భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
గిరిజన మహిళా నాయకుల మీద అనుచిత ప్రవర్తనపై వైఎస్ జగన్ ఆగ్రహం
కేసీ వేణుగోపాల్కు కీలక విషయాలు చెప్పిన రేవంత్ రెడ్డి
ఏపీలో ‘సర్’ గడువును పెంచిన ఎన్నికల కమిషన్
ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దు: వైఎస్ జగన్ కీలక సూచనలు
నేపాల్ వరదలు : మరోసారి సోనూసూద్ ఔదార్యం
నేపాల్ వరద బీభత్సం : మృత్యువుని చూసి వచ్చాం!
సీజేపీ నిరసనకారులకు సుప్రీంకోర్టు గుడ్న్యూస్
6 రోజుల్లొ 100 రెస్క్యూ ఆపరేషన్లు: ఎవరీ ప్రియా అధికారి?
ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి కుమారుడు అరెస్ట్
ఎస్సీవో వేదికగా పాక్కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
ఇంజన్ లోపం, ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఇంత దౌర్జన్యమా?.. పుష్పశ్రీవాణి కన్నీళ్లు
ఒకే ఫ్రేమ్లో మోదీ, జిన్పింగ్, పుతిన్, షరీఫ్
లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?
నేపాల్ విలయం.. ఇస్రో-నాసా నిసార్ నిద్రపోయిందా?
ఇది సాధారణ ఘటన కాదు: ప్రధాని బాలేంద్ర షా
మారికవలసలో టెన్షన్.. టెన్షన్
దీక్ష విరమణ వెనుక.. నిజాలు వెల్లడించిన వాంగ్చుక్!
ఇక్కడ ఊపిరే ఓ సవాల్.. భారత్లో అద్భుత గ్రామం!
హై టెన్షన్.. టీబీజేపీ చీఫ్ రాంచందర్రావు అరెస్ట్
ఇలా చేస్తే చర్మం నిత్య యవ్వనంగా ఉంటుంది!
Published on Thu, 02/29/2024 - 07:30
చర్మం ఎప్పటికి కాంతిమంతంగా ఉండాలంటే మన ఇంట్లో మనం నిత్యం ఉపయోగించవాటితో ఈజీగా పొందొచ్చు. ముఖ్యంగా కాల్షియం కోసం తాగే పాలతో ముఖాన్ని నిత్య యవ్వనంగా ఉండేలా చేసుకోవచ్చు. అంతేగాదు వార్థప్యపు లక్షణాలకు కూడా చెక్పెట్టొచ్చు. పాలతో చర్మ సౌందర్యం పెంచుకునే సింపుల్ చిట్కాలేంటంటే..
పాలతో చర్మ సౌందర్యం
- చర్మం కాంతిమంతంగా మెరవాలంటే క్రీమ్లు లోషన్లకు బదులు ఇంట్లో ఉండే పాలతో ప్రయత్నించి చూడండి.
- పచ్చి పాలలో దూదిని ముంచి మెడ, గొంతు, ముఖాన్ని తుడిస్తే చర్మం మీద పట్టేసిన మురికి (సబ్బుతో శుభ్రం చేసినప్పటికీ వదలని మురికి) వదిలిపోతుంది.
- రెండు టీ స్పూన్ల పచ్చిపాలలో టీ స్పూన్ శనగపిండి, రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కొద్దిగా నీటిని చల్లి వలయాకారంగా మసాజ్ చేస్తూ శుభ్రం చేయాలి.
- ముఖం మీద సన్నని గీతలతో చిన్న వయసులోనే వార్థక్యపు లక్షణాలు కనిపిస్తుంటే రోజూ మిల్క్ ప్యాక్ వేయాలి. ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసిన తర్వాత పచ్చి పాలలో దూదిని ముంచి ముఖం మీద అద్దాలి. పాలు ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేసి పెసరపిండి ప్యాక్ వేయాలి.
- రెండు టీ స్పూన్ల పెసర పిండిలో రెండుచుక్కల తేనె వేసి తగినంత నీటితో కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే చర్మం నిత్య యవ్వనంతో ఉంటుంది. వార్థక్య లక్షణాలు దూరమవుతాయి.
(చదవండి: గ్రీన్ టీ మంచిదని తాగేస్తున్నారా? దానివల్ల ఎదురయ్యే సమస్యలివే..!)
#
Tags : 1