Breaking News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బోణీ.. కవిత సహా ముగ్గురు ఏకగ్రీవం..!

Published on Thu, 11/25/2021 - 03:11

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలిలోని 12 స్థానిక సంస్థల కోటా స్థానాలకు జరుగుతున్న ఎన్నిక ల్లో.. మూడు చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. బుధవారం జరిగిన నామినేషన్ల స్క్రూటినీ అనంతరం నిజామాబాద్‌ జిల్లాలోని ఒక స్థానంలో కల్వకుంట్ల కవిత.. రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు ఇద్దరే బరిలో మిగిలారు. వీరి ఎన్నిక దాదాపు ఖరారైనా.. ఈ నెల 26న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసాక అధికారికంగా ప్రకటించనున్నారు.

తిరస్కరణలతో..: నిజామాబాద్‌ స్థానంలో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లు వేశారు. బుధవారం జరిగిన నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ)లో స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్‌ నామినేషన్‌ను అధికా రులు తిరస్కరించారు. దీనితో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత ఒక్కరే పోటీలో మిగిలారు. రంగారెడ్డి జిల్లా లోని రెండు స్థానాలకుగాను.. టీఆర్‌ఎస్‌ తరఫున పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజుతోపాటు స్వతంత్ర అభ్యర్థిగా చాలిక చంద్రశేఖర్‌ నామినేషన్లు వేశారు.

ఇందులో చంద్రశేఖర్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురికావడంతో.. ఉన్న రెండు స్థానాలకు ఇద్దరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే మిగిలారు. దీనితో ఈ ముగ్గురి ఏకగ్రీవం ఖాయమైంది. అయితే ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉప సంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉంది. నిబంధనల మేరకు ఈ గడువు ముగిశాకే రిటర్నింగ్‌ అధికారులు ఏకగ్రీవాలను ప్రకటించాల్సి ఉంటుంది.

మెదక్, ఖమ్మం బరిలో కాంగ్రెస్‌ అభ్యర్థులు
ఏకగ్రీవాలు ఖాయమైన మూడు స్థానాలుపోగా.. మిగతా తొమ్మిది స్థానాల్లో రెండు చోట్ల మాత్రమే కా>ంగ్రెస్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెదక్‌లో నిర్మల జగ్గారెడ్డి, ఖమ్మంలో రాయల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. మరో ఏడు చోట్ల టీఆర్‌ఎస్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉండటంతో.. స్వతంత్ర అభ్యర్థులను విత్‌డ్రా చేయించి ఈ ఏడు స్థానాలనూ ఏకగ్రీవం చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్టు సమాచారం.

  • కరీంనగర్‌లోని రెండు స్థానాలకుగాను ఇద్దరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు బరిలో ఉండగా.. టీఆర్‌ఎస్‌కే చెందిన సర్దార్‌ రవీందర్‌సింగ్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. దీనితోపాటు పోటీలో ఎక్కువ మంది ఉండటంతో.. టీఆర్‌ఎస్‌ పార్టీ తమ ఓటర్లను క్యాంపుకు తరలించింది.
  • ఇక పలు సాంకేతిక కారణాల వల్ల వరంగల్‌ స్థానంలో నామినేషన్ల పరిశీలనను గురువారానికి వాయిదా వేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. వరంగల్‌లో ఐదుగురు నామినేషన్లు వేయగా.. అందులో నలుగురి నామినేషన్లు సరైనవిగా ధ్రువీకరించారు. ఐదో నామినేషన్‌పై నిర్ణయాన్ని గురువారం వెల్లడించనున్నట్టు రిటర్నింగ్‌ అధికారి తెలిపారు.

‘రంగారెడ్డి’ ఎన్నిక రద్దు చేయండి
రంగారెడ్డి ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన తమను అధికార పార్టీ నేతలు అడ్డుకుని, నామినేషన్‌ పత్రాలను చించేశారంటూ.. పంచాయతీరాజ్‌ చాంబర్స్‌ ఫోరం అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, చింపుల శైలజారెడ్డి బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్, రిటర్నింగ్‌ అధికారి అమయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి ‘స్థానిక’ ఎన్నికను రద్దు చేయాలని.. తిరిగి నోటిఫికేషన్‌ ఇచ్చి, తమకు పోటీ అవకాశం కల్పించాలని కోరారు. ఈ అంశంపై హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు.

స్క్రూటినీ తర్వాత అభ్యర్థుల లెక్క ఇదీ..
స్థానం        టీఆర్‌ఎస్‌    కాంగ్రెస్‌    స్వతంత్ర        మొత్తం
ఆదిలాబాద్‌        1                –                23                  24
వరంగల్‌            1                –                03                   04
నల్లగొండ          1                 –                05                   06
మెదక్‌               1                1                 03                  05
నిజామాబాద్‌     1                –                  –                    01
ఖమ్మం             1                1                 02                   04
కరీంనగర్‌          2               –                 22                   24
మహబూబ్‌నగర్‌  2             –                  02                  04
రంగారెడ్డి           2               –                  –                    02  

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)