స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి పోరాడుతాం: బొత్స
Breaking News
Covid-19: పుక్కిలించిన సెలైన్తో కరోనా టెస్ట్
Published on Fri, 05/28/2021 - 14:11
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ అయిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ)నీరి సంస్థ కరోనా టెస్టింగ్కు కొత్త విధానాన్ని కనిపెట్టింది. సెలైన్ ట్యూబ్తో 3 గంటల్లో కరోనా టెస్టింగ్ ఫలితాన్ని తెలియజేసే విధానాన్ని ఆవిష్కరించింది. ఈ విధానంలో నోట్లో పుక్కిలించిన సెలైన్తో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు. అత్యాధునిక ల్యాబ్ అవసరం లేకుండా.. అతి తక్కువ ఖర్చుతో టెస్ట్ చేసుకోవచ్చు.
ఈ ఆవిష్కరణ వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల వారికి మరింత సౌలభ్యం చేకూరనుంది. దీని వల్ల సొంతంగా ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. నీరి ఆవిష్కరించిన ఈ నూతన టెస్టింగ్ పద్దతికి ఐసీఎంఆర్ సంస్థ కూడా ఆమోదం తెలిపింది. తర్వలోనే ఇది మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది.
చదవండి: Covid-19 Self-Testing: ఇంట్లోనే కరోనా టెస్టు
Tags : 1