Breaking News

నేడు కరెంట్‌ చార్జీల పెంపుపై నిర్ణయం

Published on Mon, 10/28/2024 - 03:32

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపేందుకు రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు దాఖలు చేసిన 9 వేర్వేరు పిటిషన్లపై రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్సీ) సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ మేరకు వేర్వేరు టారిఫ్‌ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈఆర్సీ చైర్మన్‌ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్‌ రాజు, బండారు కృష్ణయ్యల ఐదేళ్ల పదవీకాలం మంగళవారంతో ముగియనుండగా, ఒకరోజు ముందు ఈ పిటిషన్లపై తమ నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రాష్ట్రంలో రూ.1,200 కోట్ల మేర విద్యుత్‌ చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కం) దాఖలు చేసిన ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్‌) పిటిషన్లతో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన మల్టీ ఇయర్‌ టారిఫ్‌ (ఎంవైటీ) పిటిషన్లపై ఈఆర్సీ ప్రకటించనున్న నిర్ణయం కీలకం కానుంది. దీంతో నవంబర్‌ 1 నుంచి వినియోగదారులపై ప్రత్యక్షంగా చార్జీల పెంపు భారం పడబోతోంది. 

హెచ్‌టీ కేటగిరీలో ఎనర్జీ (విద్యుత్‌) చార్జీల పెంపు, లోటెన్షన్‌ (ఎల్టీ) కేటగిరీలో నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించే వారి ఫిక్స్‌డ్‌ చార్జీ (డిమాండ్‌ చార్జీ)ల పెంపును డిస్కంలు ప్రతిపాదించాయి. హెచ్‌టీ కేటగిరీకి ఎనర్జీ చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్‌డ్‌ చార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి రూ.800 కోట్లు భారం వేసేందుకు అనుమతి కోరాయి. మరో రూ.400 కోట్లను ఎల్టీ వినియోగదారులకు ఫిక్స్‌డ్‌ చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని డిస్కంలు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. 

అలాగే జెన్‌కో 2022–23కి సంబంధించి దాఖలు చేసిన రూ.963.18 కోట్ల ట్రూఅప్‌ చార్జీల పిటిషన్‌తో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన ఎంవైటీ పిటిషన్‌పై సైతం ఈఆర్సీ నిర్ణయాన్ని ప్రకటించనుంది. వీటితో భవిష్యత్తులో వినియోగదారులపై పరోక్షంగా చార్జీల పెంపు భారం పడనుంది. 

రూ.16,346 కోట్ల ట్రాన్స్‌కో ఏఆర్‌ఆర్‌పై రేపు
ట్రాన్స్‌కో దాఖలు చేసిన 2024–29 మధ్యకాలానికి ట్రాన్స్‌మిషన్‌ బిజినెస్, ఎస్‌ఎల్‌డీసీ యాక్టివిటీకి సంబంధించిన రెండు ఎంవైటీ పిటిషన్లపై ఈఆర్సీ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.16,346.1 కోట్ల ఆదాయ అవసరాలున్నట్టు అంచనా వేస్తూ ఆ మేరకు ట్రాన్స్‌మిషన్‌ చార్జీలను కొంతవరకు పెంచి వసూలు చేసుకోవడానికి ట్రాన్స్‌కో ప్రతిపాదించింది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)