Breaking News

భూ సమస్య పరిష్కరించడం లేదని మహిళ ఆత్మహత్యాయత్నం

Published on Tue, 11/01/2022 - 01:40

నర్సింహులపేట: భూ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని, పరిష్కరించడం లేదని ఓ మహిళ ఆత్మ హత్యాయత్నం చేసింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేటలో జరిగింది. బాధితురాలు సుంకరి సరిత తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన సుంకరి వెంకనర్సు, కిష్టమ్మలకు కుమారులు సుంకరి లక్ష్మయ్య, నారాయణ, భద్రయ్య, సోమయ్య, సాంబయ్య.

వీరికి గ్రామ శివారులోని సర్వే నెంబర్‌ 1127, 1128, 1129లో 2.10 ఎకరాల భూమి ఉంది. వాటాల ప్రకారం సుంకరి భద్రయ్య, వెంకటమ్మలకు రావాల్సిన 20 గుంటల భూమిని సుంకరి సుధాకర్, సుంకరి సాంబయ్యలు 10 గుంటల చొప్పున తెలియకుండా రికార్డుల్లో ఎక్కించుకున్నారు. తన తల్లిదండ్రుల భూమిని తన పేరుమీదకు మార్చుకోవాలని సరిత ఏడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతోంది. పట్టించుకోకపోవడంతో విసుగుచెందిన ఆమె.. సోమవారం కార్యాల యానికి వచ్చి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంది. అక్కడే ఉన్న సిబ్బంది అమెను అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఎస్సై మంగీలాల్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, తహసీల్దార్‌ వివేక్‌తో కలిసి భూ సమస్యపై సరితతో మాట్లాడారు. తన తల్లిదండ్రులకు ఒక్కతే కుమార్తెనని, వారు చనిపోవడంతో, ఆ భూమిని తమ పేర ఎక్కించాలని మొరపెట్టుకుంటున్నా వినడం లేదని సరిత తెలిపింది. ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరగా, ఈ సమస్య కోర్టు పరిధిలో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)