Breaking News

లోకానికే అవసరం

Published on Mon, 12/29/2025 - 05:05

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘భారత్‌ విశ్వగురువు కావడం మా లక్ష్యం కాదు.. లోకానికే ఆ అవసరం ఉంది’అని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. ప్రతి హిందువు సనాతన భారతీయ విలువలను అలవర్చుకోవాలని.. సమాజానికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో ఈ నెల 25న ప్రారంభమైన విశ్వసంఘ్‌ శిబిరం శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మోహన్‌ భాగవత్‌ ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

విశ్వనికేతన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఐదేళ్లకోసారి నిర్వహించే ఈ తరగతులకు ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, సేవా ఇంటర్నేషనల్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ, ఇంటర్నేషనల్‌ సంస్కృత భారతి సంస్థలకు చెందిన 1,610 మంది స్వయం సేవకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్‌ భాగవత్‌ మాట్లాడుతూ ‘లోకంలో కరుణ, దయ నశించడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాటి పరిష్కారం కోసం ప్రపంచంలోని పలు సంస్థలు స్వయం సేవలను ఆశ్రయిస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక యుగంలో సోషల్‌ మీడియా, కృత్రిమ మేధ సమాజానికి సవాల్‌ విసురుతున్నాయి.

అంది వచ్చిన సాంకేతికతను దైవబుద్ధితో కాకుండా రాక్షస బుద్ధితో వినియోగించి సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. మనుషులు తయారుచేసిన సాంకేతికతను మంచి కోసమే వినియోగించాలి. ఏఐకి మనం బానిసలు కావొద్దు. మనకే ఏఐ బానిస కావాలి. భారత్‌ తరతరాలుగా ప్రపంచానికి మార్గదర్శిగా ఉంది. ఆయుర్వేదం నుంచి ఫిలాసఫీ వరకు అన్నింట్లోనూ ప్రపంచానికి దిక్సూచిగా నిలిచింది. వ్యక్తి నిర్మాణంపైనే సంఘ నిర్మాణం, సంస్థ అభివృద్ధి ఆధారపడి ఉంది. సమాజానికి మనం ఏది ఇస్తే తిరిగి అదే మనకు ఇస్తుంది. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి’అని ఆయన సూచించారు. 

టీబీ రహిత భారత్‌ కోసం కృషి: డాక్టర్‌ కృష్ణ ఎల్ల 
‘సైన్స్‌ అంటేనే ప్రశ్నించడం. ఆలోచనలు విస్తృతంగా ఉంటేనే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి. మా పరిశోధన సంస్థకు భారత్‌ బయోటెక్‌ అనే పేరు పెట్టడం వల్ల రెండుసార్లు పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. అయినా ఆ పేరుతోనే ముందుకెళ్లా. ఆఫ్రికా కోసం వ్యాక్సిన్‌ తయారు చేసి ఇచ్చాం. కోవిడ్‌ నియంత్రణలో మోస్ట్‌ సేఫస్ట్‌ వ్యాక్సిన్‌ ఏదైనా ఉందంటే అది కోవ్యాక్సినే. ప్రస్తుతం టీబీ రహిత భారత్‌ కోసం పనిచేస్తునాం.

భారత్‌ అభివృద్ధి చెందాలంటే యువత పాత్ర కీలకం’అని భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల అన్నారు. కార్యక్రమంలో కన్హా శాంతివనం స్పిరిట్యువల్‌ గైడ్‌ కమలేశ్‌ డి. పటేల్, శిబిరాధికారి బన్వర్‌లాల్‌ పురోహిత్, విశ్వనికేతన్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ భాటియా తదితరులు పాల్గొన్నారు. ముగింపు సభ ప్రారంభానికి ముందు వందేమాతరం గీతాలాపన, నియుద్ధగణ శారీరక ప్రదర్శన, లోక కళ్యాణార్థం 9 భాషల్లో రూపొందించిన సర్వమంగళ మాంగళ్యే వీడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)