Breaking News

2030-35 నాటికి విస్తృతంగా పొలాల్లో రోబోలు

Published on Sat, 12/20/2025 - 05:02

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2030-35 నాటికి రైతుల పొలాల్లో రోబోలు, డ్రోన్లు, మానవరహిత ట్రా­క్టర్లు, సెన్సర్ల వినియోగం విస్తృతం కానుందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ­విద్యాలయ ఉప­కులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య అన్నారు. అందుకు అవసరమైన పరిశోధనలు వర్సిటీల్లో కొనసాగుతున్నాయని తెలి­పారు. మానవరహిత వ్యవసాయ సాధన దిశగా తమ వర్సిటీ కీలక ముందడుగు వేసిందన్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫౌండేషన్‌ ఆర్థిక సహకారంతో విశ్వవిద్యాల­యంలో ఏర్పాటు చేసిన తొలిదశ అగ్రి రొబోటిక్స్‌ ప్రయోగశాలను ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు­శెట్టితో కలిసి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్య శుక్రవారం ప్రా­రంభించా­రు. దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయా­ల్లో అత్యాధు­నిక అగ్రి రొబోటిక్స్‌ ల్యాబ్‌ ఏర్పాటవడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీని­వా­సులుశెట్టి మాట్లాడుతూ వర్సిటీ పూర్వ విద్యార్థిగా ఇలాంటి ఆధునిక ప్రయోగశాల ప్రారంభంలో భాగస్వామిగా ఉండ­టం సంతో­షంగా ఉందన్నారు. సుమారు ఏడాది క్రితం ప్ర­యోగశాల ప్రతిపాదనను వీసీ అల్దాస్‌ జానయ్య, నాటి డీన్‌ జెల్లా సత్య­నారాయణ తన దృష్టికి తీసుకొచ్చారని చె­ప్పా­రు. ఏడాది­లోనే ప్రయోగశాల ప్రతిపాదన కార్యరూపం దాల్చి తొలిదశ ల్యాబ్‌ ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లు, రోబోలు భవిష్యత్తు­లో వ్యవసాయ రంగం వైపు యువతను ఆకర్షించడంలో కీలకంగా మారతాయని శ్రీనివాసులుశెట్టి అభిప్రాయపడ్డారు. 

వికసిత్, రైజింగ్‌ లక్ష్యాల సాధనలో..
ఉపకులపతి అల్దాస్‌ జానయ్య మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్‌ భారత్, తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాల సాధనలో వ్యవ­సాయ, గ్రామీణ రంగాలు కీలకపాత్ర పోషించనున్నాయని తెలిపారు. భవిష్యత్తు వ్యవసాయం ఏఐ ఆధారిత పరిజ్ఞా­నం­పైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఆ దిశగా మానవ­రహి­త వ్యవసాయ సాధనలో భాగంగా అగ్రి రొబోటిక్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించామని చెప్పారు. కార్యక్రమంలో అగ్రిహబ్‌ ఎండీ డాక్టర్‌ జి. వెంక­టేశ్వర్లు, అగ్రి రొబోటిక్స్‌ ల్యాబ్‌ ప్రాజెక్టు హెడ్‌ డాక్టర్‌ జెల్లా సత్యనారాయణ, వర్సిటీ అధికారులు, ఎస్‌బీఐ సీనియర్‌ అధికారులు, ఫౌండేషన్‌ ప్రతినిధులు, విద్యార్థులు, శాస్త్ర­వేత్తలు పాల్గొన్నారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)