Breaking News

Manipur: ఉగ్రవాద కాల్పుల్లో అయిదుగురు పౌరులు మృతి

Published on Wed, 10/13/2021 - 11:00

ఇంఫాల్‌: మణిపూర్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాంగ్‌పోక్పి జిల్లాలోని బి గామ్నమ్‌ గ్రామంలోకి మంగళవారం ఉదయం అనేకమంది చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఎంపీ ఖుల్లెన్‌ గ్రామ పెద్దతో పాటు ఎనిమిది సంవత్సరాల చిన్నారి కూడా ఉన్నారు.  మరో ఇద్దరు గాయపడ్డారు. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు.

అయితే కుకీ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి తెగబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పౌరులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. కాగా ఈ ఘటనను మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ తీవ్రంగా ఖండించారు. ఇది తీవ్రవాద చర్యగా అభివర్ణించారు.
చదవండి: Manjula Pradeep: ఎవరీమె... ఏం చేస్తున్నారు.. ఎందుకీ పోరాటం?

ఈ ఘటన కుకీ నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టిన రెండు రోజుల తర్వాత చోటుచేసుకుంది. ఆదివారం నాడు మఫౌ డ్యామ్‌ సమీపంలో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటేచేసుకున్న విషయం తెలిసిందే. కుకీ ఉగ్రవాదుల సంచారం ఎక్కువగా ఉందన్న సమాచారంతో అక్కడ భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ విషయం తెలిసిన టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో, భద్రతా దళాలు ప్రతిదాడి చేశాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు టెర్రరిస్టులు మృతిచెంచారు.
చదవండి: రెండు తలలు, మూడు కళ్లతో లేగదూడ.. పూజించేందుకు జనం బారులు

ఉగ్రవాదుల మృతికి సంతాపంగా బి గామ్నమ్ ప్రాంతంలో ఎంపీ ఖుల్లెన్ గ్రామస్తులు మంగళవారం సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే కొందరు ఉగ్రవాదులు గ్రామంలోకి చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్రామ పెద్దతో పాటు నలుగురు పౌరులు మరణించారు.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)