Breaking News

నిత్యం కాస్త ఎండ తగలాల్సిందే..! హెచ్చరిస్తున్న వైద్యులు

Published on Thu, 04/17/2025 - 09:35

గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకుంటున్నారన్న సామెత అచ్చం సిటీ ప్రజలకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఉదయం, సాయంత్రం.. వీలైనప్పుడు ప్రతిరోజూ కాస్త సమయం శరీరానికి ఎండ తగిలితే విటమిన్‌ డి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఆమాత్రం సమయం కేటాయించకపోవడం వల్ల వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ ఎముకలు, కండరాలు బలహీనపడిపోవడం, లివర్, కిడ్నీ, లంగ్స్, డయాబెటిస్, బీపీ, జుట్టు నుంచి గోర్ల వరకు వివిధ రోగాలు వస్తున్నాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (ఐసీఆర్‌ఐఈఆర్‌) సర్వే స్పష్టం చేస్తోంది. మన రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌నూ సరాసరి 92 శాతం మంది ప్రజల్లో విటమిన్‌ డి లోపం వేధిస్తోందని నివేదికల్లో పొందుపరిచారు. 

ఇండోర్‌ జీవన శైలితో విటమిన్‌ డి లోపం పెరుగుతోందని ఐసీఆర్‌ఐఈఆర్‌ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు అందించిన నివేదికలో పేర్కొన్నారు. పిల్లలు, కౌమార దశ, గర్భిణులు, వృద్ధులపై అధిక ప్రభావం కనిపిస్తోందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

2019–21లో దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరిలో విటమిన్‌ డి లోపం కనిపించగా, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 92 మందిలో ఈ లోపం కనిపిస్తోంది. ప్రధానంగా 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసున్న యువత, విద్యార్థుల్లో సైతం విటమిన్‌ డి లోపించడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా దీర్ఘకాలిక వైకల్యం సంభవించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. 

దేశంలో భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఏడాది పొడవునా సూర్యరశ్మి పుష్కలంగా లభిస్తుంది. అయితే చాలా మంది వ్యక్తులు ఇంటి నుంచి బయటకు రాకపోవడం, పెరుగుతున్న కాలుష్యం, పట్టణీకరణ, దట్టంగా నిండిన నివాస ప్రాంతాలు, లైఫ్‌స్టైల్‌ తదితరాలు విటమిన్‌ డి లోపానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. అధిక సమయం ఇల్లు, కార్యాలయాల్లో గడపటం, ఆధునిక జీవన శైలి సూర్యకాంతి ఎక్స్‌పోజర్‌ను తగ్గిస్తోందని ఐసీఆర్‌ఐఈఆర్‌ స్పష్టం చేస్తోంది. 

యువతలో ఎముకలు బలహీనపడుతున్నాయ్‌ 
నిమ్స్‌లో 2019–21 సంవత్సరాల మధ్య చేపట్టిన సర్వే, తాజాగా బీబీనగర్‌ ఎయిమ్స్‌లో జరుగుతున్న రీసెర్చ్‌ ఫలితాలు పరిశీలిస్తే పిల్లలు, వృద్ధులు, గర్భిణులతో పాటు ప్రధానంగా 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు గల విద్యార్థులు, యువతలో సైతం వెన్ను, నడుం నొప్పి, ఎముకలు, కండరాల బలహీనపడటం, జుట్టు రాలిపోవడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఈ పరిశోధనలో మొత్తం 700 మంది నివేదికలు పరిశీలించారు. అందులో యువత సుమారుగా 400 మంది ఉండగా, ఇతరులు మరో 300 మందికిపైగా ఉన్నారు. ఇంట్లో ఉన్న వారితో పోలిస్తే ఇంటి నుంచి బయటకు వచ్చే వారిలో ఈ లోపం కాస్త తక్కువగా ఉందని తేలింది. 

92 శాతం మందిపై ప్రభావం  
తెలంగాణ, హైదరాబాద్‌లో 92 శాతం మంది ప్రజల్లో విటమిన్‌ డి లోపం కనిపిస్తోంది. ఎముకలు, కండరాలు బలహీనపడతాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. శరీరానికి ఎండ తగలకపోవడం, స్మోకింగ్‌ వంటివి విటమిన్‌ డి లోపానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. యువతలోనూ ఈ తరహా లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజూ ఉదయం కాస్త సమయం ఎండ పడితే 
విటమిన్‌ డి శరీరానికి అందుతుంది. మంచి ఫలితాలు ఉంటాయి. 
– డా.మహేశ్వర్‌ లక్కిరెడ్డి, ఎయిమ్స్‌ బీబీనగర్‌  

(చదవండి: ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారు!)
 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)