Breaking News

కౌంటింగ్‌ వేళ.. చార్టెడ్‌ ఫ్లైయిట్స్‌, సంతకాల సేకరణ!

Published on Sat, 11/23/2024 - 08:49

ముంబై: మహారాష్ట్రలో హో రాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమరంలో విజేతలెవరో నేడు(శనివారం) తేలిపోనుంది. ప్రస్తుతం ఈసీ అధికారుల పటిష్ట భద్రత నడుమ   ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్‌ పవార్‌) మహాయుతి కూటమి ప్రజల మన్ననలు పొంది అధికారాన్ని నిలబెట్టుకుంటుందా.. లేక కాంగ్రెస్‌, శివసేన(ఉద్దవ్‌),ఎన్సీపీ(శరద్‌ పవార్‌) మహా వికాస్‌ అఘాడీ కూటమి సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందా అనే ఉత్కంఠకు నేటి సాయంత్రంతో తెరపడనుంది.

అయితే ఫలితాలు వెల్లడికాకముందే మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలో హంగ్‌ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండటంతో మహాయుతి, ఎంవీఏ కూటమిలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండాగానే గెలిచిన అభ్యర్థులను  ప్రత్యర్థి పార్టీలు గాలం వేయకుండా ఉండేందుకు రిసార్ట్‌ రాజకీయాలు మొదలు పెట్టాయి.  అభ్యర్థులు కోసం ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను బుక్‌ చేయడం, చార్టర్డ్‌ విమానాలను ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యాయి.

ఎన్నికల్లో విజయం సాధించిన తమ అభ్యర్థులందరినీ వెంటనే ముంబైలో శిబిరానికి తరలించాలని మహా వికాస్‌ అఘాడీ నిర్ణయించింది. మెజార్టీ వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల సంతకాల సేకరణకు జాప్యం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న ఎంవీఏ.. తమ అభ్యర్థుల నుంచి డిజిటల్‌ సిగ్నేచర్లు(సంతకాలు) సేకరిస్తోంది.  

ఫిరాయింపులను అరికట్టేందుకు కసరత్తు
ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు, పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్టవేసేందుకు ఇప్పటికే కాంగ్రెస్‌ శిబిర రాజకీయాలకు తెరలేపింది. ఎన్నికైన ఎమ్మెల్యేలతో నిత్యం టచ్‌లో ఉంటూ, అవసరమైతే వారిని హెలికాప్టర్‌ ద్వారా శిబిరాలకు తరలించే బాధ్యతను ప్రతిపక్ష నేత విజయ్‌ వడెట్టివార్‌కు అప్పగించింది. 

గెలిచిన అభ్యర్థులను బీజేపీ కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున, తమ ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్‌ ఈ వ్యూహాత్మక ఎత్తుగడకు ప్లాన్‌ వేసింది. ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏ‍ర్పాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ ఎమ్మెల్యేలను కర్ణాటక, లేదా తెలంగాణలో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది.  

శివసేన ముందు జాగ్రత్త   
తమ ఎమ్మెల్యేలపై బీజేపీ కూటమి వల విసిరే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా వారిని శిబిరానికి తరలించాలని నిర్ణయించినట్లు శివసేన(యూబీటీ) అగ్రనేత సంజయ్‌ రౌత్‌ శుక్రవారం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని కనీసం 160-165 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. గెలిచే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే తమకు మద్దతు ప్రకటించారని తెలిపారు.  

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)