Breaking News

జమ్మూలో ఘోరం

Published on Thu, 01/22/2026 - 14:57

బందేర్వాహ్‌/జమ్మూ: ఉగ్రవ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న 10 మంది సైనికులు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జ మ్మూకశ్మీర్‌లోని డోడా జిల్లాలోని భందేర్వాహ్‌–ఛంబా అంతర్రాష్ట్ర రహదారిలో 9,000 అడుగుల ఎత్తయిన ఖన్నీ పర్వత ప్రాంతంలో సైనిక వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని భారత ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. 

విషయం తెల్సిన వెంటనే సైన్యం, పోలీసులు అన్వేషణ, సహాయక చర్యలను ఆరంభించారు. 200 అడుగుల లోతైన లోయలో పడిపోయిన వాహనం నుంచి నలుగురు సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 17 మంది సైనికులను ఎలాగోలా పైకి తీసుకొచ్చి ఆస్పత్రుల్లో చేర్పించారు. అయితే వారిలో చికిత్స పొందుతూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సైనిక వాహనం చాలా ఎత్తు నుంచి పల్టీలు కొడుతూ లోయలో పడటంతో ఎక్కువ మంది చనిపోయారని అదనపు డిప్యూటీ కమిషనర్‌ సుమిత్‌ భుత్యాల్‌ వెల్లడించారు. 

అసలేమైంది?
ఖన్నీ పర్వతం మీద ఉన్న ఆర్మీ పోస్ట్‌కు చేరుకునేందుకు పలువురు సైనికులు గురువారం మధ్యాహ్నం అత్యంత అధునాతన ‘క్యాస్పిర్‌’ ఆర్మీ వాహనంలో బయల్దేరారు. రహదారిలో పాతిపెట్టిన మందుపాతరలు, శక్తివంత పేలుడు పదార్థాలు(ఐఈడీ)లను గుర్తించే, ఉగ్రవాదుల తుపాకీ గుళ్ల వర్షాన్ని సైతం తట్టుకోగల బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనంగా ‘క్యాస్పిర్‌’ పేరొందింది. గురువారం అననుకూల వాతావరణంలో వెళ్తున్న సమయంలో డ్రైవర్‌ చేతుల్లోంచి వాహనం అదుపుతప్పడంతో పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని జమ్మూ కేంద్రంగా పనిచేసే వైట్‌నైట్‌ కోర్‌ బలగం తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టింది.

దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని
సైనికుల వీరమరణం ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘డోడా ఘటన అత్యంత విచారకరం. సాయుధ బలగాల్లో అత్యంత ధైర్యవంతులను కోల్పోయాం. దేశసేవలో ప్రాణాలు కోల్పోయిన మీ త్యాగాలను జాతిజనులు సదా గుర్తుంచుకుంటారు’’ అని ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక పోస్ట్‌ పెట్టారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని తన ఆకాంక్ష తెలియజేశారు. గాయపడిన సైనికులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికార యంత్రాంగానికి ప్రధాని సూచించారు.  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

జమ్మూకశ్మీర్ : దోడా జిల్లాలో ఘోర ప్రమాదం

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)