భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
యూపీ ఎన్నికలపై కాంగ్రెస్ ప్లాన్ బీ.. వారికి బంపరాఫర్?
మా తప్పేంటి?.. భారత్, చైనా, అమెరికా పరిహారం చెల్లించాల్సిందే!
ఉత్తరాఖండ్లో వర్ష బీభత్సం.. ఏడుగురు మృతి
‘రేవంత్ డబ్బుల మూట’.. హైదరాబాద్లో పోస్టర్ల కలకలం!
రీల్స్.. ఫాలోవర్ల మోజు! పార్టీని పట్టించుకోరా?
నేపాల్: టన్నెళ్లలో భారత రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు
హార్ముజ్పై ట్రంప్ సంచలన కామెంట్స్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
ఎన్ఆర్సీ? లేదా జనగణన?.. మణిపూర్లో కొత్త రచ్చ!
గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హత లేదా?
బావిలో పడిన కోడలు రక్షించేందుకు బావిలోకి దూకిన అత్త
Published on Sat, 04/05/2025 - 09:05
అన్నానగర్: విల్లుపురం జిల్లా మేల్ మలయనూర్ సమీపంలోని పాలంబుండి గ్రామానికి చెందిన అయ్యప్పన్. ఇతని భార్య సరసు (22). ఆవులకు గడ్డి కోసేందుకు బుధవారం పొలానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ నడుచుకుంటూ వెళ్తున్న సరసు ప్రమాదవశాత్తు జారి పక్కనే ఉన్న 60 అడుగుల లోతున్న బావిలో పడిపోయింది.
ఆమెకు ఈత రాక కేకలు వేసింది. కేకలు విన్న అత్త మల్లిక (45) సరసును రక్షించేందుకు బావిలోకి దూకింది. ఈమెకు ఈత రాకపోవడంతో వారిద్దరూ బావిలో రాయిని పట్టుకుని కేకలు పెట్టారు. కేకలు విని చుట్టుపక్కల వారుఅగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మేల్ మలయనూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బావిలోకి దిగి మల్లిక, సరసులను సురక్షితంగా బయటకు తీసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
#
Tags : 1