-
కొత్త అవతారం ఎత్తిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ
న్యూఢిల్లీ: సెలబ్రిటీ దంపతులు విరాట్ కోహ్లి, ఆయన భార్య అనుష్క శర్మ తాజాగా ఈవెంట్ల నిర్వహణ కోసం కొత్త వెంచర్ ప్రారంభించారు. నిసర్గ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. తొలుత మోటార్ స్పోర్ట్స్, వినోద కార్యక్రమాల నిర్వహణ సంస్థ ఎ లీట్ ఆక్టేన్తో నిసర్గ జట్టు కట్టింది. ఎలీట్ ఆక్టేన్కు ది వేలీ రన్ వంటి ఈవెంట్లకు సంబంధించి మేథోహక్కులు (ఐపీ) ఉన్నాయి. ప్రస్తుతం మూడు మోటార్స్పోర్టింగ్ ఈవెంట్లు, ఎగ్జిబిషన్లు, ఒక మ్యూజిక్ కాన్సర్ట్ మొద లైనవి నిర్వహించనున్నట్లు నిసర్గ పేర్కొంది. తాహా కోబర్న్ కూటే ఈ సంస్థకు సీఈవోగా, సీవోవోగా అంకుర్ నిగమ్ నియమితులయ్యారు. -
మరోసారి అరుణ్శౌరి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఆర్థిక వేత్త, పాత్రికేయుడు , బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలా ఉంది తప్ప ప్రభుత్వంలా వ్యవహరించడంలేదని మండిపడ్డారు. మేధావులు, నిపుణులతో సంప్రదింపులు, సమీక్షలు జరపకుండా, ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విరుచుకు పడ్డారు. దీని ఫలితమే నోట్ల రద్దు నిర్ణయమన్నారు. మూడేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం సాధించింది ఏమీలేదన్నారు. పైగా అనేక రంగాల్లో క్షీణతను నమోదు చేసిందని శౌరి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఉద్యోగాల కల్పనలో తీవ్ర వైఫ్యలం చెందిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలా ఉంది తప్ప ప్రభుత్వంలా వ్యవహరించడంలేదని మండిపడ్డారు. ఎందుకంటే ఎవరితోనూ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. ఈ క్రమంలో దేశీయ ఆర్థిక విధానానికి సంబంధించి డీమానిటైజేషన్ తీవ్రమైన తప్పిదమని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ భద్రతా విధానంలో, విదేశీ విధానం, ముఖ్యంగా చైనాతో సంబంధాలు తదితర అంశాల్లో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు జరిగితే దీని ప్రభావం దారుణంగా ఉంటుందన్నారు. ఇది దేశానికి మంచిదికాదని, దీని ఫలితాలు భారీ విపత్తుకు దారతీస్తాయని పేర్కొన్నారు. అన్నిరంగాల్లో వృద్ధి క్షీణతను నమోదు చేస్తోంటే. జీడీపీ 7శాతంవృద్ధి ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఐటీ రంగంలో ఉద్యోగాల సంక్షోభంపై మాట్లాడుతూ టెక్నాలజీ పరుగులుపడుతున్న నేపథ్యంలో సాంకేతిక నైపుణ్యాలకు అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందని అరుణ్ శౌరి అభిప్రాయపడ్డారు. కాగా మోదీ ప్రభుత్వంపై గత ఏడాదికూడా అరుణ్ శౌరి విమర్శలు గుప్పించారు. మోదీ ఏకవ్యక్తి పాలన కొనసాగిస్తున్నారనీ, దీనివల్ల భారత ప్రజాస్వామ్యానికి చేటు తప్పదని ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
నాణ్యమైన విత్తనాలతో ఆశించిన దిగుబడులు
గతానికంటే మెరుగైన సీట్లతో మళ్లీ జగనన్న పాలన
ఇరువర్గాలపై కేసులు నమోదు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఇంటర్ సప్లిమెంటరీకి సర్వం సిద్ధం
భద్రత వెరీ స్ట్రాంగ్
24న ఎంఎస్ఎంఈ వర్క్షాప్
అంగన్వాడీ కేంద్రాలుతనిఖీ చేసిన ఆర్జేడీ
నేడు మోదకొండమ్మ కొలువు సంబరం
సింహగిరి.. ఆధ్యాత్మిక ఝరి
తప్పక చదవండి
- కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement