Breaking News

ప్రగతి భవన్‌ను మించిన భవనాన్ని కట్టుకున్నాడు

Published on Sun, 08/01/2021 - 08:47

సాక్షి, ఆత్మకూరు(నల్లగొండ): తెలంగాణ రాష్ట్ర సాధనకు మంత్రి పదవినే త్యాగం చేశా.. ప్రొటోకాల్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేశానని.. దీనిపై కోట్లాడే మనస్తత్వం తనది కాదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆత్మకూర్‌(ఎం)లో విలేకరులతో మాట్లాడారు. వాసాలమర్రిలో ముఖ్యమంత్రి పాల్గొన్న సభా వేదికపైకి ఆహ్వానించలేదని.. అయినా గొడవకు దిగలేదని.. గ్రామం అభివృద్ధి చెందుతుందనే మిన్నకుండిపోయినట్లు వివరించారు. మునుగోడులో ప్రొటోకాల్‌పై ప్రశ్నించినందుకే ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారని.. తెలంగాణ ప్రభుత్వంలో ఒక పద్ధతి అంటూ లేదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, పార్టీలు మారడం, అక్రమ వ్యాపారాలను కాపాడుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఆరోపించారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌ పార్టీ మారిన దాఖలాలు లేవని, అక్రమ వ్యాపారాలు చేస్తున్న చరిత్ర లేదని చెప్పారు. మూడు దశాబ్దాలుగా నల్లగొండలో అద్దె ఇంట్లోనే ఉంటున్నానని గుర్తు చేశారు.  2014లో మంత్రి జగదీశ్‌రెడ్డికి స్కూటర్‌ కూడా లేదని, అటువంటి వ్యక్తి నాగారంలో ప్రగతి భవన్‌ను మించిన భవనాన్ని నిర్మించుకున్నాడని ఆరోపించారు. అధికార పార్టీ ఎంపీలు సమస్యలపై స్పందించక పోవడంతో రాష్ట్రానికి ఎటువంటి నిధులు విడుదల కావడం లేదని తెలిపారు.

భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని సమస్యలు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అవుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా బీబీనగర్‌లోని ఏయిమ్స్‌కు రూ. 796 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బీర్ల అయిలయ్య, ఎంపీపీ తండ మంగమ్మశ్రీశైలం, జెడ్పీటీసీ కొడిత్యాల నరేందర్‌ గుప్తా, సర్పంచ్‌ జెన్నాయికోడె నగేష్‌ ఉన్నారు.   

Videos

మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్ DGP ఎదుట 40 మంది లొంగుబాటు

నువ్వు వేస్ట్ అని ప్రజలకు ఎప్పుడో తెలుసు నీకే ఇప్పుడు తెలిసింది

నడిరోడ్డుపై పడుకొని మందుబాబు వీరంగం

దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు..

బిహార్ సీఎం నితీష్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన

Appalaraju: అధికారుల ముందు తప్పు ఒప్పుకున్న బాబు

Gudivada : ముందు మీ ఎమ్మెల్యేకు చెప్పండి ప్రతిదానికి ఉన్నాం అంటూ..

Medchal: మహిళకు ఆపరేషన్ చేసి మధ్యలోనే వదిలేసిన డాక్టర్లు

పార్లమెంటులో వివిధ పార్టీల ఎంపీలతో ప్రధాని మోదీ చాయ్ పే చర్చ

అందరినీ నరికేస్తాం.. యూనివర్సిటీలో జనసైనికుల రచ్చ

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో కిదాంబి శ్రీకాంత్‌- శ్రావ్య వర్మ దంపతులు (ఫొటోలు)

+5

దుబాయ్‌లో దంచికొట్టిన వర్షం.. బుర్జ్‌ ఖలీఫాను తాకిన పిడుగు (ఫొటోలు)

+5

అడివి శేష్‌ ‘డెకాయిట్‌’ చిత్రం టీజర్‌ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖ : వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి సహస్ర ఘటాభిషేకం (ఫొటోలు)

+5

పంజాగుట్టలో సందడి చేసిన హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ (ఫొటోలు)

+5

‘ఛాంపియన్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

పారిస్‌లో చిల్ అవుతోన్న మన్మధుడు హీరోయిన్ అన్షు.. ఫోటోలు

+5

జగన్‌ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం (ఫొటోలు)

+5

ఫుడ్‌.. షాపింగ్‌.. ఇంకేం కావాలంటున్న రెజీనా! (ఫోటోలు)

+5

వైఎస్సార్సీపీ సమరభేరి.. కోటి సంతకాలకు జెండా ఊపిన వైఎస్‌ జగన్ (చిత్రాలు)