Breaking News

40 అంతస్తులంత జంబో రాకెట్‌

Published on Wed, 08/20/2025 - 06:03

ఉస్మానియా యూనివర్సిటీ/షాద్‌నగర్‌ రూరల్‌/ఖైరతాబాద్‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 40 అంతస్తుల భవనమంత పొడవైన రాకెట్‌ను నిర్మిస్తోందని, అది 75 టన్నుల పేలోడ్‌ను తక్కువ ఎత్తులోని భూకక్ష్యలోకి మోసుకెళ్లగలదని ఆ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ వీ నారాయణన్‌ తెలిపారు. మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం 84వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. 

ఈ ఏడాది ఇస్రో నావిక్‌ ఉపగ్రహం, ఎన్‌ 1 రాకెట్‌ వంటి ప్రయోగాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భారతీయ రాకెట్‌ ద్వారా 6,500 కిలోల బరువైన అమెరికన్‌ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ‘దివంగత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం తయారు చేసిన మొదటి లాంచర్‌ 17 టన్నుల బరువు ఉండేది. దాని ద్వారా 35 కిలోల పేలోడ్‌ను భూమి దిగువ కక్ష్యలోకి పంపారు. 

ఈ రోజు మనం 75 వేల కిలోల పేలోడ్‌ను పంపగల రాకెట్‌ను తయారు చేస్తున్నాం. ఈ సంవత్సరం ఇస్రో భారత నావికాదళం కోసం నిర్మించిన మిలిటరీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీఎస్‌ఏటీ –7ఆర్‌ను ప్రయోగించాలని ప్రయత్నిస్తున్నాం. ఇది ప్రస్తుత జీఎస్‌ఏటీ –7 (రుక్మిణి) ఉపగ్రహం స్థానంలో సేవలందిస్తుంది. ప్రస్తుతం అంతరిక్షంలో భారత్‌కు 55 ఉపగ్రహాలున్నాయి. రాబోయే మూడునాలుగు సంవత్సరాలలో ఆ సంఖ్య మూడు రెట్లు పెరుగుతుంది’అని వెల్లడించారు.  

ఉపగ్రహాల తయారీలో బలమైన శక్తిగా భారత్‌  
ఉపగ్రహాల తయారీలో ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితుల నుంచి ఇతర దేశాల కోసం క్షిపణులు తయారు చేసే స్థాయికి భారత్‌ ఎదిగిందని నారాయణన్‌ తెలిపారు. అబ్దుల్‌ కలామ్‌ కృషి, పట్టుదల వల్ల ఉపగ్రహాల తయారీలో ఎంతో పురోగతి సాధించామని అన్నారు. తొలిసారి 1980లో ఎస్‌ఎల్వీ–3 క్షిపణిని విజయవంతగా ప్రయోగించినట్లు వివరించారు. 

నాటి నుంచి చంద్రయాన్‌ –3 వరకు ఇస్రో ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలో చంద్రయాన్‌ –4 చేపట్టనున్నట్లు ప్రకటించారు. తన 41 సంవత్సరాల సర్వీసులో ఎన్నో ప్రయోగాలు చేసి టీం వర్క్‌తో అనేక విజయాలు సాధించిన్నట్లు తెలిపారు. పరిశ్రమల కోసం ప్రపంచంలోనే తొలిసారిగా ఇస్రో శాటిలైట్‌ను ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. 

అక్షరాస్యత, వైద్యం, విద్యుత్తు, ఆహార ఉత్పత్తులు, రైల్వేలు, విమానయాన సర్వీసులు, టెలిఫోన్, ఆర్థిక రంగంతోపాటు మౌలిక వసతులు, రవాణా తదితర రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించామని, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో 2035 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 

నైపుణ్యాలకు నెలవుగా ఓయూ: గవర్నర్‌ జిష్టుదేవ్‌ వర్మ  
ప్రపంచవ్యాప్తంగా ఓయూ పూర్వ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉండటం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర గవర్నర్‌ జిషు్టదేవ్‌ వర్మ అన్నారు. విజ్ఞానం, పరిశోధనలతోపాటు విభిన్న రంగాల్లో నైపుణ్యాలకు ఓయూ నెలవుగా ఉందని ప్రశంసించారు. భారతదేశ అంతరిక్ష కార్యక్రమానికి నారాయణన్‌ చేసిన కృషిని గవర్నర్‌ కొనియాడారు. స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్‌ నారాయణ్‌కు గౌరవ డాక్టరేట్‌ను గవర్నర్‌ ప్రదానం చేశారు. 

అనంతరం 121 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 1,261 మందికి పీహెచ్‌డీ డాక్టరేట్‌ డిగ్రీలను అందచేశారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు పీహెచ్‌డీ డాక్టరేట్‌ డిగ్రీలు అందుకున్నవారిలో ఉన్నారు. 

ఎన్‌ఆర్‌ఎస్‌సీని సందర్శించిన ఇస్రో చైర్మన్‌ 
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని అన్నారం శివారులో ఉన్న నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ను (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) మంగళవారం సాయంత్రం ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ నారాయణన్‌ సందర్శించారు. సుమారు రెండు గంటలపాటు అధికారులు, శాస్త్రవేత్తలతో చర్చించారు. హైదరాబాద్‌లోని ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ తెలంగాణ స్టేట్‌ సెంటర్‌ను కూడా ఆయన సందర్శించారు. అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)