-
గుక్కెడూ.. కరువే
రాష్ట్రవ్యాప్తంగా మంచినీటికి తీవ్ర కొరత ఎండిపోయిన చెరువులు, వట్టిపోయిన బోర్లు రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో తీవ్రమైన మంచినీటి కొరత ఏర్పడింది. బిందెడు నీళ్ల కోసం నాలుగు గంటల పాటు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ కోతలు, విద్యుత్ సరఫరా ఉన్నా లో వోల్టేజీ సమస్య వంటివి పరిస్థితిని మరింత దుర్భరం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో 60 నుంచి 70 శాతం గ్రామీణ మంచినీటి పథకాలు మూలనపడ్డాయి. అధికారవర్గాల సమాచారం ప్రకారమే చూసినా... ఏ జిల్లాలోనూ 10 నుంచి 12 శాతం బోర్లు కూడా పనిచేయడం లేదు. నల్లగొండ జిల్లా దేవరకొండ, ఖమ్మం జిల్లా కొత్తగూడెం, వరంగల్ జిల్లా మహబూబాబాద్ డివిజన్లలో బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. ప్రభుత్వం తీవ్రంగా నీటి కొరత ఉన్న గ్రామాలను గుర్తించి.. 1,200 నుంచి 1,500 అడుగుల లోతు వరకూ బోర్లు తవ్వించినా.. చుక్క నీరు రాని ఉదంతాలు నెలకొన్నాయి. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో చాలా చోట్ల మహిళలు కిలోమీటర్ల కొద్దీ నడిచి మంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన వస్తోంది. - సాక్షి, హైదరాబాద్ ఏమీ పట్టని సర్కారు.. తాగునీటి అవసరాలను తీర్చేందుకు వేసవి కార్యాచరణ ప్రణాళిక పేరిట ప్రభుత్వం అరకొర చర్యలే చేపట్టింది. తొమ్మిది జిల్లాల్లో కేవలం 742 గ్రామాల్లోనే నీటి ఎద్దడి ఉందని.. అక్కడ అవసరమైన చర్యలు చేపట్టామని పేర్కొంది. కానీ ఆ గ్రామాల పరిస్థితిలో ఎక్కడా మార్పు లేదు. చుక్క నీరు లేని 167 గ్రామాలకు ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ అరకొర నీటి సరఫరాతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువులు ఎండిపోయిన 575 గ్రామాల్లో ప్రైవేటు వనరుల (బావులు, బోర్లు) నుంచి నీటిని సేకరించి.. సరఫరా చేస్తున్నారు. కానీ ఆయా గ్రామాల్లో అవసరమైన నీటిలో పది శాతంకూడా తీరడంలేదు. అసలు కార్యాచరణ ప్రణాళిక కింద ప్రభుత్వం రూ. 263 కోట్లను కే టాయించినా... వాటిని ఇంకా ఖర్చు చేయడం లేదు. గ్రామాల్లోని బోరుబావుల లోతు పెంచడం, పూడికతీత, మరమ్మతుల కోసం రూ. 40 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. కానీ పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. ‘మినరల్ వాటర్’ ప్లాంట్ల ముప్పు.. ఎక్కడైనా ఓ బోరులోనో, బావిలోనో నీళ్లు ఉన్నాయంటే.. అక్కడికి మినరల్ వాటర్ ప్లాంట్ల యజమానులు ఊరుకులు పరుగులు పెడుతున్నారు. వాటి యజమానులకు డబ్బులిచ్చి.. నీటిని వాడేసుకుంటున్నారు. ఫిల్టర్ చేసిన నీటిని ఎక్కువ ధరకు గ్రామాల్లోనే అమ్ముతున్నారు. గత డిసెంబర్ నెల చివరి వరకూ 20 లీటర్ల క్యాన్ నీళ్లను రూ. 10 నుంచి రూ. 12 వరకూ విక్రయించిన వ్యాపారులు... మార్చి తొలివారం నుంచి రూ. 25కు పెంచేశారు. ప్రస్తుతం కొన్ని చోట్ల ఏకంగా క్యాన్ నీటిని రూ. 50కి పెంచేయడం ఆందోళనకరం. నల్లగొండ జిల్లా నాంపల్లి, చండూరు, మర్రిగూడెం, కొండమల్లేపల్లి, మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట్, కల్వకుర్తి, నాగర్కర్నూలు, జడ్చర్ల, కొడంగల్, రంగారెడ్డి జిల్లా తాండూరు, పెద్దేముల్, ఇబ్రహీంపట్నం, మంచాల ప్రాంతాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు ఇలా నీటితో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ఇలాంటి వాటిని నియంత్రించడంలో స్థానిక అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. పలు చోట్ల అధికారులు ముడుపులు పుచ్చుకుని చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ట్యాంకర్లతో సరఫరా.. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు చేపట్టాం. అత్యవసర పరిస్థితులు నెలకొన్న గ్రామాలకు ట్యాంకర్లతో మంచినీటిని సరఫరా చేస్తున్నాం. కొన్ని గ్రామాల్లో బోరు బావుల లోతు పెంచడం, పూడిక తీత వంటి కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. వేసవి ప్రణాళిక కింద ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఆయా జిల్లాల కలెక్టర్ల సిఫారసుల మేరకు ఖర్చు చేయాలని అధికారులను ఆదేశించాం.’’ - సురేందర్రెడ్డి, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఎన్సీ వర్షాభావం వల్లే.. ‘‘రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గత నాలుగేళ్లలో ఈ ఏడాదే అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో చెరువులు ఎండిపోయాయి. భూగర్భజ లాలు అడుగంటాయి. ఇటువంటి పరిస్థితులను నివారించాలంటే వాన నీటిని సంరక్షించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాల్సిన అవసరముంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి.’’ - నర్సింహులు బాబు, జియాలజిస్ట్ కరుణించని వరుణుడు.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది (2014-15) రాష్ట్రంలో తీవ్ర వ ర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం 862.10 మిల్లీమీటర్లు కాగా... ఈ ఏడాది కేవలం 591.50 మిల్లీమీటర్లుగా నమోదైంది. సాధారణ వర్షపాతం కన్నా ఇది 270.60 మిల్లీమీటర్లు అంటే ఏకంగా 31 శాతం తక్కువ. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో అయితే బాగా తక్కువగా వర్షపాతం నమోదైంది. -
దాహం తీరినట్టే..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో మంచినీటి కొరత తీర్చేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటర్గ్రిడ్ పథకాన్ని జిల్లాలోని అన్ని ఆవాసాలకు అనుసంధానం చేయనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మూడు ప్రాంతాల్లో తాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నిరంతర నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించారు. దీనికి ప్రభుత్వం దాదాపు రూ.4వేల కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైంది. నేడు మంత్రి కేటీఆర్ పరిశీలన జిల్లాలో వాటర్గ్రిడ్ నిర్మాణ నమూనాలు, వాటి ద్వారా ప్రజలకు తాగునీరు అందే విధానాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం పరిశీలిస్తారు. జిల్లాలోని పాలేరు, వైరా ప్రాంతాల్లో పర్యటిస్తారు. జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు సరిపడా నీరందించే అవకాశం గోదావరి పరీవాహక ప్రాంతానికి ఉన్నట్లు గుర్తించారు. వాటర్గ్రిడ్ నిర్మాణానికి అనువైనదిగా ఈ ప్రాంతాన్ని తీసుకున్నారు. అశ్వాపురం మండలం పాములపల్లి వద్ద నిరంతరం నీరు అందుబాటులో ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా అక్కడ వాటర్గ్రిడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 22 మండలాల్లోని అన్ని ఆవాసాలకు తాగునీరు నిరంతరం సరఫరా చేయాలని నిర్ణయించారు. రిజర్వాయర్ల పరిసరాల్లో.. పాలేరు రిజర్వాయర్ వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టు (వాటర్గ్రిడ్) ద్వారా ఏడు మండలాల్లోని 365 ఆవాసాలకు నిరంతరం నీటి సరఫరా చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వైరాలో నిర్మించే వాటర్గ్రిడ్ ద్వారా 11 మండలాల్లోని 565 ఆవాసాలకు తాగునీరు అందించనున్నారు. ఇప్పటికే వైరా, పాలేరు, అశ్వాపురం మండలం పాములపల్లి వద్ద నిర్మిస్తున్న గ్రిడ్లను రాష్ట్ర ప్రభుత్వ తాగునీటి సలహాదారు హరి ఉమాకాంతారావుతో పాటు పలువురు అధికారులు సందర్శించారు. సాంకేతిక పరమైన సూచనలు చేశారు. వాటర్గ్రిడ్ నిర్మాణ పనులపై జిల్లా రక్షిత మంచినీటి సరఫరా అధికారులు, రాష్ట్ర మంత్రి కేటీఆర్కు వైరాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు తాగునీటికి పడుతున్న ఇబ్బంది, వాటర్గ్రిడ్ వల్ల ప్రజలకు కలిగే అదనపు ప్రయోజనం, ఇంటింటికీ పంపు కనెక్షన్ ఇచ్చే తీరు, పైపులైన్లు నిర్మించే విధానాన్ని అధికారులు మంత్రికి వివరిస్తారు. మరికొన్ని మార్పులుండవచ్చు.. ఇప్పటికే వివిధ సర్వేల ద్వారా వాటర్గ్రిడ్ ప్రాజెక్టులకు అనువైన స్థలాన్ని అధికారులు సాంకేతికంగా ఖరారు చేశారు. ఒకవేళ మంత్రి కేటీఆర్ ఏమైనా మార్పులు సూచిస్తే దానికి అనుగుణంగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. తొలుత జూలూరుపాడు, ఏన్కూరు మండలాలకు పాములపల్లి వాటర్గ్రిడ్ ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని అధికారులు భావించారు. అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. ఆ ప్రాంతాలు పాములపల్లికి అత్యంత దూరం కావడంతో ఈ రెండు మండలాలను వైరా వాటర్గ్రిడ్కు అనుసంధానం చేశారు. వైరా వాటర్గ్రిడ్ పరిధిలో ఉన్న సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాలను పాములపల్లి వాటర్గ్రిడ్కు అనుసంధానం చేస్తూ ప్రణాళిక రూపొందించారు. వాటర్గ్రిడ్తోపాటు సెకండరీ గ్రిడ్, మూడు మండలాలకు ఒక హెడ్వర్క్ను నిర్మిస్తారు. దీన్ని ఊరూరా ఉండే హెడ్వర్క్లతో అనుసంధానిస్తారు. నాలుగేళ్లలో జిల్లావ్యాప్తంగా నీరు ఇప్పటి వరకు జిల్లాలో 3,167 గ్రామాల్లో నిరంతరం, 1,282 గ్రామాల్లో పాక్షికంగా నీరు సరఫరా చేస్తున్నారు. వాటర్గ్రిడ్ నిర్మాణం పూర్తయితే వచ్చే నాలుగేళ్లలో 3,167 గ్రామాలకు 24 గంటలపాటు నీరు సరఫరా చేసే అవకాశం ఉంది. జిల్లాలోని 580 కిలోమీటర్ల పొడవున్న ప్రధాన పైపులైన్, అక్కడి నుంచి గ్రామాలు, ఆవాస ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయనున్నారు. దీని కోసం 4,431 కిలోమీటర్ల పొడవైన పైపులైన్ నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో పలు జలాశయాలు, చెరువుల్లో నీరు నింపి అక్కడి నుంచి నిరంతరం తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వాటర్గ్రిడ్ పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు జిల్లాలో ఈ పథకం విజయవంతానికి పూర్తిస్థాయి దృష్టి సారించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బ్రిటన్లో అత్యంత సంపన్నుడు భారతీయుడే..!
మల్లె మొగ్గ మూవీ సక్సెస్ మీట్.. పోస్టర్ లాంఛ్!
నా పై వచ్చిన అతి పెద్ద ఆరోపణ అదే: ప్రధాని మోదీ
పాయల్ రాజ్పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!
ఐఫోన్పై రూ.26వేలు డిస్కౌంట్.. ఎక్కడంటే..
బస్ సర్వీస్ ప్రారభించనున్న ఉబర్.. మొదట ఆ నగరంలోనే..
ఓటేసిన వ్యాపార ప్రముఖులు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
తప్పక చదవండి
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement