16వ తేదీన తుది జాబితా: కుంతియా | Sakshi
Sakshi News home page

16వ తేదీన తుది జాబితా: కుంతియా

Published Thu, Nov 15 2018 4:46 AM

congress party Final list on 16th says kuntiya - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభకు పోటీచేసే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 16న ప్రకటిస్తామని రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ ఆర్సీ కుంతియా వెల్లడించారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే విడుదల చేసిన రెండు జాబితాల ద్వారా కాంగ్రెస్‌ పోటీ చేసే 94 స్థానాల్లో 75 స్థానాలకు  అభ్యర్థులను ప్రకటించామని, ఇప్పటివరకూ ప్రకటించిన జాబితాల ద్వారా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశామని పేర్కొన్నారు. బీసీలకు కాంగ్రెస్‌ అన్యాయం చేసిందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసే స్థానాల్లో బీసీలకు ఇప్పటికే 15 స్థానాలు ఇచ్చామని, తుది జాబితాలో ఇంకా 6 నుంచి 7 మంది బీసీలకు స్థానం కల్పిస్తామని కుంతియా తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement