Breaking News

ఇంటింట త్రివర్ణం

Published on Tue, 08/02/2022 - 19:16

ఈ ఆగస్టు 14కు భారత స్వాతంత్య్ర ‘అమృతోత్సవాలు’ పూర్తవుతున్నాయి. మన స్వతంత్రం 75 ఏళ్లు పూర్తి చేసుకుని ఆగస్టు 15న 76లోకి ప్రవేశిస్తోంది. ఈ సందర్భాన్ని దేశ ప్రజలు ఘనమైన వేడుకగా జరుపుకోవాలని ఆదివారం జూలై 31న ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఇంటింటా జాతీయ జెండా ఎగరాలని కోరారు. సోషల్‌ మీడియా అకౌంట్‌లలో మన త్రివర్ణ పతకాన్ని ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.

ఆగస్టు 2 నుంచి (నేటి నుంచి) 15 వ తేదీ వరకు ప్రొఫైల్‌ పిక్‌ను ఉంచుకోవాలని సూచించారు. ఆగస్టు 2కు ఉన్న ప్రాముఖ్యాన్ని చెబుతూ, జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య ఆగస్టు 2నే జన్మించారని మోదీ గుర్తు చేశారు. దేశం స్వాతంత్య్రం సాధించిన 75 ఏళ్లు పూర్తవుతున్న ఈ చరిత్రాత్మక సందర్భాన్ని ప్రత్యక్షంగా చూడగలగడం నేటి తరం చేసుకున్న అదృష్టం అని అన్నారు.

‘‘బానిసత్వ కాలంలో మనం జన్మించి ఉంటే  మహోన్నతమైన ఇలాంటి ఒక రోజును ఆనాడు ఊహించగలిగి ఉండేవాళ్లమా?’’ అని ప్రశ్నిస్తూ.. ‘‘దేశ ప్రజలంతా నిబద్ధతతో, బాధ్యతల్ని గుర్తెరిగి మసులుకుంటూ, స్వాతంత్య్ర సమర యోధుల కలలను నిజయం చేసేందుకు వారి ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని నిర్మించుకోవాలన్నదే ఈ ఆజాదీ కా అమృతోత్సవ్‌ సందేశం’’ అని చెప్పారు. ఈ శుభ తరుణంలో ప్రతి ఒక్కరూ అమృతోత్సవాలలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని దేశ  ప్రధాని కోరారు.  

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)