Breaking News

ఒక్కో పేపర్‌ 2సార్లు మూల్యాంకనం

Published on Fri, 03/14/2025 - 04:20

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 జవాబుపత్రాల మూ ల్యాంకనం అత్యంత పకడ్బందీగా నిర్వహించినట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీ ఎస్సీ) స్పష్టం చేసింది. ప్రతి జవాబుపత్రాన్ని వేరువేరు ఎవాల్యుయేటర్లతో రెండుసార్లు మూల్యాంకనం చేయించినట్లు వెల్లడించింది. ఎంపిక చేసిన(ర్యాండమ్‌గా) కొన్ని జవాబు పత్రా లను మూడోసారి కూడా పరిశీలన జరిపినట్లు తెలిపింది. 

ఈ నెల 10వ తేదీన టీజీపీఎస్సీ గ్రూప్‌–1 అభ్యర్థుల మార్కులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మార్కులపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తాయి. జవాబు పత్రాల మూల్యాంకనం సరిగా చేయలేదని కొందరు వ్యక్తులు ఆరోపణలు చేస్తు న్నారు. ఈ ప్రచారంపై స్పందించిన కమిషన్‌.. గురువారం సుదీర్ఘ ప్రకటన విడుదల చేసింది. 

మొత్తం 20,161 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను 351 మంది నిపుణులైన ఎవాల్యు యేటర్లతో మూల్యాంకనం చేయించినట్లు తెలిపింది. మూల్యాంకనం తీరు, మాధ్యమాల వారీగా అభ్యర్థులు, పేపర్‌వారీగా వచ్చిన టాప్‌ మార్కు లు, టాప్‌ 100 ర్యాంకులు, 500 ర్యాంకుల్లో జెండర్, కమ్యూనిటీ వారీగా అభ్యర్థుల వివరాలను వెల్లడించింది.

యూపీఎస్సీ స్థాయి నిపుణులతో మూల్యాంకనం
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీలో భాగంగా గతేడాది అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. ఈ జవాబుపత్రాల మూల్యాంకనం వెంటనే ప్రారంభించిన కమిషన్‌.. గత నెల 15వ తేదీనాటికే పూర్తి చేసింది. ఈ ప్రక్రియలో పాల్గొన్న చీఫ్‌ ఎగ్జామినర్లు, ఎవాల్యుయేటర్లు యూపీఎస్సీ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొన్నవారేనని స్పష్టం చేసింది. 

వీరంతా శాశ్వత ప్రాతిపదికన వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నవారు అని కమిషన్‌ తెలిపింది. తుది మార్కులను ఖరారు చేసే సమయంలో కూడా మరోమారు పరిశీలన జరిపిన తర్వాతే మార్చి 10వ తేదీన విడుదల చేసినట్లు వెల్లడించింది. 

అయితే గ్రూప్‌–1 మార్కులపై కొందరు సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి నిరాధార ఆరోపణలను పట్టించుకోవద్దని అభ్యర్థులకు సూచించింది. ప్రతి కేటగిరీలోని పోస్టులను నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా భర్తీ చేస్తామని కమిషన్‌ వివరించింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)