Breaking News

బీసీల కోసం చట్టసవరణకైనా సీఎం జగన్‌ సిధ్దం 

Published on Tue, 09/14/2021 - 04:32

సాక్షి, అమరావతి: బీసీలకు సంబంధించి ఏ అంశంలోనైనా వారికి ప్రయోజనం కలుగుతుందనుకుంటే ఎలాంటి చట్ట సవరణకైనా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మన దేశ విశిష్టతను ప్రపంచానికి తెలియజేసిన కళల్లో చేనేత కళ ప్రముఖమైనదన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పద్మశాలీయ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ జింకా విజయలక్ష్మి అధ్యక్షతన పద్మశాలి కులస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చేనేత వృత్తిలో ఉన్నవాళ్ల  బాధలను తెలుసుకుని సీఎం జగన్‌ వారికోసం నేతన్ననేస్తం పథకం ప్రవేశపెట్టారని చెప్పారు.

చేనేత వృత్తిలో కొనసాగే పద్మశాలి కులస్తులు వారి ఉపకులాలకు సంబంధించి నాలుగు కార్పొరేషన్లను ఏర్పాటుచేయడం ద్వారా అత్యధికమందికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ ఇద్దరు పద్మశాలీయుల్ని పార్లమెంట్‌కు పంపారని, ఎమ్మెల్సీలుగా, మునిసిపల్‌ చైర్మన్లుగా ఎంపిక చేశారని చెప్పారు. రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రసంగించారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పోతుల సునీత, ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లి మోహన్‌రావు, ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ పూనూరు గౌతమ్‌రెడ్డి, బీసీ కమిషన్‌ సభ్యులు అవ్వారు ముసలయ్య, నవరత్నాల నారాయణమూర్తి, పద్మశాలి కార్పొరేషన్‌ డైరెక్టర్లు, పద్మశాలి సంఘం రాష్ట్ర నేతలు తదితరులు పాల్గొన్నారు.  

Videos

రాజ్ తో సమంత రిలేషన్‌ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!

అల్లు అర్జున్ తో నిహారిక లవ్ స్టోరీ

కమ్మేస్తోన్న కరోనా కాటేరమ్మ కొడుకునూ వదలని వైరస్

సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ

అందాల పోటీల మీదనే కాదు.. ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టాలి: కేటీఆర్

గుల్జార్ హౌస్ లో అసలేం జరిగింది?

YSRCP కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన టీడీపీ గూండాలు

ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

పాక్‌కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం

ఓటమి భయంతో YSRCP నేతలపై దాడి

Photos

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)

+5

కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

+5

కాజల్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఆ సినిమాతోనే స్టార్‌డమ్‌ (ఫొటోలు)

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు