Breaking News

ఏడేళ్లలో 60% పెరిగిన పప్పుధాన్యాల ఉత్పత్తి 

Published on Tue, 09/23/2025 - 06:28

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గడిచిన ఏడేళ్లలో పప్పు ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని నీతిఆయోగ్‌ వెల్లడించింది. పప్పు ధాన్యాల ఉత్పత్తి 2015–16తో పోలిస్తే ఏకంగా 60 శాతం పెరిగాయంది. ఇదే సమయంలో దిగుమతులు 10శాతానికి పడిపోయాయని తెలిపింది. పప్పు ధాన్యాల ఉత్పత్తి సమతుల్య, స్థిరమైన వృద్ధిని సాధించేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపింది. 

అప్పుడే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మిగులు దేశంగా మారుతుందని నీతిఆయోగ్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల విడుదల చేసిన ‘ఆత్మనిర్భరత లక్ష్యం వైపు పప్పుధాన్యాల వృద్ధిని వేగవంతం చేసేలా వ్యూహాలు, మార్గాలు’అనే నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. సుమారు 80 శాతం ఉత్పత్తి వర్షాధార ప్రాంతాలపై ఆధారపడి, 5 కోట్లకు పైగా రైతులు, వారి కుటుంబాల జీవనోపాధికి ఊతమివ్వడంతోపాటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు పప్పుధాన్యాల రంగం చాలా కీలకంగా ఉందని నివేదిక పేర్కొంది.  

లక్ష్యం చేరాలంటే కేంద్రం మద్దతే కీలకం 
2015–16లో 1.63 కోట్ల టన్నుల పప్పు ధాన్యాల ఉత్పత్తి జరగ్గా, ఆ సమయంలో ఏకంగా ఏడాదికి 60 లక్షల టన్నుల మేర దిగుమతులు చేసుకునే అవసరముండేదని నీతి ఆయోగ్‌ తెలిపింది. 2022–23 నాటికి, ఉత్పత్తి 59.4 శాతం పెరిగి 2.60 కోట్ల టన్నులకు ఉత్పత్తి పెరగడంతో పప్పు ధాన్యాల దిగుమతి 29 శాతం నుంచి ఏకంగా 10.4 శాతానికి తగ్గిందని తెలిపింది. 2030 నాటికి దేశంలో 3.05 కోట్ల టన్నులు, 2047 నాటికి 4.57 కోట్ల టన్నుల ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేసింది. 

2036 నాటికి 36 లక్షల టన్నుల మిగులుకు దేశం చేరాలంటే సాగులో ఎదురవుతున్న నిర్దిష్ట అడ్డంకులను తొలగించేందుకు తగిన వ్యవసాయ వ్యూహాలను అనుసరించాల్సి ఉందని సూచించింది. పప్పు ధాన్యాల ఉత్పత్తితో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాలు దాదాపు 55 శాతం వాటా కలిగి ఉన్నాయని, మొదటి 10 రాష్ట్రాలు జాతీయ ఉత్పత్తిలో 91 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంది. 

దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, పోషక భద్రతను నిర్ధారించడానికి, పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా దేశం లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవరోధాలను అధిగమించడం చాలా ముఖ్యమని పేర్కొంది. పంటల ఉత్పాదకతను పెంచేందుకు యాంత్రీకరణ, బయో–ఫెరి్టలైజేషన్‌ పరిష్కారాలను ప్రోత్సహించాలని, వాతావరణ అనుకూలత, తెగులు నిర్వహణ వ్యూహాలను ముందుగానే రైతులకు చేరవేసే వ్యవస్థలను వృధ్ధి చేయాలని సిఫార్సు చేసింది.

 దీంతో పాటే రియల్‌ టైం డేటా ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, దిగుబడులు మెరుగు పరిచేందుకు, ఉత్తమ పద్ధతులను అవలంబించడాన్ని ప్రోత్సహించడానికి రైతులకు శిక్షణ ఇచ్చేందుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. ఉత్పత్తి అంశాలతో పాటు తక్కువ ఆదాయ కుటుంబాలకు ప్రోటీన్‌ భద్రత కోసం ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్‌), పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాల్లో పప్పుధాన్యాలను ఎక్కువగా కేటాయించాల్సిన అవసరాన్ని నివేదిక నొక్కిచెప్పింది.  

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)