Breaking News

వదంతులను నమ్మొద్దు: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌

Published on Tue, 03/14/2023 - 19:52

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌, అవకతవకలు జరిగే అవకాశమే లేదని.. వదంతులను ఆపేందుకే తాము మీడియా ముందుకు వచ్చినట్లు టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ జనార్థన్‌రెడ్డి తెలిపారు. ఏఈ పరీక్షా ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం.. ఈ నేపథ్యంలో మిగతా పేపర్లూ లీక్‌ అయ్యాయంటూ సభ్యుల ఆందోళన.. తదనంతర పరిణామాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం కమిషన్‌ కీలక భేటీ నిర్వహించింది.

సుమారు 4 గంటలకు పైగా ఈ భేటీ జరగ్గా.. కమిషన్‌ సభ్యులు విడిగానే కాకుండా సీఎస్‌ శాంతకుమారితోనూ భేటీ అయ్యారు గమనార్హం. అనంతరం పేపర్‌ లీకేజీ వ్యవహారంపై చైర్మన్‌ మీడియాతో మాట్లాడారు. 

‘‘టీఎస్‌పీఎస్‌సీ పరిధిలోని 30 లక్షల మంది వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ కింద దరఖాస్తు చేసుకున్నారు. 26 రకాల ఉద్యోగులకు నోటిఫికేషన్‌ జారీ చేశాం. గ్రూప్‌-1 పరీక్షలకు మల్టీపుల్‌ జంబ్లింగ్‌ చేశాం’’ అని ఆయన వివరించారు. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరిగే అవకాశం లేదన్న చైర్మన్‌.. దురదృష్టకర పరిస్థితుల్లో ప్రెస్‌ మీట్‌ పెట్టాల్సి వచ్చిందని, పేపర్‌లు లీక్‌ అయ్యాయంటూ, ఎగ్జామ్‌లు రద్దు అవుతాయంటూ వస్తున్న వదంతులకు పుల్‌స్టాప్‌ పెట్టాలని తాము ఇదంతా చెప్తున్నామని ఆయన అన్నారు. 

లీకేజీ సమాచారం అందగానే తాము పోలీసులను ఫిర్యాదు చేశామని, ఆ తర్వాతి పరిణామాలు అందరికీ తెలిసినవే అని చెప్పారాయన. రాజశేఖర్‌రెడ్డి అనే నెట్‌వర్క్‌ ఎక్స్‌పర్ట్‌ ఆరేడు ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. నెట్‌వర్క్‌ ఎక్స్‌పర్ట్‌ కావడంతో ఐపీ అడ్రస్‌లు తెలిసే అవకాశం ఉంటుంది. రాజశేఖర్‌రెడ్డితో పాటు అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ హ్యాకింగ్‌కు పాల్పడ్డాడని, ఈ ఇద్దరితో పాటు మరికొందరి వల్ల ఈ లీక్‌ వ్యవహారమంతా నడిచిందని తెలిపారాయన.

పేపర్‌ లీక్‌ అయిన ఏఈ పరీక్షకు సంబంధించి అధికారిక నివేదిక(బుధవారం మధ్యాహ్నం కల్లా అందే అవకాశం ఉంది).. ఆపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్నాకే పరీక్ష వాయిదా వేయాలా? లేదా ఇతర నిర్ణయం తీసుకుని ప్రకటన చేద్దామని భావించామని తెలిపారాయన. అయితే.. ఈలోపు సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న అనుమానాలను నివృత్తి చేయడానికే మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారాయన. తన కూతురు కూడా గ్రూప్‌-1 రాసిందంటూ ప్రచారం జరుగుతోందన్న విషయాన్ని చైర్మన్‌ జనార్ధన్‌రెడ్డి తోసిపుచ్చారాయన. తన కుటుంబ సభ్యులెవరూ పరీక్ష రాయలేదని స్పష్టత ఇచ్చారు.

ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు గ్రూప్‌-1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో 103 మార్కులు వచ్చిన వ్యవహారంపై స్పందించిన చైర్మన్‌.. అది నిజమేనని, కానీ, ప్రవీణ్‌ సెలక్ట్‌ కాలేదని, ప్రవీణ్‌కు వచ్చిన మార్కులే హయ్యెస్ట్‌ అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని స్పష్టత ఇచ్చారు.

Videos

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)