-
హవాలా గ్యాంగులు.. తెర వెనుక ‘పెద్దలు’!
-
హవాలా గ్యాంగులు.. తెర వెనుక ‘పెద్దలు’!
► నిన్న వైజాగ్.. నేడు విజయవాడ ► ఆయా ఘటనల్లో టీడీపీ నేతల ప్రమేయంపై అనుమానాలు ► పెద్ద మొత్తాల్లో రుణాలు, డబ్బు మార్పిడిలో కీలక పాత్ర ► పోలీసుల చేతికి చిక్కకుండా చేతులు మారుతున్న రూ.కోట్లు ► పోలీసులకు సవాలుగా మారిన లావాదేవీలు రాష్ట్రంలో హవాలా బాగోతాలు హడలెత్తిస్తున్నాయి. ప్రతి కుంభకోణం వెనుక అధికార తెలుగుదేశం పార్టీ నేతల పాత్రలు వెలుగు చూస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత టీటీడీ బోర్డు సభ్యునిగా ఉన్న శేఖర్రెడ్డి హవాలా రూపంలో పెద్ద మొత్తంలో కొత్త నోట్లను తెప్పించుకుని దొరికిపోయాడు. చెన్నైకి చెందిన శేఖర్రెడ్డికి టీటీడీ బోర్డు సభ్యునిగా పదవి కట్టబెట్టినప్పుడే పలు అనుమానాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకుల సొమ్మును హవాలా రూపంలో విదేశాలకు తరలించడంలో సహకారం అందిస్తున్నందుకే ఆ పదవి ఇచ్చినట్లు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. శేఖర్రెడ్డి అరెస్ట్ కావడంతో టీటీడీ బోర్డు సభ్యునిగా తొలగించి.. ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నట్లు అప్పట్లో ముఖ్యమంత్రి చేతులు దులిపేసుకున్నారు. ఇటీవల విశాఖపట్నంలో వెలుగు చూసిన హవాలా కుంభకోణం వెనుక రాష్ట్ర మంత్రుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి చెందిన తండ్రీకొడుకులు వడ్డి శ్రీనివాసరావు, మహేశ్లు విశాఖ కేంద్రంగా రెండు డొల్ల కంపెనీల పేరుతో ఏకంగా రూ.1500 కోట్లకు పైగా మొత్తాన్ని హవాలా రూపంలో విదేశాలకు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర రాజధాని విజయవాడలో వెలుగు చూసిన హవాలా వివాదం ముదిరి క్రిమినల్ చర్యలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడా టీడీపీ ప్రజాప్రతినిధుల పాత్ర ఉందనే అనుమానాలు గుప్పుమంటున్నాయి. గత ఎన్నికల్లో విజయవాడ కేంద్రంగా ప్రస్తుత కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, మరికొందరు టీడీపీ ప్రముఖులు హవాలా ద్వారా పెద్ద ఎత్తున రాష్టంలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు డబ్బు సంచులు అందించారన్న ఆరోపణలున్నాయి. బిల్లులు లేకుండా సరుకు తరలించడం, భారీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ నిర్మాణాలకు పెట్టుబడులకు హవాలా ద్వారా విజయవాడ, విశాఖల్లో పెద్ద మొత్తాలు చేతులు మారడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. ఈ వ్యవహారాల్లో టీడీపీ ముఖ్య నేతలే వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారని ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. బ్రహ్మాజీరావుపై దాడి.. రంగంలోకి దిగిన పెద్దలు విజయవాడలో ఫైనాన్సియర్ బ్రహ్మాజీరావు కిడ్నాప్, దాడి కేసు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, హెల్డ్ ఆసుపత్రి ఎండీ చలపాటి రవి, సన్ని, వెంకటేశ్వరరావు, శ్రావణ్లతోపాటు మరో ఆరుగురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఈ ఘటన వెనుక కారణాల్లోకి వెళితే.. హెల్ప్ ఆస్పత్రి ఎండీ చలపాటి రవి, టైమ్ ఆస్పత్రి ఎండీ హేమంత్, న్యూరో సర్జన్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణలతోపాటు మరికొందరికి బ్రహ్మాజీరావు రూ.50 కోట్లు ఫైనాన్స్ సౌకర్యం ఏర్పాటు చేస్తానని చెప్పారు. అందుకు రూ.కోటి కమీషన్ తీసుకున్నారని తెలుస్తోంది. చెప్పిన విధంగా రుణం ఇప్పంచలేదు. దీంతో వారు బ్రహ్మాజీరావును కిడ్నాప్ చేసి విజయవాడ శివారులోని ఓ తోటలోకి తీసుకువెళ్లారు. అక్కడ ఆయన్ను తీవ్రంగా కొట్టారు. కొన్ని పత్రాల మీద సంతకాలు తీసుకుని వదిలిపెట్టారు. తీవ్రంగా గాయపడిన బ్రహ్మాజీరావును కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. దాడి చేశారని ఫిర్యాదు చేసినప్పటికీ విజయవాడ పడమట సీఐ కెన్నెడీ సీరియస్గా తీసుకోలేదు. మరోవైపు ట్రాఫిక్ ఏసీపీ సూర్యచంద్రరావు ఈ వ్యవహారంలో వైద్యులకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. బ్రహ్మాజీరావు కుటుంబ సభ్యులు విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్కు ఫిర్యాదు చేయగా, ఆయన ప్రాథమిక విచారణ నిర్వహించి ఏసీపీ సూర్యచంద్రరావును సరెండర్ చేశారు. సీఐ కెన్నెడీని వీఆర్కు పంపారు. ఇది హవాలా డబ్బు వ్యవహారమే! బ్రహ్మాజీరావు రూ.50 కోట్లు రుణం ఎలా ఇప్పిస్తానని చెప్పారన్నది కీలకంగా మారింది. విదేశాల నుంచి హవాలా రూపంలో భారీగా నగదు మార్పిడి జరుగుతోందని పోలీసులు భావిస్తున్నారు. విదేశాల నుంచి రుణాన్ని ఇప్పిస్తానని బ్రహ్మాజీరావు చెప్పినట్లు నిందితుల కుటుంబ సభ్యులు వెల్లడించారు. మూడేళ్లుగా ఈ వ్యవహారం సాగుతోందని చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో చెప్పినట్టు డబ్బు ఇప్పించక పోవడంతోనే ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తి కిడ్నాప్, దాడి వరకు దారితీసింది. ఈ వ్యవహారం కలకలం రేపడంతో కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత స్వయంగా రంగంలోకి దిగారు. మరోవైపు ప్రభుత్వ ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడైన ఓ పత్రికాధిపతి కూడా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఓ ఆసుపత్రి ఎండీ ఆయనకు సన్నిహితుడు కావడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కీలక నేత ఈ సెటిల్మెంట్ బాధ్యతను తన సన్నిహితుడికి అప్పగించినట్లు తెలిసింది. ఆయన ఇరు వర్గాలతో విజయవాడ భారతీనగర్లో బుధవారం ఉదయం రాజీ చర్చలు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో కీలక నిందితులు పరారీలో ఉన్నారు. వారిలో కొందరికి అనంతపురం జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ పెద్దలు అంతా రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. నన్ను కొట్టి నగలు తీసుకున్నారు.. ‘పువ్వాడ రవి, సన్ని, చల్లపాటి రవి, వాళ్ల అన్న వెంకటేశ్వరరావు, వారికి మద్దతుగా వచ్చిన కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారు. నా ఒంటి మీదున్న రూ.2 కోట్ల నగులు లాక్కున్నారు. డాక్యుమెంట్ల మీద సంతకాలు తీసుకున్నారు. ఇంటి వద్ద ఉన్న రాళ్ల సంచిని తెప్పించి తీసుకున్నారు. వాటి విలువ ఎంతో తెలియదు. నా ఆస్తి మొత్తం స్వాహా చేయాలన్నది వారి ఉద్దేశం. వారిలో రవి తప్ప మిగిలినవాళ్లెవరూ నాకు తెలియదు. నా కిడ్నాప్లో రవి పాత్రే ఎక్కువ. నన్ను కొడుతుంటే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అక్కడకు వచ్చారు. ఆయన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అని వాళ్లు చెబితేనే తెలిసింది. ఆయన పొడవుగా బక్క పలుచగా ఉన్నారు. నన్ను కొట్టడంతో వాళ్లు చెప్పమన్నట్లుగా నేను చెప్పాను. అదంతా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వీడియో రికార్డు చేశాడు. అనంతరం ఈ నెల 14న ఇంటిలో విడిచిపెట్టారు’ అని విజయవాడ సెంటినరీ ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న బ్రహ్మాజీరావు బుధవారం విలేకరులకు వెల్లడించారు. బ్రహ్మాజీ మోసం చేశారు ‘విదేశాల నుంచి రూ.5 కోట్లు రుణాన్ని ఇప్పిస్తానని చెప్పి బ్రహ్మాజీరావు మమ్మల్ని మోసం చేశారు. రుణం ఇప్పించేందుకు కమీషన్గా రూ.30 లక్షలు ఇచ్చాము. మూడేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయంపై మాట్లాడేందుకు బ్రహ్మాజీరావును విజయవాడ శివారులోని నున్న వద్దకు పిలిపించాము. కానీ ఆయనపై దాడి చేయలేదు. విశాఖపట్నంకు చెందిన తాతాజీ.. బ్రహ్మాజీరావుకు దళారిగా వ్యవహరించారు’ అని నిందితుడు చలపాటి వెంకటేశ్వరరావు భార్య లలితాదేవీ బుధవారం మీడియాకు వెల్లడించారు. తాతాజీ విలేకరులతో మాట్లాడుతూ బ్రహ్మాజీరావు మోసగాడని విమర్శించారు. హవాలా పేరుతో మోసం చేద్దామని నన్ను కూడా ఒప్పించేందుకు ప్రయత్నించేవారని చెప్పారు. కోడ్తో కోట్లు అటూ ఇటూ.. దేశ, విదేశాల్లో ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఒక చోట నుంచి మరొక చోటుకు కాలు కదపకుండా, డబ్బు మోసుకెళ్లకుండా కేవలం ఒక్క కోడ్తో కోట్లు చేతులు మారిపోతాయి. దీనినే హవాలా అని పిలుస్తారు. ఒక ప్రాంతంలో ఉండే హవాలా ఏజెంట్కు కోట్లాది మొత్తాన్ని అప్పగించి ఆయన ఇచ్చే కోడ్ నెంబర్ను వేరొక ప్రాంతంలో డబ్బు అందుకోవాల్సిన వారికి చెబుతారు. అక్కడి ఏజెంటుకు అతను ఆ కోడ్ చెబితే ఆ మొత్తాన్ని చేతికి అందిస్తారు. కోడ్గా రూ.5 నుంచి రూ.20 నోటు వరకు ఏదో ఒక నోటు ఇచ్చి దానిపై ఉండే సీరియల్ నెంబర్ చూపడం, కారు నెంబర్, మొబైల్ నెంబర్ ఇలా రకరకాల కోడ్లతో కోట్లాది రూపాయాలు చేతులు మారుతుంటాయి. ఇందుకోసం హవాలా ఏజెంట్లు 2 నుంచి 3 శాతం కమిషన్ వసూలు చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ హవాలా కీలక కేంద్రంగా పేరొందింది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ, విశాఖల్లో ఆ వ్యవహారం విచ్చలవిడిగా సాగుతోంది. -
ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సమక్షంలోనే..
-
హవాలా అంటే ఏంటో కూడా తెలియదు
-
హవాలా అంటే ఏంటో కూడా తెలియదు: బ్రహ్మాజీ
జీవితంలో తాను ఎప్పుడూ తప్పు చేయలేదని, ఎవరైనా సాయం అడిగితే చేశాను తప్ప చట్టాన్ని ఏనాడూ ఉల్లంఘించలేదని విజయవాడ సెంటినరీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రహ్మాజీరావు చెప్పారు. అసలు తనకు హవాలా అంటే నిర్వచనం ఏంటో కూడా తెలియదని అన్నారు. ఆస్పత్రిలో ఉన్న బ్రహ్మాజీతో 'సాక్షి టీవీ' ప్రతినిధి ప్రత్యేకంగా మాట్లాడారు. డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, సన్నీ, చల్లపాటి రవి, వాళ్ల అన్న వెంకటేశ్వరరావు, వాళ్లకు మద్దతుగా ఉన్న కొంతమంది రౌడీలు కలిసి తనను ఎత్తుకెళ్లి వారం రోజుల పాటు కొట్టి, ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి తన ఇంట్లో వదిలేశారని, తాను ఆస్పత్రికి వస్తే వెంటనే తన పరిస్థితి చూసి ఐసీయూలో చేర్చారని ఆయన చెప్పారు. తనను కొట్టి, తన ఒంటి మీద ఉన్న దాదాపు రూ. 2 కోట్ల విలువ చేసే నగలను వాళ్లు లాక్కున్నారని, పిల్లలు లేనివాడివి ఆస్తిపాస్తులు నీకెందుకంటూ బలవంతంగా డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయించుకున్నారని, ఇంటి దగ్గర ఉన్న కొన్ని వజ్రాలు కూడా తీసుకెళ్లారని ఆయన తెలిపారు. అయితే వాటి విలువ ఎంత ఉంటుందో మాత్రం తనకు తెలియదన్నారు. తన ఆస్తి మొత్తం స్వాహా చేయాలన్నది వాళ్ల ప్రయత్నమని.. వారిలో రవి మాత్రమే తనకు 40 ఏళ్లుగా పరిచయం ఉన్నారు తప్ప మిగిలిన వాళ్లెవరూ తనకు తెలియదని చెప్పారు. ఇప్పుడు చూస్తే హవాలా అంటున్నారని, అదేమీ తనకు తెలియదని బ్రహ్మాజీ చెప్పారు. గతంలో తాను, తన భార్య కలిసి రెండు రోజుల పాటు సింగపూర్ వెళ్లి వచ్చామని, అంతేతప్ప తనకు విదేశాలతో సంబంధాలు కూడా లేవని అన్నారు. తాను బతికి బట్టకట్టినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకొంటున్నానని చెప్పారు. తన వద్ద దోచుకున్న సొత్తు ఇచ్చేస్తాం, కేసు వద్దని వెంకటేశ్వరరావు మనుషులు అన్నారు గానీ, ఆ సొత్తు ఇప్పుడు పోలీసుల దగ్గర ఉందని ఆయన తెలిపారు. కిడ్నాప్లో రవి పాత్రే ఎక్కువని చెప్పిన ఆయన.. తాను మాత్రం జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదని అన్నారు. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సమక్షంలోనే.. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ను సన్నీ అనే వ్యక్తి పిలిచాడని, అతడి సమక్షంలోనే తనను కొట్టారని బ్రహ్మాజీ ఆరోపించారు. ఆ రిపోర్టర్ బక్కగా, బారుగా ఉన్నాడని చెప్పారు. అతడికి, వైద్యులకు కూడా సంబంధం ఉండే ఉంటుందని అన్నారు. తనను బంధించి చిత్రహింసలు పెడుతుంటే విలేకరి అక్కడకు వచ్చాడని, తనను కొడుతుంటే పక్కనే కూర్చుని వాళ్లిచ్చిన బీర్లు తాగుతున్నాడని తెలిపారు. వాళ్లు చెప్పమన్ విషయాలు తాను చెబుతుండగా షూట్ చేశాడని అన్నారు. వాళ్లు చెప్పడంతోనే అతను ఆంధ్రజ్యోతి రిపోర్టరని తెలిసిందన్నారు. వాళ్ల ముఠా కాకపోతే తనను కొడుతున్నా రిపోర్టర్ అన్నవాడు చూస్తూ ఊరుకుంటాడా, వాళ్లిచ్చిన బీర్లు తాగుతాడా అని ఆయన ప్రశ్నించారు. తాను ఎవరికీ వడ్డీకి డబ్బులు అప్పు ఇవ్వలేదని చెప్పారు. తనను వడ్డీ వ్యాపారి అంటున్నారని, తన వద్ద అప్పు తీసుకున్నట్లు ఒక్కరితో అయినా చెప్పించాలని అడిగారు. కావాలంటే తన సెల్ఫోన్ ట్రాక్ చేసుకోవచ్చని కూడా బ్రహ్మాజీ అన్నారు. -
బెజవాడ హవాలా.. ఎందుకు.. ఎలా?
విజయవాడ కేంద్రంగా సాగుతున్న హవాలా కేసు పలు రకాల మలుపులు తిరుగుతోంది. ఇన్నాళ్లూ చాపకింద నీరులా ఎవరికీ తెలియకుండా సాగిపోయిన హవాలా వ్యవహారం ఇప్పుడు ఉన్నట్టుండి బయటకు రావడంతో పలువురు పెద్దమనుషులు ఉలిక్కిపడ్డారు. ఎక్కడ తమ బాగోతాలు కూడా బయటపడతాయోనని, తమ జుట్టు ఆదాయపన్ను శాఖ చేతుల్లోకి వెళ్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు 15-20 ఏళ్ల క్రితం నుంచే ఆంధ్ర ప్రాంతానికి విజయవాడ ఆరోగ్య రాజధానిగా ఉంది. అక్కడ పెద్ద పెద్ద ఆస్పత్రులు వెలిశాయి. మొదట్లో కేవలం ఒకటి లేదా రెండు స్పెషాలిటీలతోనే ప్రారంభమైన చాలా ఆస్పత్రులు తర్వాతి కాలంలో మల్టీ స్పెషాలిటీలుగా మారాయి. ఈ విస్తరణకు సహజంగానే పెద్దమొత్తంలో డబ్బులు అవసరం అవుతాయి. కావల్సిన మొత్తం సొమ్మును సక్రమ మార్గంలో సమకూర్చుకోవడం కష్టమన్న ఉద్దేశంతో కొంతమంది వైద్యులు హవాలా మార్గాన్ని కూడా ఆశ్రయించారు. కేవలం వైద్యరంగమే కాదు.. అన్ని రంగాలకు చెందినవారు ఈ మార్గంలో వెళ్తున్నారనడంలో అనుమానం లేదు. అందుకే చిరు వ్యాపారులు సైతం ఈ హవాలా వ్యాపారంలోకి దిగారు. తమకు కావల్సిన డబ్బును ఇక్కడకు తెప్పించుకోడానికో, లేదా ఇక్కడినుంచి కొంత డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు తరలించడానికో వైద్యులు బ్రహ్మాజీని పురమాయించి ఉండాలి. ఎంత డబ్బు చేతులు మారింది, అందులో కమీషన్ ఎంత అనే విషయాలేవీ మాత్రం ఇంతవరకు బయటకు రావడం లేదు. 50 కోట్ల రూపాయలు తెప్పించడానికి కోటి రూపాయలను బ్రహ్మాజీరావు కమీషన్గా తీసుకున్నట్లు నిందితుల తరఫు వాళ్లు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయాలంటే ఆదాయపన్ను శాఖ అధికారుల కన్ను పడుతుందనే హవాలా మార్గాన్ని ఎంచుకుని ఉండాలి. అయితే, అసలు హవాలా అంటే ఏంటో తనకు తెలియదని బ్రహ్మాజీరావు చెబుతున్నారు. హవాలా.. ఎలా? సాధారణంగా హవాలా పద్ధతిలో పనులన్నీ కేవలం నమ్మకం ఆధారంగా జరిగిపోతుంటాయి. ఒకచోట ఉన్నవాళ్లు డబ్బులు ఇచ్చి, ఫలానా ప్రాంతంలో ఉన్న తమవాళ్లకు ఆ డబ్బును ఇవ్వాలని చెబుతారు. అందుకోసం కొన్ని కరెన్సీ నోట్లను ఉపయోగించుకుంటారు. ఆ నోట్లు కూడా చేతులు మారుతున్న మొత్తాన్ని బట్టి మారుతాయి. 5 కోట్ల వరకు అయితే 5 రూపాయల నోటు.. ఇలా రకరకాల నోట్లను ఉపయోగిస్తారు. ఆ నోటు మీద ఉన్న నంబరు నోట్ చేసుకోవడం, దాన్ని కొరియర్ ద్వారా అవతలి వ్యక్తికి చేరవేయడం.. వాళ్లు తమకు వివరాలు అందిన మేరకు ఎక్కడ డబ్బులు ఇస్తారో అక్కడకు వెళ్లి ఆ నోటు చూపించి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఇందుకోసం మొట్టమొదట డబ్బు ఇచ్చినవాళ్లే కొంత కమీషన్ కూడా ముట్టజెప్పాల్సి ఉంటుంది. పెద్దనోట్లను రద్దుచేసిన సమయంలో అప్పటికే పెద్దమొత్తాల్లో డబ్బు తీసుకుని తమ వద్ద ఉంచిన హవాలా వ్యాపారులు చాలా దెబ్బతిన్నారని వినికిడి. ఇక్కడ ఏమైంది... బ్రహ్మాజీరావు తమ హవాలా వ్యవహారాన్ని పూర్తిచేయలేకపోవడంతో వైద్యులు అతడికి బాగా తెలిసిన తాతాజీ అనే వ్యక్తితో ఫోన్ చేయించి పిలిపించారు. టైమ్ ఆస్పత్రి పేరు మీద రిజిస్టర్ అయిన ఏపీ 16బీఎం 2324 నంబరు గల ఇన్నోవా వాహనంలో అతడిని విజయవాడ శివార్లలో ఉన్న మామిడితోటకు తీసుకెళ్లి.. అక్కడ చితక్కొట్టారు. వాళ్ల వద్ద కమీషన్గా ఇచ్చిన మొత్తానికి బదులుగా బ్రహ్మాజీ వాళ్లకు బంగారు ఆభరణాలు, వజ్రాలు ఇచ్చి, ఖాళీ డాక్యుమెంట్లపై సంతకాలు కూడా చేశాడు. దాంతో వాళ్లు అతడిని వదిలేశారు. ఆ తర్వాత అతడి కుటుంబ సభ్యులు పటమట స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ప్రముఖ వైద్యుల పేర్లు ఉండటంతో సీఐ కెనడీ, ట్రాఫిక్ ఏసీపీ సూర్యచంద్రరావు కేసును నీరుగార్చారని ఆరోపణలు వచ్చాయి. చివరకు విషయం మొత్తం సీపీ గౌతమ్ సవాంగ్ వరకు వెళ్లడంతో ఆయన వాళ్లిద్దరి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ కేసులో ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని అంటున్నారు. అధికార పార్టీ పెద్దల రాజకీయ జోక్యం పనిచేస్తే ఇక ముందు కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ఈలోపు అసలు ఈ కేసు గురించిన వివరాలు తమకు అందించాల్సిందిగా ఆదాయపన్ను శాఖ అధికారులు కూడా పోలీసులను కోరినట్లు తెలుస్తోంది.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
కౌంటింగ్కు సర్వం సిద్ధం
373 మంది గైర్హాజరు
●భారీగా తగ్గిన దిగుబడులు
డిమాండ్ ఉండే సమయానికి కాయలు రాలేదు
జిల్లా వ్యాప్తంగా నాయకులకు బహిష్కరణ నోటీసులు
ఖరీఫ్ కార్యాచరణ అమలుకు సమాయత్తం కావాలి
ఏసీఏ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నియామకం
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
ఎల్ అండ్ టి ఫైనాన్స్ లిమిటెడ్ హైదరాబాద్లో పూర్తి గృహ రుణాన్ని ప్రారంభించింది
రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్లు
తప్పక చదవండి
- విజయ్ సరసన హీరోయిన్గా ఛాన్స్.. చేయనని ఏడ్చేసిన బాలీవుడ్ బ్యూటీ
- అల్లుడు హైడ్రామా..!
- విజయవాడ హైవేపై హృదయ విదారక ఘటన
- ‘బోట్ నెట్’పై ఎఫ్బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు!
- ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
- ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
- వెండే బంగారమాయెగా..
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్కు 55–65 సీట్లు
- ‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
Advertisement