Breaking News

తప్పుల తడక సరి చేస్తున్నారంట

Published on Wed, 06/03/2026 - 03:32

సాక్షి, హైదరాబాద్‌: భూముల విలువలను సవరించే ప్రక్రియలో పెద్దఎత్తున తప్పులు దొర్లాయని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) గుర్తించింది. రెవెన్యూ సిబ్బంది అవగాహన లోపం, తహసీల్దార్ల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని 2,152 గ్రామాల్లో వ్యవసాయ భూముల విలువల నమోదులో తప్పులు జరిగినట్టు వెల్లడైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఆ తప్పులను సవరించే పనిలో పడింది. జిల్లా రిజిస్ట్రార్ల సహకారంతో ఈ తప్పులను సరిచేస్తున్నారు. గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా తప్పులను సవరించి జాగ్రత్తగా విలువలన్నింటినీ నమోదు చేస్తున్నారని, మంగళవారం రాత్రికల్లా వ్యవసాయ భూముల విలువలను అప్‌లోడ్‌ చేసే ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం.  

ఇంకా ఎన్నో...? 
ఎన్‌ఐసీ గుర్తించిన గ్రామాల మాటెలా ఉన్నా గుర్తించని తప్పుల పరిస్థితి ఏంటనే చర్చ ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. ఒకవేళ ఇంకా తప్పులు దొర్లి ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని, భూమి విలువ కంటే పదుల రెట్లు ఎక్కువగా.. లేదంటే తక్కువగా రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి వస్తుందని, తద్వారా ప్రభుత్వ ఖజానాపై కూడా భారం పడే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. అయితే, ఈ తప్పొప్పుల గుర్తింపు ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదని, రిజిస్ట్రేషన్ల సమయంలో మాత్రమే ఈ సమస్య తెలుస్తుందని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తప్పు జరిగిన విషయం వెల్లడైన దాన్ని బట్టి మాన్యువల్‌గా విలువను నిర్ధారించి ఫీజు కట్టించుకునేందుకు కూడా వీలుపడదని, ఇలాంటి తప్పులు సరిచేయకుండా సవరించిన విలువలు అమల్లోకి రావడం చాలా ప్రమాదమని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులే చెబుతుండటం గమనార్హం. 

అమల్లోకి ఎప్పుడు? 
వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం సవరించిన విలువలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే దానిపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అదనపు పనివేళలను ఈనెల 3 వరకే ప్రకటించారు కాబట్టి 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, శనివారం అమల్లోకి వస్తే తప్పొప్పులు సరిచేసుకునేందుకు, సర్వర్లు చెక్‌ చేసుకునేందుకు ఆదివారం సమయం దొరుకుతుంది కాబట్టి 6వ తేదీ నుంచి, లేదంటే 8వ తేదీ సోమవారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మొత్తంమీద ఈనెల 10 లోపు సవరించిన విలువలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది.    

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)