వాహనం కింద పడి బాలుడి మృతి | Sakshi
Sakshi News home page

వాహనం కింద పడి బాలుడి మృతి

Published Sat, Feb 13 2016 7:42 PM

వాహనం కింద పడి బాలుడి మృతి - Sakshi

కుల్కచర్ల: రంగారెడ్డి జిల్లాలో శనివారం ఓ బాలుడు మృతిచెందాడు. కుల్కచర్ల మండలం ఘన్‌పూర్ గ్రామంలో తుఫాను వాహనం కింద పడి శివానంద్(2) ప్రాణాలు కోల్పోయాడు.  

ఇంటి ఆవరణలో ఉన్న తుఫాను వాహనం ముందు చిన్నారి ఆడుకుంటున్నాడు. ఇది గమనించని అతడి పెద్దనాన్న రాములు తుఫాను వాహనాన్ని ముందుకు నడిపాడు. దీంతో శివానంద్ వాహనం టైర్ కిందపడి మరణించాడు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement