Breaking News

చెరువులకు చేరింది సగంలోపు చేప పిల్లలే

Published on Mon, 12/16/2024 - 03:27

సాక్షి, హైదరాబాద్‌ : ఈ ఏడాది 90 కోట్ల చేప పిల్లలను చెరువుల్లోకి వదలాలని మత్స్యశాఖ నిర్ణయించింది. అయినా అందులో సగం లక్ష్యాన్ని కూడా చే రుకోలేకపోయారు అధికారులు. టెండర్లు ఆలస్యంగా ఖరారు కావడమే దీనికి ప్రధాన కారణం. 

అక్టోబర్‌ నెలలోనే ఉచితంగా చేప పిల్లల పంపిణీ ప్రా రంభించినా, డిసెంబర్‌ నెలలో సగం రోజులు పూర్తవుతున్నా పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ప్రభుత్వ ఆశయానికి కాంట్రాక్టర్లు, మత్స్యశాఖ అధికారులు నీరుగారుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  

లెక్క ఎట్లా..? 
మొదట ఒక గ్లాస్‌లో ఎన్ని చేప పిల్లలు పడతాయో లెక్కిస్తారు. ఆ తర్వాత ఆ గ్లాస్‌ను నింపుతూ ప్లాస్టిక్‌ కవర్లలో పోస్తారు. అంటే మొదట ఎన్ని వచ్చాయో అన్నే ఉన్నాయని కాంట్రాక్టర్ల లెక్క అన్నమాట. గ్లాస్‌లో తక్కువ నింపుతూ కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. 

వాస్తవంగా చేప పిల్లల పంపిణీ పూర్తి పారదర్శకంగా ఉండేలా వీడియో, ఫొటోలు తీయాలి. ఆ నిబంధనలేమీ పాటించకుండా పోశామా.. ఇచ్చామా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే సమయం మించిపోవడంతో వచి్చంది చాలులే అన్నట్టుగా మత్స్యకారులు తీసుకుంటున్నారు.  

90 కోట్ల చేప పిల్లల పంపిణీ ఎక్కడ?  
2024–25 సంవత్సానికి 34 వేల చెరువుల్లో విడతల వారీగా 90 కోట్ల ఉచిత చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌లో టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో టెండర్లు దాఖలు చేయలేదు. 

మూడుసార్లు టెండర్లు పిలిచినా, ఎవరూ రాకపోవడంతో మత్స్యశాఖ స్వయంగా రంగంలోకి దిగి కాంట్రాక్టర్లను ఒప్పించింది. ఎట్టకేలకు సెపె్టంబర్‌ చివరి నాటికి టెండర్లు ఖరారు చేసి, అక్టోబర్‌లో చేప పిల్లల పంపిణీ ప్రారంభమైంది. ఈ ఏడాది భారీ వర్షాలతో దాదాపు అన్ని చెరువులు నిండినా, సరైన సమయంలో చేప పిల్లలు వదలలేదు.  

ఏడాది చివరిలో వదిలే చేప పిల్లలకు వృద్ధి ఉండదు  
ఏడాది చివరిలో వదిలే ఏ రకమైన చేప పిల్లలైన ఎదుగుదల సరిగా ఉండదు. డిసెంబర్‌ ఆ తర్వాత వదిలే చేప పిల్లలు బక్కచిక్కి బరువు తక్కువగా ఉంటాయి. వీటికి వినియోగదారులు కొనడానికి ఇష్టపడరు. చేపలు పట్టడానికి కూలీ, రవాణా ఖర్చు మత్స్యకారులపై పడి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది.  

ఉచిత చేప పిల్లల పంపిణీ తక్షణమే పూర్తి చేయాలి 
ప్రభుత్వం విడుదల చేసే ఉచిత చేప పిల్లల పంపిణీ తక్షణమే పూర్తి చేయాలి. వచ్చే ఏడాది ముందుగానే టెండర్లు పిలిచి సకాలంలో చేపలను చెరువుల్లోకి వదలాలి. లేకుంటే మత్స్యకారులు నష్టపోవాల్సి వస్తోంది. దీనిపై మత్స్యశాఖ దృష్టి సారించాలని, ఆ దిశగా అడుగులు వేయాలి.  – మత్స్యకారులు సుదర్శన్, గౌటే గణేష్‌ 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)