Breaking News

అయోధ్య‌లో పర్యటించిన విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి

Published on Tue, 01/23/2024 - 10:34

కంచి కామ‌కోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠాధిప‌తి శంక‌రాచార్య విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి అయోధ్య‌లో ప‌ర్య‌టించి యాగ‌శాల‌లో హోమాల‌ను, రామ మందిరంలో ప్రాణ ప్ర‌తిస్ట‌కు సంబంధించిన క్రతువులను ప‌ర్య‌వేక్షించి ఆశీర్వ‌దించారు. అయోధ్య చేరుకున్న స్వామీజీ నేరుగా శ్రీ‌రాముని కుల‌దేవ‌త అయిన దేవ‌కాళి మందిరాన్ని సంద‌ర్శించి పూజ‌లు నిర్వ‌హించి, అనంత‌రం శంక‌ర మ‌ఠాన్ని చేరుకున్నారు. అక్క‌డ ఆయ‌న‌కు భ‌య్యా జోషి ఆహ్వానం ప‌లికారు. అక్క‌డ రామ షడాక్షరి హోమాలు జ‌రిగిన‌ రామ స‌న్నిధిలో ఆయ‌న క‌ల‌శాభిషేకాన్ని నిర్వ‌హించారు. శంక‌ర మ‌ఠంలో రామ‌స‌న్నిధిని శ్రీ జ‌యేంద్ర స‌ర‌స్వ‌తీ మహాస్వామి ప్ర‌తిష్ఠించారు. అనంత‌రం విజ‌యేంద్ర సరస్వతీ స్వామి అయోధ్య శంక‌ర మ‌ఠం వెబ్‌సైట్ www.kanchimuttayodhya.in ప్రారంభించారు.

రామ‌జ‌న్మ భూమికి వెళ్ళిన స్వామివారికి రామ‌జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్ట్ కోశాధికారి శ్రీ గోవింద్ దేవ్ జీ మ‌హారాజ్‌,  శ్రీ జ్ఞానేశ్వ‌ర్ ద్రావిడ్‌, శ్రీ ల‌క్ష్మీకాంత్ దీక్షిత్‌, ఇత‌ర వైదిక పండితుల‌తో పూర్ణ‌కుంభ స్వాగ‌తం ప‌లికారు. య‌జ్ఞ‌శాల‌లో క‌ల‌య‌దిరిగిన స్వామి అన్ని క‌ల‌శాల‌కు పూల‌ను స‌మ‌ర్పించారు. త‌ర్వాత ప్ర‌ధాన క‌ల‌శానికి మంత్రోచ్ఛార‌ణ‌ల‌తో పూల‌ను స‌మ‌ర్పించి హారతి ఇచ్చారు. శ్రీ‌రాముడిపై ప్ర‌త్యేక మంత్రాల‌ను పూజ్య‌శ్రీ స్వామివారు ఉచ్ఛ‌రించి క‌ల‌శ‌పూజ పూర్తి చేశారు.

అనంత‌రం మందిరానికి బ‌య‌లుదేరిన స్వామివారు ఈ సంద‌ర్భంగా  శ్రీ జ్ఞానేశ్వ‌ర్ శాస్త్రి ద్రావిడ్‌, శ్రీ ల‌క్ష్మీకాంత్ దీక్షిత్ లు, జరుగనున్న ప్రాణ ప్ర‌తిష్ఠ సంద‌ర్భంగా నిర్వహిస్తున్న ప్ర‌త్యేక క్ర‌తువులు, పూజా విధి విధానాల గురించి వివ‌రించారు. మందిరంలోకి ప్ర‌వేశించే మొద‌టి మెట్టుకు కొబ్బ‌రికాయ‌ను కొట్టి, అనంత‌రం గ‌ణేశుని చెక్కిన మొద‌టి రెండు స్తంభాల‌కు కొబ్బ‌రికాయ‌ల‌ను స‌మ‌ర్పించారు. అనంత‌రం పూజ్య శ్రీ స్వామివారు మ‌హామంట‌పం, అర్ధ మంట‌పం సంద‌ర్శించి, త‌ర్వాత గ‌ర్భ‌గృహానికి వెళ్లారు.
అక్క‌డ ట్ర‌స్టు కోశాధికారి గోవింద్ దేవ్ జీ మ‌హారాజ్‌, కార్య‌ద‌ర్శి చంప‌త్‌రాయ్ ఆయ‌న‌కు ఆహ్వానం ప‌లికారు.

నేత్రోన్మీల‌నం :
గ‌ర్భ‌గుడిలో నేత్రోన్మీల‌నం క్ర‌తువును ప్రారంభించి, విగ్ర‌హానికి న్యాసంతో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి శ్రీ‌రాముడికి ప్ర‌త్యేక ఆభ‌ర‌ణాల‌ను స‌మ‌ర్పించారు. స్వామివారికి అర్థ‌మంట‌పంలో వైదిక మంత్రోచ్ఛార‌ణ‌ల న‌డుమ శాలువ‌ను బ‌హుక‌రించారు. స్వామివారు తిరిగి య‌జ్ఞ‌శాల‌కు వెళ్ళారు. ఈ సంద‌ర్భంగా దేశానికి సుర‌క్ష‌, సుభిక్ష, ప్ర‌జ‌ల‌కు సువిద్య  క‌ల‌గాల‌ని ఆశీర్వ‌దించారు.

Videos

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)