Breaking News

‘నిట్‌’కే విద్యార్థుల టిక్‌

Published on Fri, 07/18/2025 - 01:29

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) నిర్వహించిన కౌన్సెలింగ్‌ ఆరు రౌండ్లు పూర్తయింది. దీంతో ఐఐటీల్లో సీట్ల కేటాయింపు బుధవారంతో ముగిసింది. ఐఐటీల్లో 18,160 సీట్లుండగా.. వాటన్నింటినీ భర్తీ చేశారు. జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో (నిట్‌)లో సీట్ల భర్తీకి మరికొన్ని రౌండ్లు ఉన్నాయి. జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మొత్తం 62,853 సీట్లున్నాయి. వాటికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించి ర్యాంకుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీటిల్లో వచి్చన ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయించారు. మిగతా సీట్లను జేఈఈ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేశారు.  

పెరిగిన కటాఫ్‌ 
ఈసారి ఐఐటీల్లో కటాఫ్‌ ర్యాంకులు పెరిగాయి. కంప్యూటర్‌ కోర్సులకు జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 13 వేల లోపు ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఒక్క ముంబై ఐఐటీలో మాత్రం ఈ ఏడాదీ పోటీ కన్పించింది. సీఎస్‌ఈ బ్రాంచీకి ఐఐటీ హైదరాబాద్‌లో గత ఏడాది బాలురకు 656 ర్యాంకు వరకే సీటు వచ్చిం ది. తాజా కౌన్సెలింగ్‌లో 673 ర్యాంకు వరకూ సీటు వచ్చిం ది. ఇలా అన్ని ఐఐటీల్లోనూ ఇదే ట్రెండ్‌ కన్పించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కష్టంగా ఉందని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో జేఈఈ మెయిన్స్‌ వరకే చాలామంది పరిమితమవుతున్నారు.

ఐఐటీలు కాకుండా నిట్‌ లేదా ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు పొందేందుకు ఇష్టపడుతున్నారు. ఇది కూడా సాధ్యం కాకపోతే రాష్ట్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో టాప్‌ కేటగిరీలోని వాటికి ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ఈసారి రాష్ట్ర ఎప్‌సెట్‌లో 5 వేల ర్యాంక్‌ వచ్చిన వారూ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేశారు. నిట్‌లో కూడా సీఎస్‌ఈకి భారీ డిమాండ్‌ కన్పించింది. ఓపెన్‌ కేటగిరీలో గరిష్టంగా 6 వేల ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. కెమికల్‌ ఇంజనీరింగ్‌లో 30 వేల ర్యాంకుపైన కూడా సీట్లు వచ్చాయి.  

నేడు రాష్ట్ర కాలేజీల్లో సీట్ల కేటాయింపు 
తెలంగాణ ఎప్‌సెట్‌ తొలి దశ సీట్ల కేటాయింపు శుక్రవారం చేపడతారు. జోసా కౌన్సెలింగ్‌ పూర్తవ్వడంతో జాతీయ కాలేజీల్లో సీట్లు రానివారు రాష్ట్ర కాలేజీల్లో చేరే వీలుంది. రాష్ట్రంలో 76,795 ఇంజనీరింగ్‌ సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఇందులో 70 శాతం కంప్యూటర్, ఎమర్జింగ్‌ కోర్సుల్లోనే ఉన్నాయి. 94,354 మంది 59 లక్షలకు పైగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. దీంతో సీట్ల కేటాయింపు విద్యార్థులకు కీలకంగా మారబోతోంది. 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)