాహనంలో తరలించే సమయంలో ఆ సిబ్బంది వివరాలు సేకరించి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు కేజీహెచ్లో కూడా బాలిక గర్భం దాల్చిందనే అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి. కానీ అలా ఎక్కడా జరగలేదు. అయితే ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని గోపాలపట్నం సీఐ రమణయ్య చెబుతున్నారు. దీనిపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
మతి స్థిమితం లేని బాలికపై అఘాయిత్యం
సాక్షి,మణుగూరుటౌన్: పట్టణంలోని మతి స్థిమితం లేని బాలిక(14)పై సోమవారం రాత్రి లైంగిక దాడి చేసిన ముగ్గురు నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబా తెలిపిన వివరాలు...బెలూన్లు కొనేందుకని పట్టణంలోని షాపు వద్దకు వెళ్లిన మతి స్థిమితం లేని బాలికను ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు. గాంధీనగర్ చర్చి ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. ఆ బాలిక గట్టిగా అరవడంతో ఆ యువకులు పారిపోయారు. చుట్టుపక్కల వారు ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు బైక్పై ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికపై లైంగిక దాడి చేసింది తామేనని వారు ఒప్పుకున్నారు. వీరిని– అశోక్నగర్కు చెందిన డేగ యశ్వంత్, కరకగూడెం మండలం తురుములగూడెం గ్రామస్తుడు నిట్టా ప్రశాంత్గా పోలీసులు గుర్తించారు. మరో నిందితుడైన పినపాక మండలం టి.కొత్తగూడెం గ్రామస్తుడు సిద్ధి నరేష్ పరారీలో ఉన్నాడు. వీరు ముగ్గురూ గతంలో కూడా గాంధీనగర్కు చెందిన బాలికను కిడ్నాప్ చేసి వదిలేశారు. నరేష్ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. -
దాచేపల్లి బంద్కు పిలుపు
గుంటూరు: దాచేపల్లిలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై సుబ్బయ్య అనే వృద్ధుడు అత్యాచారానికి పాల్పడటంతో స్థానికులు నార్కట్పల్లి-అద్ధంకి రహదారిపై బైఠాయించి వృద్ధుడిని వెంటనే అరెస్ట్ చేయాలని ముస్లిం సంఘాల నాయకులు బాధితులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గురువారం మధ్యాహ్నాంలోపు అరెస్ట్ చేస్తామని హమీ ఇవ్వడంతో గురువారం ఉదయం ఆందోళన విరమించారు. బాలికపై అత్యాచారానికి నిరసనగా గురువారం దాచేపల్లి బంద్కు స్థానికులు పిలుపునిచ్చారు. -
మానవ మృగాలను శిక్షించాలి
ప్రొద్దుటూరు టౌన్ : జమ్మూకశ్మీర్లో 8 ఏళ్ల బాలికను చిత్ర హింసలకు గురి చేసి చంపిన మానవ మృగాలను చంపాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పుట్టపర్తి సర్కిల్ మీదుగా రాజీవ్ సర్కిల్ వరకు నిర్వహించారు. ఇందులో టీఎన్ఎస్ఎఫ్ పట్టణాధ్యక్షుడు చేతన్రెడ్డి, ఉపాధ్యక్షుడు అనిల్, సాయినాథ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.వినోద్, గురు సుమంత్, రెహమాన్, మల్లికార్జునరెడ్డితోపాటు టీఎన్టీయూసీ హర్షవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, వైస్ చైర్మన్ జబీవుల్లా, ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, లక్ష్మీప్రసన్న, ఉషా, గరిశపాటి లక్ష్మీదేవి, సీఓలు రసూలమ్మ, విమల, డ్వాక్రా సంఘాల సభ్యులు, టీడీపీ నాయకులు కొవ్వొత్తులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 రోజులపాటు అత్యంత దారుణంగా హింసించి చంపేసిన కిరాతకులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. -
బాలికపై ముగ్గురు యువకులు దారుణం
గౌహతి : ఐదో తరగతి చదువుతున్న బాలికపై సామూహిక లైంగికదాడి జరిగింది. ముగ్గురు యువకులు లైంగిక దాడి చేసి, అనంతరం కిరోసిన్ పోసి నిప్పటించారు. ఈ దుర్ఘటన అస్సాంలోని నాగోన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఐదో తరగతి చదువుతున్న బాలిక స్కూల్ అయిపోగా ఇంటికి తిరిగొచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరు. దాంతో అదే పాఠశాలకు చెందిన ముగ్గురు ఇంట్లోకి చొరబడి బాలికపై లైంగికదాడి చేశారు. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించారు. అది గమనించిన ఇరుగుపొరుగువారు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మరణ వాంగ్మూలం తీసుకున్నారు. అప్పటికే 90శాతం కాలిన గాయాలు అవడంతో ప్రాణాలు పోయాయి. కాగా, ఇంతటి దారుణానికి పాల్పడిన ఆయన ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు జువైనల్స్ అని పోలీసులు పేర్కొన్నారు. ఆ ముగ్గురు కూడా ఒకే గ్రామానికి చెందినవారని ,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
మంచినీళ్లడిగి... బాలికపై లైంగిక దాడి
సాక్షి, అశ్వారావుపేట రూరల్ : ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. దీనిపై తల్లి స్థానిక పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా ఏఎస్ఐ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..అశ్వారావుపేట రూరల్ మండల పరిధిలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన బాలిక(15) తన చెల్లితో కలిసి ఈ నెల 2వ తేదిన ఇంట్లో టీవీ చూస్తున్న సమయంలో దమ్మపేట మండలానికి చెందిన పిక్కిలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చి మంచినీళ్లు అడిగాడు. దాంతో బాధితురాలి చెల్లి లోపలికి వెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చే సరికి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతుండగా అడ్డుకుంది. అడ్డుకుంటున్న చెల్లిపై దాడికి పాల్పడి బయటకు నెట్టివేశాడు. అనంతరం ఇంటి తలుపులు మూసి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వ్యవసాయ పనులకు వెళ్లిన తల్లిదండ్రులు సాయంత్రం సమయంలో ఇంటికి రాగా, బాధితురాలు సంఘటనను చెప్పింది. దాంతో గురువారం ఉదయం లైంగిక దాడి సంఘటనపై తల్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఏఎస్ఐ శంకర్రావు కేసు నమోదు చేశారు. దీనిపై అశ్వారావుపేట సీఐ అబ్బయ్య దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు. -
తల్లిని చితకబాది, కూతురిపై గ్యాంగ్ రేప్
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లో మరో అత్యాచార ఘటన జరిగింది. షామ్లీ జిల్లాలోని తనభవన్లో ముగ్గురు దుండగులు ఇంట్లో నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థిని బలవంతంగా లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. ఆదివారం బాధితురాలి తండ్రి పనిమీద బయటకువెళ్లిన సమయంలో దుండగులు ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితురాలి తల్లిని చితకబాది, బాలికను కిడ్నాప్ చేసి సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను దీపక్, సతీష్, జోనిలుగా గుర్తించారు. కాగా నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదు. ఈ కేసును విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
అయోధ్య ముస్లిం ఓటర్లు ఎటువైపు?
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
యువతీ యువకులకు శిక్షణ
సీసాల్లో పెట్రోల్, డీజిల్ విక్రయించొద్దు
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయండి
సాయి మహిమ.. సర్వులకూ రక్ష
కిర్గిజ్స్థాన్లో తెలుగువారు సురక్షితం
పార్లమెంట్ సెక్యూరిటీపై కేంద్రం కీలక నిర్ణయం
అదీ.. దాంపత్యం అంటే..!
ఇవాళే డీజీపీకి నివేదిక.. సిట్ పొడిగింపు?
తప్పక చదవండి
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
Advertisement