Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..
Breaking News
లకురవాను తుడిచిపెట్టనున్న ట్రంప్..!
మెడికల్ కాలేజీల పీపీపీలో బట్టబయలైన ప్రభుత్వ బండారం!
రూ. 21వేలు తగ్గిన సిల్వర్ ధర!
రేవంత్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: మహేశ్వర్రెడ్డి
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
ఏపీ కేబినెట్లో హైడ్రామా
ఆ విషయం కేసీఆర్నే అడగండి: సీఎం రేవంత్
‘అరావళి’పై ‘సుప్రీం’ స్టే: పాత ఉత్తర్వుల నిలిపివేత
ఆ సెంగార్ను జైలు నుంచి విడుదల చేయొద్దు: సుప్రీం కోర్టు
ఓడియమ్మ.. ఫ్లాష్ ఉమెన్!
ఆ దేశాల మధ్య జపాన్ ప్రధాని ‘చిచ్చు’
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
‘కాంగ్రెస్ కుట్ర’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్కు షేక్హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన కేసీఆర్
ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
యమ డేంజర్లో ఢిల్లీ.. ఊపిరి ఇక కష్టమే!
ట్రంప్ పీస్ ప్లాన్.. ఇదేం ట్విస్టు?!
అనకాపల్లి: ‘ఎర్నాకుళం’ మృతుడికి పరిహారం ప్రకటించిన రైల్వే
మయన్మార్లో తొలిసారిగా ఎన్నికలు
కాల్చేస్తాం, జరిమానా కట్టేస్తాం
Published on Mon, 08/15/2022 - 10:27
సాక్షి, బెంగళూరు: ధూమపానం అటు ఆరోగ్యాన్ని, ఇటు జేబును నాశనం చేస్తుందని ఎందరు హితోక్తులు చెప్పినా ధూమపాన ప్రియులు చెవికెక్కించుకోవడం లేదు. రాష్ట్రంలో ధూమపానం చేసేవారి సంఖ్య పెరగడమే దీనికి నిదర్శనం. దేశంలోనే అగ్రస్థానంలో కన్నడనాడు నిలిచింది. పబ్లిక్ స్థలాల్లో పొగతాగుతూ పట్టుబడిన వారి జాబితాలోనూ కర్ణాటకదే తొలిస్థానం. సుమారు 35 శాతంతో కర్ణాటక ఇందులో పై వరుసలో ఉంది. ఎన్నిసార్లు జరిమానాలు విధిస్తున్నప్పటికీ పబ్లిక్ ప్రాంతాల్లో ధూమపానం చేయడం మాత్రం ఆగడం లేదు. కర్ణాటక తర్వాత స్థానంలో కేరళ ఉంది. గడిచిన మూడేళ్లలో 5.07 లక్షల మంది పొగ తాగుతూ దొరికిపోయి జరిమానా కట్టారు.
కోట్పా చట్టం చూస్తోంది
- సిగరెట్, పొగాకు ఉత్పత్తుల చట్టం (కోట్పా) అమల్లో ఉంది. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం ఈ చట్టరీత్యా నేరం. కానీ ధూమపానప్రియులు యథావిధిగా రద్దీ ప్రాంతాల్లో పొగాకు కాలుస్తున్నారు. టీ స్టాళ్లు, పాన్ దుకాణాలు, పార్కులు, వీధుల్లో ఇది అధికంగా ఉంది.
- అధికారుల తనిఖీలలో దొరికితే ఈ నేరానికి రూ. 200 జరిమానా విధిస్తున్నారు.
- పొగరాయుళ్లు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని తూర్పు జోన్ డీసీపీ శరణప్ప తెలిపారు.
5.07 లక్షల జరిమానాలు
- 2019 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు దేశంలో మొత్తం 14.40 లక్షల మంది బహిరంగ ప్రాంతాల్లో ధూమపానం చేసి జరిమానాలు చెల్లించారు.
- ఇందులో కర్ణాటక నుంచే సుమారు 5.07 లక్షల మంది ఉండడం గమనార్హం. దేశంలోని మొత్తం కేసులతో పోలిస్తే 35 శాతం ఒక్క బెంగళూరు నుంచే ఉన్నాయి.
- మొత్తం జరిమానాల్లో 50 శాతం కర్ణాటక, కేరళ రాష్ట్రాల వాటానే ఉంది.
(చదవండి: చాటింగ్, హాట్ ఫొటోలతో పారిశ్రామికవేత్తకు టోకరా)
#
Tags : 1