తెలంగాణలో రీపోలింగ్‌కు అవకాశమే లేదు: సీఈవో వికాస్‌రాజ్‌

Published on Fri, 12/01/2023 - 14:17

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ మూడో తేదీన విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల విధానంపై సీఈవో వికాస్‌రాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్‌ స్క్రూటినీ ముగిసిన తర్వాత సీఈవో వికాస్‌రాజ్‌ వివరాలు వెల్లడించారు. ‘తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 18-19 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లు 3.06 శాతం ఉన్నారు. తెలంగాణలో 71.01 శాతం పోలింగ్‌ జరిగింది. లక్షా 80వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 పోలింగ్‌ జరిగింది. హైదరాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 46.68 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. 2018లో పోలింగ్‌ 73.37 శాతం పోలింగ్‌ నమోదు అయ్యినట్టు తెలిపారు. గతంలో కంటే ఈ ఎన్నికల్లో రెండు శాతం పోలింగ్‌ తగ్గింది. తెలంగాణలో రిపోలింగ్‌కు ఎక్కడా అవకాశం లేదు. మునుగోడులో అత్యధికంగా 91.5 శాతం, యాకత్‌పురలో అత్యల్పంగా 39.6 శాతం పోలింగ్‌ నమోదు అయినట్టు వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన వారికి హోమ్‌ ఓటింగ్‌ కల్పించాం.  ఎల్లుండి 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది’

దేవరకద్రలో పది మంది ఉన్నా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశాం. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మార్పిడి జరిగింది. ఆయా పార్టీ ఏజెంట్ల మధ్యనే స్ట్రాంగ్ రూమ్‌కి తరలింపు జరిగింది. పోలింగ్‌పై స్క్రూటినీ ఇవ్వాళ ఉదయం నుంచి జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలు భద్రతలో ఉన్నాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదు అయింది. లెక్కింపు జరిగినా కూడా మళ్ళీ రెండు సార్లు ఈవీఎంలు లెక్కిస్తారు. ప్రతీ రౌండ్‌కు సమయం పడుతుంది. ఈసీఐ నిబంధనల ప్రకారం జరుగుతుంది. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 8.30 నిమిషాల నుంచి ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు. హైదరాబాద్‌లో 14 ఉన్నాయి. ప్రతీ టేబుల్‌కు ఐదుగురు ఉంటారు. కౌంటింగ్‌కు సిద్ధం అవుతున్నాము’ అని అన్నారు. 

Videos

ప్రతీ కుక్కకీ ఒక రోజుంటది.. లక్‌ అంటే నీదేరా!

భారీ భద్రతతో కౌంటింగ్ పై నిఘా

తెలంగాణలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి..

వాగులో కొట్టుకుపోయిన కారు

రెడ్ రోజ్ బేకరిలో అగ్ని ప్రమాదం

భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

పోస్టల్ బ్యాలెట్లపై YSRCP న్యాయపోరాటం

అనంతపురం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

రేపటి కౌంటింగ్ కు అధికారుల విస్తృత ఏర్పాట్లు

రియల్ ఎగ్జిట్ పోల్స్ ఇవే..గెలిచేది మళ్లీ జగనే

Photos

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)