Breaking News

‘గోదావరి’కి నేడు సీఎం శంకుస్థాపన

Published on Mon, 09/08/2025 - 05:39

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర తాగునీటి అవసరాలను 2027 డిసెంబర్‌ నాటికి తీర్చడంతో పాటు నగరంలో రోజూ నల్లా నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రతిపాదించిన గోదావరి తాగునీటి పథకం రెండు, మూడో దశ పనులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సోమవారం గండిపేట వద్ద శంకుస్థాపన చేయనున్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన మరో రెండు ప్రాజెక్టులకు కూడా సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు.  

మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలు 
రూ.7,360 కోట్ల అంచనాలతో హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (హామ్‌) విధానంలో గోదావరి తాగునీటి పథకం రెండు, మూడో దశ పనులు చేపట్టనున్నారు. మూసీ నదీ పునరుజ్జీవన పథకంలో భాగంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌ సాగర్‌ జలాశయాలకు తరలిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం పెట్టుబడి పెట్టనుండగా, 60 శాతం వాటాను నిర్మాణ సంస్థ భరించనుంది. 

రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. మల్లన్నసాగర్‌ నుంచి మొత్తం 20 టీఎంసీల నీళ్లను తరలించి ఆ నీళ్లతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జలాశయాలు నింపడంతో పాటు మూసీ పునరుజ్జీవనానికి 2.5 టీఎంసీలను విడుదల చేస్తారు. మిగిలిన 17.50 టీఎంసీల జలాలను హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మార్గమధ్యలో ఉన్న 7 చెరువులను కూడా నింపుతారు.  

ఓఆర్‌ఆర్‌ రెండో దశ ప్రాజెక్టు ప్రారంభం 
ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) రెండో దశలో భాగంగా రూ.1,200 కోట్లతో జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్‌ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, గ్రామ పంచాయితీలకు తాగునీటి సరఫరా చేసేందుకు నిర్మించిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి సోమవారం ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 71 రిజర్వాయర్లు నిర్మించగా, ఇటీవల కొత్తగా నిర్మించిన 15 రిజర్వాయర్లను సీఎం ప్రారంభిస్తారు. 

ఈ ప్రాజెక్టు ద్వారా సరూర్‌నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కీసర, రాజేంద్రనగర్, శామీర్‌పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఆర్‌సీపురం, పటాన్‌చెరు, బొలారంతో సహా మొత్తం 14 మండలాల్లోని 25 లక్షల మందికి తాగునీరు అందుతుంది.  

నియో పోలిస్‌ సెజ్‌కు తాగునీటి సరఫరా.. 
కోకాపేట్‌ లేఅవుట్‌ సమగ్ర అభివృద్ధి–నియో పోలిస్‌ సెజ్‌కు తాగునీటి సరఫరాతో పాటు మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.298 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి 13 లక్షల మంది జనాభాకు లబ్ధి కలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.    

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)