Breaking News

పీఓకేలో పాక్‌ సైన్యం అరాచకం..

Published on Thu, 10/02/2025 - 12:18

శ్రీనగర్‌: భారత సరిహద్దుల్లోని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో(POK) పాకిస్తాన్‌ సైన్యం రెచ్చిపోయింది. పీఓకేలో అరాచకం సృష్టించింది. పీవోకే ప్రజలు, ఆందోళకారులపై పాక్‌ సైన్యం(Pakistan Army) విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. దాదాపు 200 మంది గాయపడినట్టు సమాచారం. పాక్‌ సైన్యం కాల్పులతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నేతృత్వంలో కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని తమ 38 డిమాండ్లను అమలు చేయాలని ఏఏసీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో, భారీ సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. తమ ప్రాథమిక హక్కులను పాకిస్తాన్‌ హరిస్తోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, పాక్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్‌ పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించింది. ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. ఈ నిరసనలతో మార్కెట్లు, దుకాణాలు, రవాణా సేవలు నిలిచిపోయాయి. ఈ ఉదయం ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. తమను అడ్డుకునేందుకు బ్రిడ్జిలపై ఉంచిన షిప్పింగ్ కంటైనర్లను నదిలోకి నెట్టేశారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. ధిర్కోట్‌, ముజఫరాబాద్‌, బాఘ్‌, మిర్‌పుర్ ప్రాంతాల్లో పాక్‌ సైన్యం రెచ్చిపోయి కాల్పులకు తెగబడింది. దీంతో, 12 మంది పౌరులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఏఏసీ లీడర్ షౌకత్‌ నవాజ్‌ మిర్ పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుత నిరసనలు ప్లాన్‌-ఏ అని, ఇంకా తమ వద్ద వేరే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. 

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు