ఖాళీ బిందెలతో రాస్తారోకో
తాండూరు రోడ్డుపై స్తంభించిన రాకపోకలు
జహీరాబాద్ : చిన్నహైదరాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో గల రాంనగర్ కాలనీ, జహీరాబాద్ మున్సిపల్ పరిధి కింద ఉన్న 12వ వార్డులో గల డ్రైవర్స్ కాలనీ ప్రజలు మంచినీటి సమస్య తీర్చాలని ఆందోళనకు దిగారు. ఆదివారం జహీరాబాద్ నుంచి తాండూరు వెళ్లే రోడ్డుపై గంట పాటు మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించారు. దీంతో వాహనాల రాక పోకలకు ఆటంకం కలి గింది. తమ కాలనీల్లో తీవ్ర మంచినీటి సమస్య నెలకొన్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తీర్చాలని పలు మార్లు ప్రజా ప్రతినిధులను కోరినా ఫలితం లేదని తెలిపారు. విధి లేని పరిస్థితుల్లో ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. నీటి సమస్యను తీర్చేందుకు గాను కొత్తగా బోరును తవ్వించాలని డిమాండ్ చేశారు. అంత వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలన్నారు. లేనట్లయితే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని ఆయా కాలనీలకు చెందిన ముఖ్యులు సూచించడమేకాకుండా.. వారు ఫోన్లో అధికారులను సంప్రదించారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు.
నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
Published Mon, Feb 15 2016 1:04 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement