ఉరిశిక్ష అమలు ఎలా? | Sakshi
Sakshi News home page

ఉరిశిక్ష అమలు ఎలా?

Published Wed, Jul 29 2015 5:08 PM

ఉరిశిక్ష అమలు ఎలా?

ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకూబ్ మెమన్కు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దాంతో.. అసలు ఉరిశిక్షను ఎలా అమలుచేస్తారన్న విషయం సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది..

  • ఉరి తీసేందుకు ఒక అంగుళం (రెండున్నర సెంటీమీటర్ల) వ్యాసం, 19 అడుగుల పొడవు ఉండే తాడును సిద్ధం చేస్తారు
  • ఖైదీ బరువుకు ఒకటిన్నర రెట్ల బరువుండే బస్తాలతో వారం రోజుల ముందే రెండు తాళ్లను పరీక్షించి వాటిని లాక్ చేస్తారు
  • రేపు ఉరిశిక్ష అమలు చేస్తారనగా.. ఈరోజు సాయంత్రం మరోసారి సూపరింటెండెంట్ సమక్షంలో వాటిని పరీక్షిస్తారు
  • ఉరిశిక్ష అమలుచేసే సమయంలో జైలు సూపరింటెండెంట్, జైలు వైద్యాధికారి, జిల్లా మేజిస్ట్రేట్, ఇద్దరు ప్రభుత్వ సాక్షులు తప్పనిసరిగా ఉండాలి.
  • ఉరి తీసే సమయాలు కూడా నెలల వారీగా మారతాయి
  • మే నుంచి ఆగస్టు వరకు అయితే ఉదయం 6 గంటలకు ఉరి తీస్తారు
  • నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే ఉదయం 8 గంటలకు ఉరి తీస్తారు
  • మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మాత్రం ఉదయం 7 గంటలకు ఉరితీస్తారు
  • ఖైదీకి అర్థమయ్యే భాషలో అతడిని ఉరి తీస్తున్నట్లు చెబుతారు
  • యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలుచేసేందుకు రూ. 22 లక్షలు కేటాయించారు
  • మెమన్ ఉరితీతకు తగినంత ఫిట్గానే ఉన్నాడని నాగపూర్ జైలర్ తెలిపారు
  • ఇప్పటివరకు భారతదేశంలో 169 మందిని ఉరి తీశారు.. యాకూబ్ మెమన్ 170వ వ్యక్తి అవుతాడు
  • ఉరి తీసే ప్రదేశానికి అత్యంత సమీపంలోనే యాకూబ్ మెమన్ ఇప్పుడు ఉన్నాడు
  • రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇప్పటికి 12 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు
  • ఉరిశిక్ష విధించే ఖైదీని సాధారణంగా ఆరోజు అర్ధరాత్రి 2.30 గంటలకు నిద్ర లేపుతారు.
  • అప్పుడే స్నానం చేయాలని అడుగుతారు.
  • ఆ తర్వాత జైలు సూపరింటెండెంట్, మేజిస్ట్రేట్ డెత్ వారెంట్ చదువుతారు.
  • అనంతరం ఖైదీకి ఇష్టమైన టిఫిన్ పెడతారు.
  • తర్వాత అతడి చివరి కోరిక ఏంటో అడుగుతారు.
  • ఆ వెంటనే అతడ్ని ఉరికంబం వద్దకు తీసుకెళ్తారు.

Advertisement
Advertisement