Breaking News

యాసంగి ధాన్యం కొనుగోళ్లు షురూ!

Published on Fri, 04/04/2025 - 04:58

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో యాసంగి సీజన్‌ కోతలు మొదలు కావడంతో పౌరసరఫరాల సంస్థ.. రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించడం ప్రారంభించింది. ముందుగా నాట్లు వేసిన నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, నారాయణపేట వంటి జిల్లాల్లో వరికోతలు మొదలయ్యాయి. మార్చి నెలాఖరు నుంచే పౌరసరఫరాల సంస్థ ఆ మేరకు ధాన్యం సేకరణను ప్రారంభించింది. 

నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 778 మంది రైతుల నుంచి రూ.22.99 కోట్ల విలువైన 9,908 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సంస్థ కొనుగోలు చేసింది. ఈనెల 10వ తేదీ తరువాత కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. అదే సమయంలో ప్రతి ఏప్రిల్, మే నెలల్లో భయపెట్టే అకాల వర్షాలు ఈసారి కూడా రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం కురిసిన వర్షంతో పలు జిల్లాల్లో పంటలకు నష్టం కలిగినట్లు ప్రాథమిక సమాచారం. 

70.13 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు అంచనా 
రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో 56.95 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఎకరాకు సగటున 25 క్వింటాళ్లకు పైన దిగుబడి వస్తుందని అనుకుంటే, ఈ సీజన్‌లో కోటీ 40 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. అయితే నిజామాబాద్, నల్లగొండ, నారాయణపేట, కామారెడ్డి, ఖమ్మం, సూర్యాపేటల్లో పండిన ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

బి య్యానికి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో సరిహద్దు జిల్లాల నుంచి ఆయా రాష్ట్రాలకు బియ్యం వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 70.13 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సీఎంఆర్‌ కోసం మిల్లులకు పంపించే అవకాశం ఉంది. కాగా ఇందులో 30 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు సన్న ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

రాష్ట్రంలో ఈనెల నుంచి రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఈ సన్న ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి పౌర సరఫరాల సంస్థ గోడౌన్‌లకే తరలించనున్నారు. మిగతా 40 ఎల్‌ఎంటీ దొడ్డు బియ్యాన్ని సీఎంఆర్‌గా సెంట్రల్‌ పూల్‌కు తరలించే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారు. 

రైతన్నకు అకాల వర్షాల భయం 
ప్రతీ యాసంగి సీజన్‌లో అకాల వర్షాలు, వడగండ్ల వానలు రైతులను ముంచుతున్నాయి. ఇప్పటికే ఒకసారి వర్షాలు, వడగండ్లతో రాష్ట్రంలోని రైతులు పంట నష్టపోయారు. తాజాగా గురువారం మహబూబ్‌నగర్, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల మొదలైన జిల్లాల్లో కురిసిన వర్షం వల్ల ఎక్కుగా వరిపంటకు నష్టం వాటిల్లింది.  

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)