AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
Breaking News
యుద్ధాల నడుమ 7.8 శాతం జీడీపీ: ప్రధాని మోదీ
ఒకే ఇంట్లో బయటపడ్డ 23 మృతదేహాలు!
Viral Video: హైవేపై ‘ఫ్యామిలీ’ భోజనం
అమెరికా: కత్తితో మహిళ వీరంగం: ఒకరి మృతి.. నిందితురాలి కాల్చివేత!
నేడు పులివెందులకు వైఎస్ జగన్
పాక్కు నీళ్లు బంద్.. భారత్ ‘నో కాంప్రమైజ్’!
నేపాల్: సొరంగాల్లో 900 మంది కార్మికులు.. నిపుణుల ఆందోళన
తమిళనాడు ఆలయాల్లో ‘నో ఫోన్’.. నేటి నుంచే అమలు
అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత
‘ఈసారి గట్టిగానే కొడతాం’.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
‘గీతా పారాయణం’లో పార్టీల దూషణల పర్వం
Published on Mon, 12/25/2023 - 06:38
కోల్కతా: దాదాపు 1,20,000 మందితో కోల్కతాలో జరిగిన మెగా భగవద్గీత పఠన కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంది. కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజూందార్ అధికార తృణమూల్ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. మతాన్ని, రాజకీయాలను కలిపేయడం బీజేపీ అలవాటుగా మారిందంటూ తృణమూల్ మండిపడింది. ‘‘గీతా పఠనానికి మేం వ్యతిరేకం కాదు.
కానీ దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోకండి. లేదంటే ఈ కార్యక్రమం కంటే ఫుట్బాల్ మ్యాచ్ వంటిది ఏర్పాటు చేయడం మేలు’’ అని టీఎంసీ నేత ఉదయన్ గుహ అన్నారు. ఈ కార్యక్రమానికి పోటీగా కాంగ్రెస్ దానికి దగ్గర్లోనే రాజ్యాంగ పఠనం కార్యక్రమం నిర్వహించింది. మరోవైపు గీతా పఠనానికి ప్రధాని మోదీ మద్దతుగా నిలిచారు. దీనితో సమాజంలో సామరస్యం పెంపొందుతుందంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
#
Tags : 1