Breaking News

అయోధ్య రాముని సన్నిధిలో 500 కేజీల డ్రమ్

Published on Fri, 01/12/2024 - 11:18

లక్నో: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అయోధ్య రాముని సన్నిధిలో 500 కిలోల డ్రమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. గుజరాత్‌ నుంచి 500 కిలోల డ్రమ్‌ను రథంపై అయోధ్యకు తీసుకొచ్చారు. గుజరాత్‌ కర్ణావతిలోని దర్యాపూర్‌లో దబ్గర్ కమ్యూనిటీ ప్రజలు డ్రమ్‌ను తయారు చేశారని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. రామాలయం ప్రాంగణంలో ఈ డ్రమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.     

సూర్యరశ్మి, వర్షానికి గురికాకుండా తట్టుకునేలా ఈ డ్రమ్ తయారు చేశారు. బంగారు, వెండి పొరలతో డ్రమ్ పూత పూయబడింది. ఇనుము, రాగి పలకలను ఉపయోగించి  డ్రమ్‌ను తయారు చేశారు. దీని శబ్దం కిలోమీటరు దూరం వరకు వినపడుతుంది. ఆలయ ట్రస్టుకు గుజరాత్ విశ్వహిందూ పరిషత్ నాయకుడు లేఖ పంపిన తర్వాత ఈ డ్రమ్‌ను ఏర్పాటు చేశారు.

రామమందిరాన్ని జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా వేలాది మంది వీక్షకులను ఆహ్వానించారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించిన కార్మికుల కుటుంబాలు కూడా ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలతో సహా 7,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 

ఇదీ చదవండి: రామ మందిర ప్రతిష్టాపన.. ఆ మూడు రాష్ట్రాల్లో 'డ్రై డే'


 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)