Breaking News

అంతా ఈయనే చేశారు...

Published on Wed, 01/29/2025 - 04:35

జేమ్స్‌ విల్సన్‌.. మనం బ్రిటిష్‌ పాలనలో ఉన్నప్పుడు ఈయనే తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1857 సిపాయిల తిరుగుబాటు, తదనంతర పరిణామాల ఫలితంగా ఈస్టిండియా కంపెనీకి ఆర్థి కంగా చాలా నష్టం జరిగింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించే బాధ్యతను క్వీన్‌ విక్టోరియా స్కాట్లాండ్‌కు చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్‌ విల్సన్‌కు అప్పగించారు. అలా ఆమె ఆదేశం మేరకు విల్సన్‌ 1859లో భారత్‌కు వచ్చారు. 1860 ఏప్రిల్‌ 7న తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

ఆ సమయంలో ఆయన మూడు రకాల పన్నులను ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను, లైసెన్స్‌ పన్ను, పొగాకు సుంకం.. ఇందులో ఆదాయపు పన్నును మాత్రమే అమల్లోకి తెచ్చారు. మిగిలినవాటిని పక్కనపెట్టారు. అయితే, భారత్‌లోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జమీందారులు, వ్యాపారవేత్తలు ఈ నిర్ణయంపై కినుక వహించారు. 

1793లో అప్పటి గవర్నర్‌ జనరల్‌ కారన్‌ వాలీస్‌ అమల్లోకి తెచ్చిన శాశ్వత భూమి శిస్తు విధానం స్ఫూర్తికి ఇది వ్యతిరేకమని అన్నారు. అప్పట్లో భూమి శిస్తును శాశ్వతంగా నిర్ణయించారు. అదనంగా ఆదాయపు పన్నును విధించడాన్ని విమర్శించారు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. జేమ్స్‌ విల్సన్‌ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. 

దేశంలో భారతీయులు వ్యాపారం చేసుకునేందుకు బ్రిటిషర్లు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించినందున ఆదాయంపై పన్ను విధించడం సబబే అని ఆయన వాదించారు. అయితే, బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కొన్ని నెలలకే ఆగస్టులో రక్త విరోచనాలతో బాధపడుతూ జేమ్స్‌ విల్సన్‌ కోల్‌కతాలో మరణించారు.  

దేశంలో సివిల్‌ పోలీసు విభాగం ఏర్పాటు, తొలిసారిగా పేపర్‌ కరెన్సీ తేవడం, ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు, ఆడిటింగ్, పబ్లిక్‌ వర్క్స్, రహదారుల నిర్మాణం కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు, మిలటరీ ఫైనాన్స్‌ కమిషన్, సివిల్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ల ఏర్పాటు.. ఇలా అన్ని ఆయన కృషి ఫలితమే అని చెబుతారు.  

ప్రస్తుత స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ పూర్వ సంస్థ చార్టర్డ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకుడు కూడా ఈయనే.. ఎలాగూ ఐటీ విషయం వచ్చింది కాబట్టి.. ఓ తాజా వార్త.. అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు చేయాలని ట్రంప్‌ అనుకుంటున్నారట.. మేడమ్‌ వింటున్నారా? 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)