Breaking News

పదేళ్ల తర్వాత డీఎంకే.. సభా పర్వానికి సర్వం సిద్ధం

Published on Mon, 06/21/2021 - 10:25

అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ముందుగా గవర్నర్‌ ప్రసంగం ఉంటుంది. పదేళ్లుగా అధికార పక్షంలో కూర్చున్న అన్నాడీఎంకే సభ్యులు తాజాగా ప్రతిపక్ష సీట్లలో కూర్చోనున్నారు.  

సాక్షి, చెన్నై: డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కరోనా నివారణ చర్యల మీద ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. సీఎం స్టాలిన్‌ నేతృత్వంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పడ్డ శ్రమకు ఫలితంగా అనేక జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ తొలి సమావేశాల నిర్వహణ అనివార్యం కావడంతో అందుకు తగిన చర్యలు చేపట్టారు. గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌ సమావేశాలను ఆమోదించారు. 

గవర్నర్‌ ప్రసంగంతో.... 
ఈ ఏడాది గత ప్రభుత్వ హయాంలో తొలి సమావేశంలో గవర్నర్‌ ప్రసంగం సాగిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దృష్ట్యా రెండో సారి సభలో గవర్నర్‌ ప్రసంగం సాగనుంది. సోమవారం ఉదయం పది గంటలకు కలైవానర్‌ అరంగం వేదికగా సభ ప్రారంభం కానుంది. స్పీకర్‌గా అప్పావు సభను నడిపించనున్నారు. గవర్నర్‌ ప్రసంగంలో కరోనా కట్టడిలో అందరి పాత్ర, ప్రశంసలు, రాష్ట్ర ఆర్థిక ప్రగతి బలోపేతానికి తగిన ప్రణాళిక, చెన్నైలో మల్టీసూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంతో పాటు మరికొన్ని కొత్త నిర్మాణాలు, డీఎంకే ఎన్నికల వాగ్దానాల అమలుకు సంబంధించిన పలు అంశాలు ఉండనున్నా యి. అనంతరం సభా వ్యవహారాల కమిటీ సమావే శం అవుతుంది. ఇందులో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, చర్చించాల్సిన అంశాలు, కీలక తీర్మానాల గురించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో సేలం గ్రీన్‌ వే, నీట్‌కు వ్యతిరేకంగా, రాజీవ్‌ హంతులకు దీర్ఘకాలిక పెరోల్‌ తదితర అంశాలకు సంబంధించిన తీర్మానాలు ఉండనున్నాయి.

నెగిటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలి 
సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ కరోనా నెగిటివ్‌ సరి్టఫికెట్‌ తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు చేశారు. అలాగే సభ జరిగే కలైవానర్‌ అరంగం పరిసరాల్లో భద్రతను పెంచారు. సెయింట్‌ జార్జ్‌ కోటలోని అసెంబ్లీ సమావేశ మందిరాన్ని తలపించే విధంగా కలైవానర్‌ అరంగంలోనూ ఏర్పాట్లు చేశారు. గత పదేళ్లుగా అధికార పక్షంలో ఉన్న అన్నాడీఎంకే సభ్యులు తాజాగా ప్రతిపక్ష వరుసలో కూర్చోవాల్సిన పరిస్థితి. 

చదవండి: తమిళనాడులో మరో వారం లాక్‌డౌన్‌ పొడిగింపు

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)