Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..
Breaking News
లకురవాను తుడిచిపెట్టనున్న ట్రంప్..!
మెడికల్ కాలేజీల పీపీపీలో బట్టబయలైన ప్రభుత్వ బండారం!
రూ. 21వేలు తగ్గిన సిల్వర్ ధర!
రేవంత్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: మహేశ్వర్రెడ్డి
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఏపీ కేబినెట్లో హైడ్రామా
ఆ విషయం కేసీఆర్నే అడగండి: సీఎం రేవంత్
‘అరావళి’పై ‘సుప్రీం’ స్టే: పాత ఉత్తర్వుల నిలిపివేత
ఆ సెంగార్ను జైలు నుంచి విడుదల చేయొద్దు: సుప్రీం కోర్టు
ఓడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్!
ఆ దేశాల మధ్య జపాన్ ప్రధాని ‘చిచ్చు’
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
‘కాంగ్రెస్ కుట్ర’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్కు షేక్హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన కేసీఆర్
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
యమ డేంజర్లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే!
ట్రంప్ పీస్ ప్లాన్.. ఇదేం ట్విస్టు?!
అనకాపల్లి: ‘ఎర్నాకుళం’ మృతుడికి పరిహారం ప్రకటించిన రైల్వే
మయన్మార్లో తొలిసారిగా ఎన్నికలు
ప్రాగ్ మాస్టర్స్ చెస్ టోర్నీ విజేత హరికృష్ణ
Published on Sun, 06/19/2022 - 10:13
సాక్షి, హైదరాబాద్: భారత గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన పెంటేల హరికృష్ణ చెక్ రిపబ్లిక్లో జరిగిన ప్రాగ్ ఓపెన్ మాస్టర్స్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. 10 మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో 36 ఏళ్ల హరికృష్ణ 6.5 పాయింట్లతో టాప్ ర్యాంక్లో నిలిచాడు.
డేవిడ్ ఆంటోన్ గిజారో (స్పెయిన్)తో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్లో హరికృష్ణ 57 ఎత్తుల్లో గెలిచి టైటిల్ను ఖరారు చేసుకున్నాడు. ఈ టోర్నీలో హరికృష్ణ నాలుగు గేముల్లో గెలిచి, ఐదు గేమ్లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. విజేతగా నిలిచిన హరికృష్ణకు 25 వేల చెక్ కొరూనాలు (రూ. 82 వేలు) ప్రైజ్మనీగా లభించాయి.
#
Tags : 1