Breaking News

పత్తి అమ్మాలా..? స్లాట్‌ బుకింగ్‌ తప్పనిసరి!

Published on Sat, 09/20/2025 - 06:10

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పత్తి రైతులకు కొత్త చిక్కు వచ్చి పడింది. పండించిన పత్తిని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే ఇకపై ఆన్‌లైన్‌లో ముందుగా స్లాట్‌ బుక్‌ చేసు కోవాల్సి ఉంటుంది. అందుకోసం కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీసీఐ) ‘కపస్‌ కిసాన్‌’అనే ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను ఈ ఏడాది నుంచి అందుబాటులోకి తెచ్చింది. రైతు తన పత్తి పంటను విక్రయించాలంటే ఈ యాప్‌లో వారం రోజుల ముందే స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని సీసీఐ అధి కారులు తెలిపారు. స్లాట్‌లో నిర్దేశించిన సమయానికి రైతులు పత్తిని కొనుగోలు కేంద్రానికి తమ పంటను తీసుకెళ్లాల్సి ఉంటుంది.  

రైతులకు ఇబ్బందే.. 
రాష్ట్రంలో చాలామంది రైతులు ఇప్పటికీ నిరక్షరాస్యులే. అలాంటివారికి యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలంటే ఇబ్బందే. స్మార్ట్‌ఫోన్లు అందరికీ ఉండవు. పైగా వారం రోజుల ముందు స్లాట్‌ బుక్‌ చేసుకోవాలనే నిబంధన మరింత ఇక్కట్లకు గురి చేయనుంది. స్లాట్‌లో నిర్దేశించిన రోజు ఏ కారణం చేత పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లకపోయినా స్లాట్‌ రద్దవుతుంది. దీంతో మరో వారం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.

సాధారణంగా రైతులు తమ సమీపంలో ఉన్న కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్ముకుంటారు. ఈ స్లాట్‌ విధానంతో దూరప్రాంతాల్లోని కేంద్రాలకు కూడా స్చ్లాట్‌ కేటాయించే అవకాశాలుంటాయని చెబుతున్నారు. దీంతో రైతులకు దూరం పెరిగి రవాణా ఖర్చులు కూడా భారంగా మారతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఈసారి 45.85 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. గతేడాది సుమారు 210.19 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం  
ఈ సీజను నుంచి పత్తి కొనుగోలుకు స్లాట్‌ విధానాన్ని అమలు చేయాలని సీసీఐ నిర్దేశించింది. ఈ విధానంపై రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. ఈ నిబంధనలను తొలగించాలని కోరాం.  – రియాజ్, జిల్లా మార్కెటింగ్‌ అధికారి   

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)