Breaking News

మార్చిలో దుబాయ్‌ చూపించాలనుకున్నా!

Published on Wed, 02/04/2026 - 04:52

భువనగిరి(బీబీనగర్‌)/సికింద్రాబాద్‌: ‘మా పిల్లలకు తల్లిమాట వేదవాక్కు. ఆమె ఏది చెప్పినా తప్పకుండా వింటారు. వారిని అంతే ప్రేమగా చూసు కుంటుంది నా భార్య. అందుకే పిల్ల లంటే తల్లికి, తల్లి అంటే పిల్లలకు మహాప్రాణం. ఇటువంటి మా ప్రేమా నురాగాల కుటుంబంలో ఇంతటి ఘోరం ఎలా జరిగింది? దాని వెనుక ఉన్న కారణాలు ఏంటన్నది దేవుడికే తెలియాలి. నా భార్యాపిల్లలను దుబాయ్‌ చూపించేందుకు మార్చి నెలలో తీసుకెళ్లాలని అనుకున్నా..ఇంతలోనే ఘోరం జరిగింది.’అంటూ కన్నీటి పర్యంతమయ్యారు పిన్నింటి సురేందర్‌ రెడ్డి. 

జనవరి 31న మేడ్చల్‌ జిల్లా చర్లపల్లి–ఘట్‌కేసర్‌ మధ్య రైలు మార్గంలో తల్లి విజయశాంతి రెడ్డి, కుమార్తె చేతన, కుమారుడు విశాల్‌ రెడ్డిలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో మృతురాలి భర్త సురేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన పిల్లలు ఇంటర్‌ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నట్లు చెప్పారు. పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే 14 నెలల క్రితం దుబాయ్‌కు వెళ్లినట్లు తెలిపారు. 

జనవరి 27న తన కుమార్తె జేఈఈ మెయిన్‌ పరీక్ష రాసేందుకు వెళ్లినప్పుడు తనతో మాట్లాడిందని, పరీక్ష బాగా రాశానని కచ్చితంగా సీటు వస్తుందని చెప్పిందన్నారు. ఇంతలోనే జనవరి 31వ తేదిన ఉదయం 8.30 గంటల సమయంలో తన బావమరిది ఫోన్‌ చేసి త్వరగా ఇంటికి రావాలని చెప్పడంతో ఎందుకని ప్రశ్నించగా విజయశాంతి మరణించిందని చెప్పాడన్నారు. 

అనంతరం కొద్దిసేపటికి పిల్లలతో కలిసి చనిపోయిందని చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే మధ్యాహ్నం ఫ్లైట్‌ ద్వారా రాత్రి వరకు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు చెప్పారు. తనకు ఎవరి మీద అనుమానం లేదని, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు సైతం లేవని, తన కుటుంబ సభ్యులు బంగారం లాంటి వారని ఆయన చెప్పారు.

కారు అప్పగింత.... 
బలవన్మరణానికి ముందు పిల్లలను తీసుకుని చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకోవడానికి విజయశాంతిరెడ్డి వినియోగించిన కారును పోలీసులు మంగళవారం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటన జరిగిన మరుసటి రోజు కారును చర్లపల్లి నుంచి పోలీసులు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చారు. విజయశాంతి రెడ్డి తమ్ముడు చిరంజీవి రెడ్డి ఆయన తల్లి ఇరువురు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చి కారును తీసుకుని వెళ్లిపోయారు.

ఎఫ్‌ఎస్‌ఎల్‌కు సెల్‌ఫోన్‌...
విజయశాంతిరెడ్డి సెల్‌ఫోన్‌ను మంగళవారం సైబర్‌ పోలీసులు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపించారు. సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు ఆమె సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను సైబర్‌ పోలీసులకు పంపించగా అది ఓపెన్‌ కాలేదని తెలిసింది. వివరాలు బయటికి తీయడం కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపినట్టు సమాచారం. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)