భారీ ఆధిక్యంలో శ్రీలంక | Sakshi
Sakshi News home page

భారీ ఆధిక్యంలో శ్రీలంక

Published Mon, Jul 6 2015 12:10 AM

Heavy Leading Sri Lanka

పల్లెకెలె: పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక పట్టు బిగించింది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 69.4 ఓవర్లలో ఐదు వికెట్లకు 228 పరుగులు చేసిన లంక ప్రస్తుతానికి 291 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న జట్టును కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (77 బ్యాటింగ్; 6 ఫోర్లు; 1 సిక్స్) అద్భుత ఆటతీరుతో ఆదుకున్నాడు.

తరంగ (48;6 ఫోర్లు) వేగంగా ఆడి స్కోరును పెంచాడు. క్రీజులో మాథ్యూస్‌తో పాటు చండిమాల్ (39 బ్యాటింగ్; 5 ఫోర్లు) ఉన్నాడు. రాహత్ అలీ, యాసిర్ షాలకు రెండేసి వికెట్లు పడ్డాయి. అంతకుముందు పాకిస్తాన్ తమ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 5 పరుగులు జోడించి 66 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆటకు మరో రెండు రోజుల సమయం ఉండడంతో ఫలితం వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement