Breaking News

అభివృద్ధి పథంలో రాష్ట్రం

Published on Thu, 03/12/2026 - 03:52

సాక్షి, హైదరాబాద్‌:  2023–24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వ్యయాల పెరుగుదలతో ముందుకు సాగినట్లు ఆర్థిక ఆరోగ్య సూచిక (ఫిస్కల్‌ హెల్త్‌ ఇండెక్స్‌) నివేదిక వెల్లడించింది. సామాజిక సేవలు, ఆర్థిక సేవలకు కేటాయింపులు పెరగడం, ముఖ్యంగా మూలధన వ్యయాలు గణనీయంగా పెరగడం ద్వారా మౌలిక సదుపాయాల నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్రం దృష్టి కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. నీతి అయోగ్‌ విడుదల చేసిన ఈ నివేదికలో రాష్ట్ర ఆదాయాల్లో సొంత పన్ను ఆదాయాలే ప్రధాన భాగాన్ని కలిగి ఉండగా, పన్నేతర ఆదాయాలు కూడా వేగంగా పెరుగుతున్నట్లు తేలింది. 

అయితే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల వాటా క్రమంగా తగ్గుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఆర్థిక సూచికల పరంగా చూస్తే రాష్ట్రం స్వల్ప రెవెన్యూ మిగులు కొనసాగిస్తూ, దవ్య్ర లోటును చట్టపరమైన పరిమితులలోనే ఉంచినట్లు తెలిపింది. అయితే అభివృద్ధి అవసరాల కారణంగా అప్పులు క్రమంగా పెరిగాయని, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం సూచించిన పరిమితిని స్వల్పంగా అధిగమించినట్లు పేర్కొంది. 

అభివృద్ధి వ్యయాల్లో భారీ పెరుగుదల 
2019–20 నుంచి 2023–24 మధ్య రాష్ట్ర అభివృద్ధి రెవెన్యూ వ్యయాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సంక్షేమం, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి సామాజిక సేవలపై వ్యయం మొత్తం రెవెన్యూ వ్యయంలో సుమారు 38–39 శాతం స్థాయిలో కొనసాగుతోంది. ఇక ఆర్థిక సేవలపై వ్యయం ఈ కాలంలో వేగంగా పెరిగి 22 శాతం నుంచి 35 శాతానికి పెరిగింది. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, వృద్ధి లక్ష్యాలపై ప్రభుత్వ దృష్టిని ప్రతిబింబిస్తోంది. 

అభివృద్ధి మూలధన వ్యయం 2019–20లో రూ.16,860 కోట్లు ఉండగా 2023–24 నాటికి రూ.43,918 కోట్లకు పెరిగింది. అంటే 160 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. రాష్ట్ర మొత్తం రెవెన్యూ ఆదాయం 2019–20లో రూ.1,02,543 కోట్లు ఉండగా 2023–24 నాటికి రూ.1,69,293 కోట్లకు పెరిగింది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో సుమారు 11–12 శాతం స్థాయిలో కొనసాగుతోంది. రాష్ట్ర మొత్తం ఆదాయంలో సొంత పన్ను ఆదాయాలే సుమారు 80 శాతం వరకు ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల వాటా సుమారు 6 శాతం మాత్రమే ఉండగా ఇది క్రమంగా తగ్గుతున్నట్లు నివేదిక తెలిపింది.  

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మించి అప్పులు  
ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో 33.10 శాతం లోపు ఉండాలి. అయితే 2023–24లో రాష్ట్ర మొత్తం అప్పులు, ఇతర రుణ బాధ్యతలు రూ.5,17,659 కోట్లుగా తేలాయి. అంటే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మించి జీఎస్‌డీపీలో 34.47 శాతంగా నమోదయ్యాయి. గత ఐదేళ్లుగా రాష్ట్రం అప్పులు క్రమంగా పెరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్రం మార్కెట్‌ నుంచి రూ.49,618 కోట్ల రుణాలు సమీకరించినట్లు నివేదిక పేర్కొంది.   

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)