- నేటి నుంచి నెలరోజులపాటు ఉత్సవాలు
- దేవతల శుద్ధీకరణ
- తరలిరానున్న వేలాది మహిళలు
- సౌకర్యాలపై దృష్టిసారించని అధికారులు
- రూ.10 లక్షలు మంజూరు చేసినా ఇంకా అందని వైనం
కెరమెరి : లక్షలాది మంది ఆదివాసీలు పూజించే జంగుబాయి దేవతా ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతీ ఏడాది రెండుసార్లు కొనసాగే ఉత్సవాలు ప్రతీ సంవత్సరం పుష్యం మాసం నుంచి ప్రారంభమై నెలరోజులుపాటు కొనసాగుతాయి. మే 19, తర్వాత డిసెంబర్ 25న కొనసాగుతాయి. మండలంలోని పరంధోళి గ్రామ పంచాయతీకి చెందిన ముకద్దంగూడ గ్రామ అడవుల్లో జంగుబాయి దేవత కొలువై ఉంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దైవక్షేత్రానికి ఇటీవల ప్రాధాన్యత వచ్చింది. నియమ నిష్టతో ఆదివాసీలు పూజలు చేస్తారు. నేడు రాత్రి 8ః00 గంటలకు భక్తి శ్రద్ధలతో దీపోత్సవం జరగనుంది.
దేవతా విగ్రహాలకు శుద్ధి
ఇటీవల చంద్ర గ్రహణం ఉండడంతో నేటి నుంచి ఎనిమిది గోత్రాలకు చెందిన ఆదివాసీలు జంగుబాయి ఆలయ సన్నిధిలో కొలువుదీరిన దేవతా విగ్రహాలను టొప్లకసలో శుద్ధి చేస్తారు. ఎవరికి వారు మేళాలతో వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. జంగుబాయి, పోచమ్మ, రావుడ్తో పాటు మరో ఏడు దేవతా విగ్రహాలను శుద్ధి చేస్తారు.
విత్తనాలు చూపించడమే ప్రత్యేకత
మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని విత్తనాలను జంగుబాయికి చూపిస్తారు. పంటపొలాల్లో ఏఏ రకాల విత్తనాలు వేస్తున్నామో వాటిన్నిటిని దేవతకు చూపిస్తే పంటల్లో దిగుబడి బాగా వస్తుందని వారి నమ్మకం.
నిధులు మంజూరైన నిర్లక్ష్యమే
రెండునెలలక్రితం జంగుబాయి ఆలయ అభివృద్ధికోసం ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసినా అవి నేటికి ఆల య కమిటీ సభ్యులకు ఐటీడీఏ అధికారులు సమాచారం ఇవ్వలేదు. గతంలోనే ఐటీడీఏ పీవో ఖాతాలో జమ చేసినట్లు తెలిసిందని ఆలయ కమిటీ చైర్మన్ మరప బాజీరావు చెబుతున్నారు. ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి కాక్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
రోడ్డు, తాగునీటికి కష్టం
జంగుబాయి ఆలయానికి వెళ్లేందుకు సరైనసౌకర్యం లేకపోవడంతో ఆదివాసీ భక్తులు ఇబ్బంది పడక తప్పదు. రాళ్లు రప్పలతో కూడుకున్న దారి ఉండడంతో ఎడ్లబండ్లు రావడం కష్టంకానుంది. తాగునీటి కోసం ఎలాంటి సౌకర్యం లేదు. సమీపంలోని టొప్లకసలో ఉన్న నీటిని ఎడ్ల బండ్లపై తీసుకరాక తప్పదు. తాగునీటికి, స్నానాలకు అవేనీటిని వాడడంతో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
గుహలో బస చేసిన జంగుబాయి
ఆదివాసీల ఆరాధ్యదైవం జంగుబాయి దేవతా గుహలో కొలువైంది. పోచమ్మ ఆలయం వెనుక భాగంలోంచి కప్లైకి పై భాగంలో జంగుబాయి దేవి ఉంది. అది పూర్తిగా గుహకావడంతో భక్తులు కూర్చునే నడుస్తారు. చిమ్మని చీకటిలో దీపం వెలుగులో ఆ దేవత కనిపిస్తుంది. మనుసుల్లో ఉన్న కోర్కెలు తీర్చే తల్లిగా ఆదివాసీలు భావిస్తారు.
ఆరు గోత్రాలకు చెందిన కుటుంబాలు ఒకే వేదికపై
వివిధ రాష్ట్రాల్లో ఉన్న జంగుబాయి వారసులైన వెట్టి, తుంరం, కొడప, రాయిసిడాం, సలాం, మరప, హైం రం, మండాడి గోత్రాలకు చెందిన వేలాది కుటుంబాలు మొక్కులు చెల్లించుకుంటారు. వారెవరూ కూడా వాహనాలను ఉపయోగించకుండా కేవలం కాలిబాట, ఎడ్ల బండ్లపై వందలాది కిలో మీటర్లు రవాణా సాగిస్తారు. ఎనిమిది గోత్రాలకు చెందిన కటోడాలు పూజారులుగా వ్యవహరిస్తారు. వారి ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతాయి. వనక్షేత్రంలో బస చేసిన పోచమ్మతల్లికి కూడా మొక్కులు తీర్చుకుంటారు
జంగుబాయి సన్నిధిలో నేడు దీపోత్సవం
Published Sun, Apr 19 2015 2:35 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
పుష్ప-2 మరో అప్డేట్ వచ్చేసింది.. అదేంటంటే?
రామేశ్వరం కేఫ్ పేలుడు.. పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు
ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)
అప్పుడు 'నీ తండ్రి స్థాయి తెలుసా అన్నారు': దీపిందర్ గోయల్
HYD: ఏసీపీ నివాసంలో సోదాలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్కు ఫ్యూజ్లు ఔట్
భారీగా పెరిగిన ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement