Breaking News

మంచుకొండల్లో ‘సెగలు’

Published on Wed, 12/03/2025 - 06:02

న్యూఢిల్లీ: ఇవి భూమికి నిజంగానే డేంజర్‌ బెల్స్‌! మైదాన ప్రాంతాలతో పోలిస్తే కొండ ప్రాంతాలు కనీసం 50 శాతం ఎక్కువగా వేడెక్కుతున్నాయట. 1950 నుంచీ ఈ ధోరణి వేగం పుంజుకుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏకంగా 100 కోట్ల మంది విషయంలో ఇది ప్రాణాంతక పరిణామాలకు దారి తీయగలదని అది హెచ్చరించింది కూడా. ముఖ్యంగా 1980 నుంచి 2020 మధ్య 40 ఏళ్లలో సమతల ప్రాంతాలతో పోలిస్తే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో శతాబ్దానికి సగటున 0.21 డిగ్రీల చొప్పున అధిక వేడిమి నమోదైంది.

అలాగే వాతావరణం పొడిబారడం 11.5 మి.మీ. ఎక్కువగా జరిగింది. ఇక మంచు కరిగే వేగం శతాబ్దానికి ఏకంగా 25.6 మి.మీ. చొప్పున పెరిగిపోయింది! వెన్నులో చలి పుట్టించే ఈ అధ్యయన వివరాలను జర్నల్‌ నేచర్‌ రివ్యూస్‌ అర్త్‌ అండ్‌ ఎన్వైరాన్‌మెంట్‌లో ప్రచురించారు. 

బృందంలో మనవాళ్లు కూడా.. 
పరిశోధన బృందంలో భారత్‌ నుంచి ఉత్తరాంచల్, జవహర్‌లాల్‌ వర్సిటీలకు చెందిన పరిశోధకులు కూడా భాగస్వాములుగా ఉండటం విశేషం. యూరప్‌లోని ఆల్ఫŠస్‌ మొదలుకుని ప్రపంయచంలోకెల్లా అత్యంత ఎత్తైన ఆసియాలోని టిబెట్‌ పీఠభూమి దాకా పర్వత ప్రాంతాలన్నింటికీ సంబంధించిన వేడిమి గణాంకాలను వాళ్లు ప్రత్యేకంగా విశ్లేíÙంచారు. ప్రధాన పరిశోధనలో వెల్లడైన ప్రమాదకర వాస్తవాలనే వారి విశ్లేషణ కూడా ధ్రువీకరించం విశేషం. ‘‘ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 కోట్ల మందికి పైగా ప్రజలు తమ తాగు, సాగు అవసరాలకు హిమానీనదాలు, మంచు కొండల నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడ్డారు. వారి పరిస్థితి త్వరలోనే అతి దుర్భరంగా మారనుంది.

అంతేకాదు, వీటి తాలూకు భయానక విపరిణామాలు కేవలం కొండ ప్రాంతవాసులకే పరిమితం కాబోవు. మైదాన ప్రాంతాలు కూడా ఇప్పటికే వాటిని చవిచూస్తున్నాయి. ఈ ధోరణి మున్ముందు మరింత వేగం పుంజుకుంటుంది’’అంటూ వారు భవిష్యద్దర్శనం చేశారు. ‘‘ముఖ్యంగా హిమాలయాల్లో మంచు మనం భావిస్తున్న దానికంటే కూడా శరవేగంగా కరిగిపోతోంది. ఇది భయానక వరదలకు, ఆ వెంటనే ఊహాతీతమైన కరువులకు దారితీయవచ్చు. పర్వత ప్రాంతాల్లోని పలు అరుదైన వృక్ష, జీవజాలం శాశ్వతంగా కనుమరుగయ్యే రోజులు కూడా చాలా దగ్గర్లోనే ఉన్నాయి’’అంటూ హెచ్చరించారు.  

మంచు కరగడమే కారణం! 
బ్రిటన్‌లోని పోర్ట్స్‌మౌత్‌ వర్సిటీ నిపుణుల సారథ్యంతో కూడిన అధ్యయన బృందం ఈ పరిశోధన జరిపింది. ఎత్తు ఆధారిత వాతావరణ మార్పులపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా భూమిపై పడే రేడియో ధార్మికతతో పోలిసే ఉపరితలం నుంచి పైకి అది ప్రతిఫలించే రేటు, గాల్లో తేలాడే ఘన కణాల సాంద్రత తదితరాలను లెక్కగట్టింది. ఆర్కిటిక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పర్వత ప్రాంతాలన్నీ మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా వేడెక్కుతూ వస్తున్నట్టు లెక్కగట్టింది. అక్కడ మంచు విపరీతంగా కరిగిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణమని అధ్యయన బృంద సారథి నిక్‌ పెపిన్‌ చెప్పుకొచ్చారు. ‘‘ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాల్లో గాల్లో పైకి పయనించే ఘన కణాల సాంద్రత మంచు కరిగే వేగాన్ని మరింత పెంచేస్తోంది. ఇది నిజంగా ఆందోళనకర పరిణామమే’’అని వివరించారు. 

#

Tags : 1

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు