Breaking News

కాంగ్రెస్‌కు శశిథరూర్‌ ఝలక్‌

Published on Sat, 06/20/2026 - 14:55

తిరువనంతపురం: కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మరోసాకి కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా జరిపిన దాడిలో భారత నావికుల మృతి పట్ల కేంద్రాన్ని కాంగ్రెస్‌ ఎండగడుతున్న తరుణంలో మోదీకి థరూర్‌ మద్దతుగా మాట్లాడారు. ఇటీవల జరిగిన జీ7 సమ్మిట్‌లో భారత్‌ సమస్యను తగిన రీతిలో మోదీ తెలియజేశారన్నారు.

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ వ్యవహారం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రతిపక్ష బీజేపీ విధానాలకు పలుమార్లు మద్ధతిస్తూ సొంత పార్టీని తరచుగా ఇబ్బందులకు గురిచేస్తారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను మరోసారి ఇరకాటంలో పడేశాయి. ఇటీవల హర్ముజ్‌ జలసంధి ఒమన్‌ తీరంలో అమెరికా జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించారు. ఈ అంశంలో కేంద్రం తగిన విధంగా స్పందించడం లేదని కాంగ్రెస్ ఎండగడుతుంది. ఇటీవల జరిగిన జీ-7 సమ్మిట్‌లోనూ ప్రధాని ఈ విషయంపై ట్రంప్‌తో తగిన విధంగా స్పందించలేదని మౌనంగా ఉన్నారని విమర్శలు గుప్పించింది.

అయితే కాంగ్రెస్‌ ప్రధానిని ఎండగట్టే యత్నం చేస్తుంటే.. ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌ మాత్రం మోదీని ప్రశంసిస్తూ మాట్లాడారు. "ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షునితో జరిగిన బహిరంగ, ప్రైవేట్ సమావేశాల్లోనూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. యుద్ధ సమయంలో వాణిజ్య నౌకల్లోని పౌర నావికులు పోరాటానికి లక్ష్యం కాకూడదనే సందేశాన్ని తెలియజేయడం చాలా ముఖ్యం. వారు సైనికులు కాదు,ఒకవేళ వారు అమెరికా నౌకదళ దిగ్భందనాన్ని ఉల్లంఘిస్తుంటే వారిని మరో పద్ధతిలో నిరోధించండి కానీ చంపడం మార్గం కాదు ప్రధాని మోదీ తెలియజేసిన సందేశం ఇదే," అని థరూర్ అన్నారు.

అయితే ఒమన్‌ తీరంలో నావికుల మృతిపై మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్‌ విమర్శలు గుప్పిస్తున్న సమయంలో థరూర్‌ వాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శశిథరూర్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూ బీజేపీ కౌంటర్‌ మెుదలు పెట్టింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ  "కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బండారం బయటపెట్టారు. కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్రమోదీజీ దౌత్యనీతిని బహిరంగంగా ప్రశంసిస్తున్నారు. భారతదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రధాని మోదీకే మొదటి స్థానం "అని అన్నారు.

#

Tags : 1

Videos

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి

ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?

లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..

తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం

చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక

సభలో అందరిముందు జనసేన గాలి తీసిన బాబు..

Idupulapaya: YSR ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు

Photos

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)